మనోధైర్యానికి మించిన మందు లేదు...

Publish Date:Sep 8, 2021

Advertisement

మనం శారీరకంగా  బలంగా ఉంటె సరిపోదు మానసికంగా బలంగా ఉన్నప్పుడే దేనిని అయినా ఎదుర్కోగలం ఇది అందరు మానసిక నిపుణులు చెప్పేదే 
 మానసిక సంహర్షణకు గురి అవ్వడం మనవ సహజ లక్షణం సంఘర్షణలో వాస్తవాలు తెలుసుకోక పోవడం ఒకటి అయితే అన్నిటికీ భయపడడం ఎదో అయిపోయింది అన్న భయం అందరిని వెంటాడుతోంది. అంతా భయం గుప్పెట్లో బిక్కుబిక్కు మంటూ భయం భయం గా బతుకు తున్నాడు సామాన్యుడు.కాస్త దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, కొంచం ఒంట్లో వేడిగా ఉన్న ఆక్సి పల్స్ మీటర్ తో ఆక్సిజన్ తగ్గ గానే  అమ్మో కుయ్యో మొర్రో అంటూ  ఆసుపత్రికి వెళతామని ఇంట్లో ట్రీట్మెంట్ వద్దని అంటున్నారు మీకు పోసిటివ్ అనగానే,లేదా సిటి స్కాన్ లో ఇన్ఫెక్షన్ అనగానే భయానికి గురిఅవుతున్నారు సామాన్యజనం అలాగే చుట్టూ అదేపనిగా కుయ్ కుయ్ మంటూ అంబులెన్స్ కూతలు మరోవైపు రాత్రివేళ పోలీస్ సైరెన్ మోతలు వెరసి సామాన్యుడిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దగ్గర బంధువులు పోయరన్న వార్త దీనిమూలంగా పోయారని చెప్పగానే తీవ్ర మానోవేదనకు గురికావడం చ్చూస్తున్నాం.ముఖ్యంగా అయిన వాళ్ళందరికీ దూరంగా ఎక్కడో పట్టణంలో హాస్టల్ లో  ఉంటున్న   యువత తీవ్ర మనోవేదనకు  గురి అవుతున్నారని మానసిక  వైద్యులు వివరించారు.

ముఖ్యంగా ఒంటరిగా ఉన్నామన్న ఆందోళన తోనే  యువత తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఊరు పోదామంటే అక్కడ కరోనా ఇక్కడ ఒంటరి తనం నాకే కరోనా వస్తే దిక్కెవరు అన్న ప్రశ్న వారిని వేదిస్తోంది. మొత్తంగా తన చుట్టూ ఉన్నవాళ్ళకి కరోనా ఉందేమో అన్న భయం యువతను వేదిస్తోంది ఈసమస్యకు పరిష్కారం దొరకక కొట్టు మిత్తడుతున్న యువత నిరాశా నిస్పృహలకు గురిఅవుతున్నారు. ఇంకొందరు తనకు కరోనా వచ్చిందని  ట్రీట్ మెంట్ కి రూపాయిలేదని అందరినీ ఇబ్బంది పెట్టేబదులు తానే తనువు చాలిద్దామని రైలుకింద తల పెడదామని వెళ్ళాడు అక్కడ తనని అదృష్టం వెక్కిరించిందిఅలా ఒక్కసారి ఫెయిల్ అయినా మల్లె మళ్ళీ ప్రయత్నం చేసే స్వభావం వాళ్ళది వాళ్ళని ఇంట్లో వాళ్ళే  కనిపెట్టి గమనించాలి లేదా నూరేళ్ళ జీవితాన్ని ముగిస్తే పడే మానసిక వేదన తల్లి తండ్రుల కడుపుకోత కు గురిచేయడమే అంటున్నారు నిపుణులు.

