మెగా హీరోకు భలే చౌక బేరం..రూ.24 కోట్ల భూమి 3.8 కోట్లకే ధారాదత్తం!

Publish Date:May 2, 2022

Advertisement

జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ హీరో చిరంజీవికి కారు చౌకగా 595 గజాల స్థలాన్ని కట్టబెట్టిన కుంభకోణం వెనుక ఉన్న పెద్దల పాత్రపై రోజుకో  పేరు తెరపైకి వస్తోంది. కుంభకోణం వెనుక పెద్దల హస్తంపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ పెరుగుతోంది. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ  గత 20 ఏళ్లుగా   జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే ఆ దర్యాప్తు ప్రారంభం కాకుండానే మరో భూ బాగోతం వెలుగులోనికి వచ్చింది.  మెగా హీరోకు ‘చిరు’ ధరకే సొసైటీకి చెందని స్థలాన్ని, అదీ ప్రభుత్వ   భూమిని సొసౌటీ  ఉదారంగా విక్రయించేసిన వైనం కలకలం రేపుతోంది.  వివరాలలోకి వెడితే.. చిరంజీవి గతంలో సొసైటీలోనే కొనుగోలు చేసిన స్థలం (ప్లాట్ నం.303 ఎన్)కు ఆనుకుని 595 గజాల స్థలం ఉంది. అయితే అది సొసైటీకి చెందిన స్థలం కాదు. సొసైటీ లే ఔట్ లో కూడా లేదు. అయినా కూడా సొసైటీ దానిని మెగాస్టార్ చిరంజీవికి గత అమ్మేసింది. గత నెల 20న రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. అదీ అలా ఇలా కాదు కారు చౌకగా... బహిరంగ మార్కెట్ లో ఈ భూమి గజం విలువ నాలుగు లక్షల వరకూ ఉంది. అంటే సొసైటీ చిరంజీవికి అమ్మేసిన 595 గజాల స్థలం విలువ రమారమి 24 కోట్ల రూపాయలు. అంత విలువైన భూమిని సొసైటీ మెగాస్టార్ చిరంజీవికి గజం 64 వేల చొప్పున కేవలం 3.80 కోట్ల రూపాయలకే విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించేసింది. సొసైటీ గత అక్రమాలపై ప్రభుత్వం విచారణకు సన్నద్ధమౌతుండగా కొత్తగా తెరపైకి వచ్చిన ఈ భూ బాగోతం సంచలనం సృష్టించింది. పైగా ఈ బాగోతంలో చిరంజీవి భాగస్వామి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

గత పాలక మండలి అక్రమాలపై ఫిర్యాదు చేసిన ప్రస్తుత పాలక మండలే నిబంధనలకు గాలికొదిలేసి ‘చిరు’ ధరకు కోట్లాది రూపాలయలు విలువ చేసే భూమిని మెగా స్టార్ కు ధారాదత్తం చేయడం  వెనుక పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
  ఈ భూ దందాపై ఇప్పటికే సంబంధిత అధికారులు, పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే ఇప్పుడు కారు చౌకగా మెగాస్టార్ చిరంజీవికి సొసైటీ  ‘చిరు’ ధరకే కట్ట బెట్టిన 595 చదరపు గజాల స్థలం చిరంజీవికి ఇప్పటికే సొసైటీలో ఉన్న 3333 చదరపు గజాల ప్లాట్ కు ఆనుకునే ఉంది.  అయితే చిరంజీవి ఇప్పుడు సొసైటీ నుంచి కొనుగోలు చేసిన 595 చదరపు గజాల స్థలం అసలు సొసైటీ స్థలమే కాదు. అయినా సొసైటీ దర్జాగా దానికి మెగాస్టార్ కు విక్రయించేసింది. ఈ బాగోతం బైట పడటంతో ప్రస్తుత సొసైటీ అది తమ తప్పు కాదు..పాత గవర్నింగ్ బాడీయే అప్రూవల్ చేసిందని చెప్పుకొస్తున్నది. అయితే గత సొసైటీ తప్పిదమైతే  ప్రస్తుత సొసైటీ దానిని రద్దు చేసే అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదన్న ప్రశ్న ఉత్పన్నమౌతున్నది. 


గత 20 ఏళ్లుగా జూబ్లీహిల్స్  కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అక్రమాలపై ఆరోపణలు, విమర్శలూ వెల్లువెత్తుతుంటే...వాటిపై విచారణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత కూడా కొత్తగా మరో కుంభకోణం చోటు చేసుకోవడం వెనుక పెద్దల హస్తం ఉందని అంటున్నారు.  ఇక చిరంజీవికి ఈ భూమి సొసైటీది కాదని తెలియక కొన్నారని కొందరు చేస్తున్న వాదన సబబుగా లేదు.   తాను కొత్తగా కొన్న 595 చదరపు అడుగుల భూమి, తనకు ఇప్పటికే సొసైటీలో ఉన్న స్థలానికి ఆనుకునే ఉంది. ఆ భూమిని ఆయన 1999లోనే కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ఏడాది ఏప్రిల్  20న ఈ తాజా రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంత కాలం తన స్థలానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం సొసైటీదో కాదా ఆయనకు తెలియదంటే నమ్మశక్యం కాదని సొసైటీ సభ్యులు అంటున్నారు. అన్నీ, అందరికీ తెలిసే ఈ అక్రమ భూ బాగోతం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ మొత్తం వ్యవహారంలో అక్రమాలు జరిగాయని   సొసైటీ సభ్యులు, న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.      

By
en-us Political News

  
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.