బంగ్లాదేశ్ లో మశూచి మరణమృదంగం.. భారత్ కూ వ్యాపించే ప్రమాదం!

Publish Date:Apr 29, 2026

Advertisement

బంగ్లాదేశ్‌ను మీజిల్స్ (మశూచి)  మహమ్మారి వణికిస్తోంది. గడిచిన కొన్ని వారాల్లోనే ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి దాదాపు 300మందికి పైగా మరణించారు.  మృతులలో అత్యధికులు చిన్నారులే. గత రెండు దశాబ్దాలలో ఇంతటి తీవ్రమైన స్థాయిలో మీజిల్స్ వ్యాపించడం ఇదే మొదటిసారి.   దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో  కేసులు నమోదవుతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. 

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు  బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాలకు గానూ 58 జిల్లాల్లో మీజిల్స్ వేగంగా విస్తరిస్తోంది.  దాదాపు 90 శాతం దేశం మీజిల్స్  ప్రభావానికి గురైంది. మార్చి మధ్య కాలం నుండి ప్రారంభమైన ఈ వ్యాప్తి ఉధృతి   ఏప్రిల్ ఆఖరు నాటికి పతాక స్థాయికి చేరింది. సుమారు 30 వేల మందికి పైగా చిన్నారులు.. మీజిల్స్ లక్షణాలతో బాధపడుతుండగా, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.   పోషకాహారలోపం ఉన్న పిల్లలు మీజిల్స్ బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. 

ఈ స్థాయిలో మీజిల్స్ ప్రబలడానికి గత రెండేళ్లుగా బంగ్లాదేశ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కుంటుపడటమే  కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2024లో దేశంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత, నిరసనల కారణంగా అప్పట్లో జరగాల్సిన సామూహిక టీకా కార్యక్రమాలు జరగలేదు. దీనికి తోడు వ్యాక్సిన్ల కొరత కూడా తోడవడంతో చిన్నారులలో రోగనిరోధక శక్తి తగ్గిపోయిందంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తోంది. తగిన సమయంలో బూస్టర్ డోసులు అందించకపోవడం వల్ల  మీజిల్స్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉందని చెబుతున్నారు. 

కాగా మీజిల్స్ వ్యాధి తీవ్రత, వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ  కీలక ప్రకటన చేసింది. మీజిల్స్ బంగ్లాదేశ్ పొరుగున ఉన్న మయన్మార్, భారత్ వంటి దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.    బంగ్లాదేశ్ నుండి ఇండియా, మయన్మార్ వంటి దేశాలకు జనాభా రాకపోకలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వైరస్ సరిహద్దులు దాటే ప్రమాదం ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..  ముఖ్యంగా కోల్‌కతా వంటి సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించింది. మీజిల్స్ అనేది   గాలి ద్వారా సోకే, అత్యంత వేగంగా వ్యాపించే వ్యాధి కావడంతో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. సుమారు 1.8 కోట్ల మంది చిన్నారులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కొన్ని లక్షల మందికి అత్యవసర వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు.  రాబోయే రోజుల్లో ఈ మహమ్మారిని కట్టడి చేయకపోతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలకు జ్వరం లేదా చర్మంపై దద్దుర్లు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.  

By
en-us Political News

  
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.