భార్యను, ఇతరులతో చెరిపించిన భర్త..
Publish Date:Jun 2, 2021
Advertisement
యుగాలు ఏవైనా, వేదాలు ఏవైనా, చరిత్ర ఏదైనా, రాజ్యం ఏదైనా, రాజ్యం ఏదైనా, అప్పటి నుండి ఇప్పటి వరకు మహిళలపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు, మరిన్ని శిక్షలు విధించిన మహిళలు, మగాళ్ల వాంఛ కత్తులు బలి అవుతూనే ఉన్నారు. తాజాగా ఒక మహిళకు పెళ్లి అయింది. ఆ తర్వాత భర్త తో విడిపోవడం. ఆ తర్వాత మల్లి ఆమెకు బలవంతంగా పెళ్లి చేయడం. మళ్ళీ మొదటి భర్త సీన్ లోకి రావడం తీవ్రంగా కొట్టి పరాయి వ్యక్తులతో అత్యాచారం చేయించాడు. వివరాలు తెలుసుకుందాం. ఓపెన్ చేస్తే.. అది పశ్చిమ గోదావరి జిల్లా. జంగారెడ్డిగూడెం పట్టణం. ఓ వివాహితపై అత్యాచారం జరిగింది. టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామానికి చెందిన మహిళ (25)కు కొంత కాలం క్రితం వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకుల తీసుకుని ఒంటరిగా ఉంటోంది. అయితే ఈ నేపథ్యలోనే ఆ ఒంటరిగా ఉన్న ఆ మహిళకు ఏప్రిల్ 23న హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన మల్లికార్జునరావుతో ఆమెకు బలవంతంగా మళ్లీ వివాహం జరిపించారు. ఆ పెళ్లి ఇష్టంలేని పెళ్లి చేశారని, ఆమెకు ఆ వ్యక్తితో ఉండడం ఇష్టం లేదని మే నెల 23న పుట్టింటికి తిరిగి వచ్చేసింది. అయితే 25వ మహిళకు భర్త, అత్త రమణ ఫోన్ చేసి తాము జంగారెడ్డిగూడెంలో ఉన్నామని, అక్కడకు రావాలని ఆమెకు సూచించారు. ఆ తర్వాత ఆమెపై మిస్సింగ్ కేసు పెట్టామని, తమ వద్దకు రాకపోతే ఇంటికి పోలీసులు వస్తారని నమ్మబలికారు. ఆమె అత్తా తన భర్త. ఇక అంటే జంగారెడ్డిగూడెం వచ్చిన ఆ ఒంటరి మహిళను అత్త, భర్తతో పాటు అప్పలరాజుగూడేనికి చెందిన దాసరి రవిచంద్రకుమార్, చల్లా నాగసుబ్రహ్మణ్యం తీవ్రంగా కొట్టారు. తర్వాత ఇంటి వద్ద దింపుతామంటూ రవిచంద్రకుమార్, నాగసుబ్రహ్మణ్యం ఆమెను బైక్ ఎక్కించుకుని నమ్మపలికాయారు ఇక అంతే మార్గం మధ్యలో ఆమె పై సామూహిక అత్యాచారానికి పాల్పడారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాుదు చేసింది. తన భర్త ప్రోద్బలంతోనే వారిద్దరు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులతో పాటు ఆమె భర్త, అత్తపైనా కేసు నమోదు చేశారు.
http://www.teluguone.com/news/content/married-woman-gang-raped-25-116759.html





