మెగాస్టార్ ఇంటర్వ్యూ: మనస్సాక్షికీ దట్టంగా మేకప్!!

Publish Date:Aug 23, 2014

Advertisement




 సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి, తనకున్న ప్రజాధారణతో ముఖ్యమంత్రి అవుదామనే కోరికతో మేకప్ తుడుచేసుకొని రాజకీయాలలోకి ప్రవేశించారు. కానీ ఆయనకు ఆశాభంగం అయింది. ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినా దానిని కాంగ్రెస్ చేతిలో పెట్టడం వలన కేంద్రమంత్రి అవగలిగారు. కానీ రాష్ట్ర విభజన కారణంగా అది కూడా మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఆయనకు రాజకీయాలలో మరో ఎదురు దెబ్బగా చెప్పవచ్చును. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ, సినీ, కుటుంబ జీవిత విషయాల గురించి మాట్లాడారు.

 

ప్రజలు, అభిమానులు, తోటి కళాకారులు ఒత్తిడి మేరకు తను మళ్ళీ సినీ రంగంలో అడుగుపెడుతున్నాని, తన 150వ సినిమా త్వరలోనే ప్రారంభిస్తానని తెలిపారు. అయితే నిజానికి ఆయన రాజకీయ భవిష్యత్ అంతా అందకారంగా కనిపిస్తుండటంతోనే, కాంగ్రెస్ కండువాను తీసి పక్కనబెట్టి, మళ్ళీ మొహానికి రంగులు వేసుకొనేందుకు తయారవుతున్నారని అందరికీ తెలుసు.

 

ఆయన కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించేందుకు పార్టీ ఎన్నికల ప్రచార రధసారధిగా భాద్యతలు స్వీకరించినపుడు, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి తుడిచి పెట్టేసేందుకు జనసేన పార్టీని స్థాపించారు. అప్పుడు చిరంజీవి తమ అభిమానులను జనసేన వైపు వెళ్ళకుండా కట్టడిచేసేందుకు గట్టిగానే ప్రయత్నించారు. అంతేకాక తన మరో సోదరుడు నాగబాబు, మరియు కొడుకు రామ్ చరణ్ తేజ్ ల ద్వారా మెగాభిమానులను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. కానీ ఆయన ఇప్పుడు తమ్ముడు జనసేన పార్టీ పెట్టడాన్ని తను ఎన్నడూ వ్యతిరేఖించలేదని, చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

 

ఆయన ఎన్నికల ప్రచారంలో “కాంగ్రెస్ పార్టీని తుడిచి పెట్టడం ప్రపంచంలో ఏ శక్తి వల్లా కాదని, కాంగ్రెస్ పార్టీని డ్డీకొన్నవారే కాలగర్భంలో కలిపోతారని ” దృడంగా చెప్పారు. ప్రజలపై తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభావం అంతంతమాత్రమేనని దానివల్ల కాంగ్రెస్ కి వచ్చే నష్టమూ ఏమీ లేదని కూడా మరీ వాదించారు. చివరికి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా తరువాత కూడా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభావం ఉందని అంగీకరించలేదు. కానీ ఆయన నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తమ్ముడు పవన్ కళ్యాణ్ కి తిరుగులేని ప్రజాధారణ ఉందని, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒక బలమయిన కారణమేనని అంగీకరించారు.

 

తను గెలిపించాలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీని తమ్ముడు రాష్ట్రం నుండే కాక దేశం నుండి కూడా సమూలంగా తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తుంటే, తమ్ముడు జనసేన పార్టీని పెట్టడం తనకు వ్యతిరేఖంగా కాక మద్దతుగానే పెట్టినట్లు భావిస్తున్నానని చెప్పడం మరో పెద్ద జోక్.

 

కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలుగుతునంత కాలం ఎన్నడూ తమ్ముడు ప్రస్తావన చేయని చిరంజీవి, ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిన తరువాత తమ రక్త సంబంధాన్ని వేరు చేసే శక్తి రాజకీయాలకు లేవని చెప్పుకోవడం హాస్యాస్పదం. తను ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ లక్ష్మణుడిలా సేవలు చేస్తే, తమ్ముడు తన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ పెట్టుకొంటుంటే దానిని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి, ఇప్పుడు తాను ఎన్నడూ వ్యతిరేఖించలేదని, తమ దారులు వేరయినా ఇద్దరి ఆశయం ప్రజలకు సేవ చేయడమేనని చిరంజీవి చెప్పడం చూస్తే ఆ అన్నదమ్ముల వ్యక్తిత్వాలలో, మనస్తత్వాలలో ఎంత వైరుద్యం ఉందో కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.

 

చిరంజీవి కేవలం ముఖ్యమంత్రి అవుదామనే ఏకైక లక్ష్యంతో రాజకీయాలలోకి వస్తే, పవన్ కళ్యాణ్ ప్రజల తరపున పోరాడేందుకు మాత్రమే వచ్చానని చెప్పడమే కాక, ప్రజాభిప్రాయలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చాలా శ్రమించారు.

 

రాష్ట్ర విభజన తరువాత అత్యంత దయనీయంగా మారిన రాష్ట్ర పరిస్థితులను సరిదిద్దేందుకు రాజ్యసభ సభ్యుడిగా యధాశాక్తిన కృషిచేయవలసిన చిరంజీవి, తన రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా కనబడుతుండటంతో మళ్ళీ సినిమాలలో నటించేందుకు సిద్దమయిపోవడం చూస్తే, రాష్ట్రం పట్ల, అందులో ప్రజల పట్ల ఆయన నిబద్దత ఎటువంటిదో అర్ధమవుతుంది. కర్నాటక రాష్ట్రానికి చెందిన జైరామ్ రమేష్, మన రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపిక అయినందున, ఆయన మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కేంద్రంతో పోరాడుతుంటే, మన రాష్ట్రానికి చెందిన చిరంజీవి సినిమాలలో నటించేందుకు సిద్దమయిపోవడం దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ కూడారాజకీయాలలోకి వచ్చి ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్నప్పటికీ, ఆయన ఏనాడూ అన్నలాగా ఏ పదవులు ఆశించలేదు. అనుభవించడంలేదు. కానీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి తన పూర్తి సమయాన్ని ప్రజాసమస్యల పరిష్కారం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించకుండా రాజకీయాలలో చేరిన తరువాత మసకబారిన తన పేరు ప్రతిష్టలను పునరుద్దరించుకోవడానికి మళ్ళీ సినిమాలలో నటించడానికి సిద్దమవుతున్నారు. నిబద్దత లేని ఇటువంటి పార్ట్ టైం రాజకీయ నాయకులు ఎంతమంది ఉంటే మాత్రం ఏమి లాభం? ఏమయినప్పటికీ చిరంజీవి నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో సగటు రాజకీయ నాయకుడిలాగే మాట్లాడారు. కానీ అది ఆయన మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని అద్దంలో చూపించినట్లుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.