ఇలా ఒక్కొక్కళ్ళది ఒక్కో వేదన ఇక నగరాలలో  ఇంకోసమస్య చిన్న చిన్న కంపె నీలలో చేసే ఉద్యోగుల  పరిస్థితి మరీ దయనీయం ముఖ్యంగా ఈ ఒక్క ఉద్యోగం పోతే బతుకుబండిని ఈడ్చేది ఎలా అనుకుంటూ పరుగుపరుగున బస్సులోపడి పోతున్నాడు సగటు కార్మికుడు అక్కడ బస్సులో రద్దీ గా ఉండడం తో తప్పక ఎక్కాల్సిన పరిస్థితి బస్సులో ఎవరికైనా కోరోనా ఉంటె  అమ్మో అటు రాక ఇటు ఇంటికిపోక బస్సులోనే అయినా తప్పని బతుకుపోరాటం. కుటుంబాన్ని నెట్టుకు రావాలని తాపత్రయం మొండి ధైర్యం తో బతికేస్తున్నాడు సగటు మధ్యతరగతి వాళ్ళు.ధైర్యాన్ని కోల్పోతే మానసికంగా కున్గిపోతారు అందుకే ధైర్యే సహాసే లక్ష్మి అన్నట్లు నియమాలు పాటిస్తూనే కరోనాతో పోరాడాలి ఒక మనోధైర్యం మరికొందరికి ప్రేరణ మానసికంగా కున్గిపోవద్దు పోరాడు 
ఒత్తిడికి ధైర్యానికి మధ్య సాగే ఘర్షణ మిమ్మల్ని నిర్వీర్యం చేయక ముందే ఒక నిర్ణయానికి రండి మానసిక ధైర్యానికి,మనో బలానికి   మించిన మరో మందులేదంటున్నారు మానసిక నిపుణులు.

కోరోనా వైరస్ ప్యండమిక్ శరవేగంగా విస్త రిస్తున్న వేళ ప్రపంచాన్ని ఊడ్చేస్తోంది. దానికి కారణం భయం ఏమౌతుందో అన్న ఆందోళన కారణం జనాభా వివిధ వర్గాలు అందులో వృద్ధులు రక్షణ కల్పించే వారు వివిదరకాల అనారోగ్య సమస్యల తో ఉన్న వారు ప్రజా ఆరోగ్యం- మానసిక ఆరోగ్యం అన్న విషయాన్ని 
విశ్లేషించి నప్పుడు. మానసిక ప్రభావం చాలా ఉంటుంది కారణం యాన్ క్సైటి, ఒత్తిడి.అనిమాత్రం అనుకుంటారు. ఈ మధ్య కాలంలో నూతనంగా పరిశీలించినప్పుడు మానసిక ప్రభావం ప్రత్యేకంగా క్వారంటైన్ లో ఉన్నప్పుడు వారు తీవ్ర ప్రభావానికి గురైనట్లు గిర్తించారు. వీరు సహజంగా చేసే కార్యక్రమానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల ఒంటరిగా ఉన్నామన్న వారిని ఒత్తిడికి గురిచేసింది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాణాంతక మైన మద్యం ఇతర మందులు లేదా  మత్తు పదార్ధాల వాడకం, వారిని వారు గాయ పరుచుకోడం. ఆత్మ హాత్య చేసుకోవలన్న ఆలోచన వారిలో పెరిగిందని మానసిక వైద్యులు గుర్తించారు.

ప్రజా ఆరోగ్యం బాధ్యత దృష్ట్యా డబ్ల్యు హెచ్ ఓ అధిక జనాభా గల దేశాలలో ఇప్పటికే చాలామంది పై  దీని ప్రభావం పడింది. లంబార్టీ, ఇటలీ ప్రాంతాలలో ఈసమస్యను గుర్తించి సేవలు అందిస్తున్నారు. ప్రజలు తీవ్ర మానసిక ఆందోళణ, యాంక్సాయిటీ వల్ల మానసికంగా కృంగి పోతున్నారు. మనో ధైర్యాన్ని 
కోల్పోతున్నారు.ఆరోగ్య కార్యకర్తలు లేదా ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్లు సైతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కున్తున్నట్లు గుర్తించారు. వారిలో ఆందోళణ కర స్థాయిలో అనారోగ్య సమస్యలు వారిని వేదిస్తున్నాయి.నేడు అవి ప్రాధాన అంశం గ మారి పోయింది. అనారోగ్యానికి చికిత్చ చేయవచ్చు మానసిక అనారోగ్యానికి చికిత్చ లేదనే చెప్పాలి ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో ఈ సమస్య చుట్టు ముట్టింది. మనకు ముఖ్యంగా జీవితం మనుగడ అన్నదే పెద్ద సవాలుగా మారింది. మనం తీసుకునే ఆహారం పూర్తిగా మనకు రోగ నిరోధక శక్తిని ఇస్తుందా నిద్ర అలసట లేదా అనారోగ్యం అనే భావన మనిషిని క్రుంగ దీస్తుంది అది వారి రోజు వారీ కార్యక్రమాల పై పడుతుంది. ఇలా ఇబ్బంది పడుతున్న వారిని బయటకు రప్పించాలి. అందుకే పెద్దవాళ్ళు శాస్త్రజ్ఞులు చెప్పేది ఒక్కటే మానసికంగా ఖుంగి పోకుండా  మానసికంగా ఉండాలంటే మనోధైర్యానికి మించిన మందు మరొకటి లేదు. 


                

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.