Publish Date:Apr 20, 2022
మర్రి రాజశేఖర్. ఈ చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. జగనన్న చేతిలో పదే పదే మోస పోతున్న బాధితుడిగా ఆయనపై అందరికీ సానుభూతి కూడా ఉంది. ఒకటి రెండుసార్లు కాదు.. రజనీ కోసం జగన్రెడ్డి ఆయనకు పలుమార్లు హ్యాండ్ ఇచ్చారు. అనేక సార్లు మాటతప్పి, మడమ తిప్పారు. పదవులు ఇచ్చేందుకు ముందుకురాని జగనన్న.. పార్టీ పనుల్లో వాడుకోవడానికి మాత్రం మర్రి గుర్తుకొచ్చారని అంటున్నారు. తాజాగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వైసీపీ సమన్వయ బాధ్యతలు ఆయనకు అప్పగించారు.
విడదల రజనీ కోసం.. వైసీపీ నుంచి ఎమ్మెల్యే సీటు వదులుకుంటే.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మర్రి రాజశేఖర్ను మంత్రిగా చేస్తానని గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ చిలకలూరిపేట నడిబొడ్డున నిలబడి హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో బలమైన నాయకుడిగా, పార్టీకి మొదటినుంచీ దన్నుగా ఉన్న మర్రిని కాదని రజనీ వైపు జగన్ మొగ్గు చూపడం వెనుక పెద్ద మొత్తంలో డీల్ జరిగిందని కూడా అంటారు. అందుకే, ఆమె కోసమే.. ఎమ్మెల్సీ హామీతో మర్రి రాజశేఖర్ను పక్కన పెట్టేసి.. రజనీని ఎమ్మెల్యేను చేశారు. పోనీ.. ఇచ్చిన మాటైనా నిలబెట్టుకున్నారా అంటే అదీ లేదు. గత మూడేళ్లుగా.. పలుమార్లు, పదుల సంఖ్యలో ఎమ్మెల్సీలనైతే ఎంపిక చేశారు కానీ.. అందులో మర్రి రాజశేఖర్ పేరు మాత్రం ఉండేది కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల పేరు వినిపించినప్పుడల్లా.. మర్రికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరిగేదు. రేసులో ఆయన అందరికంటే ముందుండేవారు. కానీ, ఇప్పటి వరకూ ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. ఇక మంత్రి ఎలా చేస్తారు? ఇచ్చిన హామీని తుంగలో తొక్కి.. మర్రికి ఇస్తానన్న మంత్రి పదవిని.. ఆయన ప్రత్యర్థి రజనీకి ఇచ్చి.. ఆమెను మినిస్టర్గా మరింత అందలం ఎక్కించారు. విశాఖ జిల్లా పార్టీ ఇంఛార్జిగానూ నియమించి మరింత ప్రాధాన్యం, ప్రమోషన్ కల్పించారు. కానీ, మర్రిని ఇంకా ఎమ్మెల్సీనే చేయలేదు జగన్రెడ్డి. బహుషా కమ్మ కావడమే ఆయనకు శాపంగా మారిందేమో అంటున్నారు.
మర్రి రాజశేఖర్కు ఇంతగా అన్యాయం చేసిన జగనన్న.. తాజాగా పార్టీ పదవుల్లో ఆయన అనుభవాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వ పదవులేమో రజనీకి.. పార్టీ బాధ్యతలు, పనులేమో మర్రికి. రజనీని ఏకంగా మంత్రిని చేశారు.. మర్రికి ఇంకా ఎమ్మెల్సీనే ఇవ్వలేదు కానీ, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ సమన్వయ బాధ్యతలు అప్పగించి ఆయనతో ఊడిగం చేయించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. కొడాలి నాని మినహా.. వైసీపీలో కమ్మ వర్గీయులకు ఇంతకంటే ప్రాధాన్యం ఏం ఆశించగలమని చెబుతున్నారు. మర్రి రాజశేఖర్ను మంత్రిని చేయడం ఏమో గానీ.. కనీసం ప్రజల మధ్య, ప్రజల సాక్షిగా ఇచ్చిన ఎమ్మెల్సీ హామీనైనా నెరవేర్చు జగనన్నా.. అంటున్నారు చిలకలూరిపేట వైసీపీ నాయకులు. అన్నీ రజనీకేనా.. మర్రిని మోసం చేయొద్దని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/marri-rajashekar-vs-vidadala-rajini-39-134687.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.