మథుర ఘర్షణల్లో అసలు కోణం "ఆస్తి"

Publish Date:Jun 6, 2016

Advertisement

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి 29 మంది పోలీసుల మృతికి కారణమైన మథుర ఘర్షణల గురించి రోజుకొక కొత్త విషయం బయటకు వస్తోంది. ధనమూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. మనిషి ఎంత కష్టపడినా డబ్బు కోసమే..తన తరువాతి తరాలు హాయిగా కాలు మీద కాలేసుకుని నిశ్చింతగా గడపాలని నీతిగానో..అవినీతిగానో కోట్లు వెనకేస్తుంటాడు. అలాంటి డబ్బు అప్పనంగా వస్తుంటే ఎవడు మాత్రం వద్దంటాడు చెప్పండి. తనకే దక్కుతుందనుకున్న ఆస్తి..తీరా వేరే ఎవరికో దక్కితే ఎలా ఉంటుంది. ఆ మనిషి ఆగ్రహంతో ఊగిపోడు. దానికి పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందనడానికి మథుర జవహర్‌బాగ్ పార్క్ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.

 

1975..జనవరి 13 కాన్పూర్‌ నగరంలోని నానా పార్క్‌లో ఓ ర్యాలీ జరగాల్సి ఉంది. ఆ ర్యాలీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాల్గొంటారంటూ అంతకు ముందే నగరమంతా ప్రచారం జరిగింది. కానీ అప్పటికి 30 ఏళ్ల క్రితమే నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయారని అందరికి తెలుసు. కానీ నేతాజీ బతికే ఉన్నారని ఆయన అనుచరులు వాదిస్తూ వస్తున్నారు. దీంతో నేతాజీని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ పార్క్‌కు వెళ్లారు. తెల్ల గడ్డంతో తెల్లబట్టలు వేసుకున్న ఒక వృద్ధుడు వేదిక ఎక్కాడు.. నేనే సుభాష్ చంద్రబబోస్‌నని ప్రకటించాడు. అంతే ఆయన మరో మాట మాట్లాడకుండా జనం ఆ పెద్దాయనపై చెప్పులు, రాళ్లు, కుళ్లిన గుడ్లు విసిరారు. ఆ టైంలోనే దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో గురుదేవ్‌ను అరెస్ట్ చేశారు. అయితే అధికారం కోల్పోయాక స్వయంగా ఇందిరాగాంధీ ఆ ఆశ్రమానికి వెళ్లి తనను క్షమించమని వేడుకున్నారు.

 

 

ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ఆయన వద్దకు పరిగెత్తుకు వచ్చారంటే ఆయన దగ్గర అంత శక్తి ఏముంది అనుకుంటున్నారా..? ఆయన ఒక బాబా. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి..గురువును అన్వేషించుకుంటూ ఇల్లొదిలి పోయాడని, ఆలీగఢ్‌లో గురెలాల్ శర్మ అనే రుషిని కలిసి జీవిత పరమార్థం తెలుసుకున్నాడని ఆయన శిష్యులు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత అనేక ఆశ్రమాలు నెలకొల్పి భక్తి మార్గాన్ని ప్రచారం చేశాడు.  అనంతర కాలంలో "దూరదర్శి" పార్టీ పెట్టి శాకాహారులనే అభ్యర్థులుగా నిలబెడతానని గురుదేవ్ ప్రకటించాడు. అయితే వరుస ఓటములు పలకరించడంతో రాజకీయాలు మనకు సరిపడవని ఆథ్యాత్మిక ప్రవచనాలకే పరిమితమయ్యాడు. అయితే మథుర నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన భూమి ఆక్రమణలో ఉన్నదని ఆ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. ఆ భూమిలో అక్రమ తవ్వకాలు సాగిస్తూ విలువైన పురాతన విగ్రహాలను దొంగిలిస్తున్నారని పురావస్తు శాఖ ఆరోపించింది. ఈ క్రమంలో 116 వయస్సులో 2012లో జైగురుదేవ్ మరణించారు. ఈ భక్తి ముసుగులో ఆయన వేలకోట్ల రూపాయలు పొగేశారని ఆరోపణలున్నాయి. ఢిల్లీ-మధుర హైవేపైనా, ఇటావా జిల్లాలో పలు విలాసవంతమైన ఆశ్రమాలు, రూ. 150 కోట్ల విలువచేసే లగ్జరీ కార్లు ఇలా జైగురుదేవ్‌కు యూపీ సహా దేశవ్యాప్తంగా 12 వేల కోట్ల ఆస్తులున్నట్లు తేలింది. ఆయన మరణానికి ముందే తన డ్రైవర్ పంకజ్ యాదవ్‌ను తన వారసుడిగా ప్రకటించారు.

 

దీంతో జైగురుదేవ్ అనుచరుడిగా ఉన్న రాంవృక్ష యాదవ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆస్తులపై పట్టు సాధించేందుకు  జవహర్‌బాగ్ పార్క్‌ను తన అడ్డాగా చేసుకున్నాడు. వెయ్యి మందితో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేశాడు. దీని పేరే "ఆజాద్ భారత వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రాహి". దీని సాయంతో పంకజ్‌ను అంతమెందించి, అతని నుంచి జైగురుదేవ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే రాంవృక్ష యాదవ్ ప్రధాన లక్ష్యం. ఇయనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే అక్కడకు మారణాయుధాలు తెస్తున్నా, బాంబులు పోగేసుకుంటున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోదు. ఇంత చేసుకున్నా చివరికి రాంవృక్ష యాదవ్‌కు చావే మిగిలింది. పోలీసులను అడ్డుకునేందుకు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సిలిండర్లను పేల్చారు. ఆ పేలుళ్లలో యాదవ్ మరణించినట్టు పోలీసులు నిర్థారించారు. ఇలాంటి వ్యక్తులను అదుపు చేయకపోతే ఏమవుతుందో మథుర ఉదంతం నిరూపించింది. దీనిని గుణపాఠంగా భావించి సంఘానికి చీడ పురుగుల్లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.