సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన తరువాత శుద్ధ దశమిని రథసప్తమిగా భావిస్తారు. తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని మినీ బ్రహ్మోత్సవంగా పరిగణిస్తారు. తిరుమలేశుడు సప్తవాహనాలపై మాడ వీధులలో విహరిస్తారు. సూర్యోదయం నుంచి ఈ వాహన సేవ ప్రారంభమౌతుంది. అందులో భాగంగానే మంగళవారం (ఫిబ్రవరి 4) తిరుమలేశుడు తిరుమల మాడ వీధులలో సూర్య ప్రభ వాహనంపై విహరించారు. రాత్రి 9 గంటలకు చంద్ర ప్రభ వాహన సేవతో రథ సప్తమి ఉత్సవాలు ముగుస్తాయి. రథ సప్తమి ఉత్సవాలు ఒక తిరుమలలోనే కాకుండా టీటీడీ అనుబంధ ఆలయాలైన తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు తొమ్మిది ఆలయాలు, దేవుని కడప, ఒంటిమిట్ట కోదండరామాలయాల్లో కూడా ఘనంగా జరుగుతున్నాయి.
ఇక తిరుమలలో వేంకటేశ్వరస్వామి వాహన సేవల సమయం ఇలా ఉంది. సూర్యోదయం నుంచి ఎనిమిది గంటల వరకూ సూర్యప్రభ వాహన సేవ, ఉదయం 9 గంటల నుంచి చిన్న శేష వాహన సేవ, 11 గంటల నుంచి 12 గంటల వరకూ గరుడ వాహన సేవ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ హనుమంత వాహన సేవ, రెండు గంటల నుంచి మూడు గంటల వరకూ చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ కల్ప వృక్ష వాహన సేవ, ఆరు గంటల నుంచి 7 గంటల వరకూ సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు. ఇక చివరిగా రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకూ శ్రీవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారు. దాంతో తిరుమలలో రథ సప్తమి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ రథ సప్తమి ఉత్సవాలు ఒక్క తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రమే కాదు.. శ్రీవైష్ణవ ఆలయాలన్నిటిలోనూ ఘనంగా జరుగుతున్నాయి. రథ సప్తమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minibrahmotsavalu-begins-in-tirumala-25-192316.html
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.