మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారం సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ సంచలనంగా మారింది. రహస్యంగా మేకలు, గొర్రెల వంటి మూగజీవాల రక్తాన్ని అక్రమంగా సేకరించి, బయటకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మటన్ షాప్ను కేంద్రంగా చేసుకుని మూగజీవాల నుంచి అడ్డగోలుగా రక్తం సేకరిస్తూ, దాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించి... మటన్ షాప్ యాజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ను కూడా అరెస్ట్ చేసి... వారి వద్ద నుంచి 180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ రక్తాన్ని ప్లేట్లెట్స్ తయారీతో పాటు కొన్ని వ్యాధులను నయం చేస్తామని నమ్మబలికి విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే సరైన వైద్య ప్రమాణాలు, అనుమ తులు లేకుండా ఇలా రక్తం సేకరించడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుంచి రక్తం తీసుకోవడం వల్ల అవి ఒక రోజు తర్వాత మృత్యువాత పడుతున్నాయని జంతు హక్కుల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది మూగజీవాలపై అమానుష చర్యగా పేర్కొంటూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరిదైనా ప్రమేయం ఉందా? ఈ రక్తం ఎక్కడికి తరలించేవారు? ఎవరికెవరికీ సరఫరా చేసేవారు? అన్న కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ రక్త వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.ఈ ఘటనతో నాగారం సత్యనారాయణ కాలనీలో భయాందోళన వాతావరణం నెలకొంది. మూగజీవాల రక్షణకు కఠిన చర్యలు అవసరమన్న డిమాండ్ మరింత బలపడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/medchal-malkajgiri-district-36-211982.html
రాజాసాబ్ సినిమా టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటీషన్లపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది.
హైదరాబాద్ నగర శివారులోని మీర్పేట్ ప్రాంతంలో చోటు చేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు.
పక్క రాష్ట్రంతో సయోధ్య లేకుండా తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రాదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డికి హైకోర్టులో కీలక ఊరట లభించింది.
పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు.
ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో నవదీప్ను నిందితుడిగా చేర్చడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసుపై విస్తృతంగా వాదనలు విన్న హైకోర్టు.. నవదీప్ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలూ స్వాధీనం కాలేదని స్పష్టం చేసింది.
టాలీవుడ్ హీరో నవదీప్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేరుతో...ఫేక్ నెంబ ర్ తో..ఆయన ఫొటోతో వాట్సాప్ క్రియేట్ చేసి మెస్సేజ్ లు పంపిస్తున్నారని వెల్ల డైంది.
జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైద్యులకు కరోనా మహమ్మారి నుంచి రక్షణకు కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడమే జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టడానికి కారణమైంది. ప్రభుత్వ డాక్టర్ అని కూడా చూడకుండా.. విశాఖపట్నం వీధుల్లో ఆయనను అర్థనగ్నంగా చేసి, చేతులు వెనక్కి విరిచి కట్టి పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
న్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పశ్చిమబెంగాల్ లోని ఐప్యాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో.. గతంలో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది. ఆ ఆర్థిక అవకతవకలపై కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆ పరిస్థితి లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది.