వైసీపీలో ప్రస్తుతం ‘మావిగన్’ చిచ్చు రేపుతోంది. అమరావతికి బదులుగా రాష్ట్ర రాజధానిగా మావిగన్ అంటూ జగన్ చేసిన ప్రకటన వైసీపీలో నిట్టనిలువుగా చీలిక వచ్చేలా కనిపిస్తోందన్న అభిప్రాయం పరిశీలకులనుంచి వ్యక్తం అవుతోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని ప్రాంతంగా ప్రకటించాలంటూ జగన్ చేసిన ప్రతిపాదన ప్రకంపనలు పార్టీలో ఇంకా కొనసాగుతున్నాయి. అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని.. ఇప్పుడు మావిగన్ అంతకు మించి నష్టం చేరుస్తుందని అంతర్గత సంభాషణల్లో గట్టిగా చెబుతున్నారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన సోదరులు మావిగన్ తో విభేదిస్తున్నారు. జగన్ ప్రతిపాదనపై వారిరువురూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమచారం. జగన్ ఎవరితో చర్చించి మావిగన్ అన్నారని వారు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు అయితే మావిగన్ విషయంలో తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. ఇటీవల ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో అయితే.. మావిగన్ పై తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ఓ సీనియర్ వైసీపీ నేత కూడా మావిగన్ ప్రకటనను తప్పుపట్టారు. పార్టీలో సీనియర్లతో కనీసం చర్చించకుండా జగన్ చేసిన ప్రకటేన సరికాదన్నారు. సీనియర్లతో చర్చించాలన్న ఆలోచన కూడా జగన్ చేయకపోతే.. ఇక తాము పార్టీలో ఉండి ప్రయోజనమేంటన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mavigan--spark---rift-in-ycp-39-219201.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.