మెగా హీరోకు భలే చౌక బేరం..రూ.24 కోట్ల భూమి 3.8 కోట్లకే ధారాదత్తం!

Publish Date:May 2, 2022

Advertisement

జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ హీరో చిరంజీవికి కారు చౌకగా 595 గజాల స్థలాన్ని కట్టబెట్టిన కుంభకోణం వెనుక ఉన్న పెద్దల పాత్రపై రోజుకో  పేరు తెరపైకి వస్తోంది. కుంభకోణం వెనుక పెద్దల హస్తంపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ పెరుగుతోంది. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ  గత 20 ఏళ్లుగా   జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే ఆ దర్యాప్తు ప్రారంభం కాకుండానే మరో భూ బాగోతం వెలుగులోనికి వచ్చింది.  మెగా హీరోకు ‘చిరు’ ధరకే సొసైటీకి చెందని స్థలాన్ని, అదీ ప్రభుత్వ   భూమిని సొసౌటీ  ఉదారంగా విక్రయించేసిన వైనం కలకలం రేపుతోంది.  వివరాలలోకి వెడితే.. చిరంజీవి గతంలో సొసైటీలోనే కొనుగోలు చేసిన స్థలం (ప్లాట్ నం.303 ఎన్)కు ఆనుకుని 595 గజాల స్థలం ఉంది. అయితే అది సొసైటీకి చెందిన స్థలం కాదు. సొసైటీ లే ఔట్ లో కూడా లేదు. అయినా కూడా సొసైటీ దానిని మెగాస్టార్ చిరంజీవికి గత అమ్మేసింది. గత నెల 20న రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. అదీ అలా ఇలా కాదు కారు చౌకగా... బహిరంగ మార్కెట్ లో ఈ భూమి గజం విలువ నాలుగు లక్షల వరకూ ఉంది. అంటే సొసైటీ చిరంజీవికి అమ్మేసిన 595 గజాల స్థలం విలువ రమారమి 24 కోట్ల రూపాయలు. అంత విలువైన భూమిని సొసైటీ మెగాస్టార్ చిరంజీవికి గజం 64 వేల చొప్పున కేవలం 3.80 కోట్ల రూపాయలకే విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించేసింది. సొసైటీ గత అక్రమాలపై ప్రభుత్వం విచారణకు సన్నద్ధమౌతుండగా కొత్తగా తెరపైకి వచ్చిన ఈ భూ బాగోతం సంచలనం సృష్టించింది. పైగా ఈ బాగోతంలో చిరంజీవి భాగస్వామి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

గత పాలక మండలి అక్రమాలపై ఫిర్యాదు చేసిన ప్రస్తుత పాలక మండలే నిబంధనలకు గాలికొదిలేసి ‘చిరు’ ధరకు కోట్లాది రూపాలయలు విలువ చేసే భూమిని మెగా స్టార్ కు ధారాదత్తం చేయడం  వెనుక పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
  ఈ భూ దందాపై ఇప్పటికే సంబంధిత అధికారులు, పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే ఇప్పుడు కారు చౌకగా మెగాస్టార్ చిరంజీవికి సొసైటీ  ‘చిరు’ ధరకే కట్ట బెట్టిన 595 చదరపు గజాల స్థలం చిరంజీవికి ఇప్పటికే సొసైటీలో ఉన్న 3333 చదరపు గజాల ప్లాట్ కు ఆనుకునే ఉంది.  అయితే చిరంజీవి ఇప్పుడు సొసైటీ నుంచి కొనుగోలు చేసిన 595 చదరపు గజాల స్థలం అసలు సొసైటీ స్థలమే కాదు. అయినా సొసైటీ దర్జాగా దానికి మెగాస్టార్ కు విక్రయించేసింది. ఈ బాగోతం బైట పడటంతో ప్రస్తుత సొసైటీ అది తమ తప్పు కాదు..పాత గవర్నింగ్ బాడీయే అప్రూవల్ చేసిందని చెప్పుకొస్తున్నది. అయితే గత సొసైటీ తప్పిదమైతే  ప్రస్తుత సొసైటీ దానిని రద్దు చేసే అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదన్న ప్రశ్న ఉత్పన్నమౌతున్నది. 


గత 20 ఏళ్లుగా జూబ్లీహిల్స్  కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అక్రమాలపై ఆరోపణలు, విమర్శలూ వెల్లువెత్తుతుంటే...వాటిపై విచారణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత కూడా కొత్తగా మరో కుంభకోణం చోటు చేసుకోవడం వెనుక పెద్దల హస్తం ఉందని అంటున్నారు.  ఇక చిరంజీవికి ఈ భూమి సొసైటీది కాదని తెలియక కొన్నారని కొందరు చేస్తున్న వాదన సబబుగా లేదు.   తాను కొత్తగా కొన్న 595 చదరపు అడుగుల భూమి, తనకు ఇప్పటికే సొసైటీలో ఉన్న స్థలానికి ఆనుకునే ఉంది. ఆ భూమిని ఆయన 1999లోనే కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ఏడాది ఏప్రిల్  20న ఈ తాజా రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంత కాలం తన స్థలానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం సొసైటీదో కాదా ఆయనకు తెలియదంటే నమ్మశక్యం కాదని సొసైటీ సభ్యులు అంటున్నారు. అన్నీ, అందరికీ తెలిసే ఈ అక్రమ భూ బాగోతం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ మొత్తం వ్యవహారంలో అక్రమాలు జరిగాయని   సొసైటీ సభ్యులు, న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.      

By
en-us Political News

  
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.