Publish Date:Mar 31, 2020
వందేళ్ల చరిత్ర కలిగిన మర్కజ్ నిజాముద్దీన్ ఏటా సమావేశాలు నిర్వహిస్తుంటుంది. చర్చలు, నమాజులు వంటి కార్యక్రమాలు ఇక్కడ సర్వసాధారణం. దేశ విదేశాల నుంచి ఇక్కడికి హాజరయ్యే వారి కోసం ఏటా సమావేశాల తేదీలను ముందే ఖరారు చేస్తారు. ఈసారీ తేదీలు ముందే ఖరారు అయ్యాయి. కానీ 21న ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పిలుపుతో మధ్యలోనే ఆపేశారు. అప్పటికే వివిధ దేశాలతో పాటు రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింలు సమావేశాల్లో బిజీగా ఉన్నారు.
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జమాత్ ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న మర్కజ్ రాత్రి 9 గంటల వరకూ ఎవరినీ బయటికి పంపలేదు. తర్వాత అదే రోజు రాత్రి ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించింది. జనతా కర్ఫ్యూ ముగిసినా, తర్వాత రోజు ఉదయం లాక్ డౌన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్ధరాత్రి పలువురు విదేశీయులు వెళ్లిపోయారు. కానీ దేశీయంగా ఉన్న వారు మాత్రం పూర్తిగా వెళ్లలేకపోయారు. అప్పటికే కొందరు విదేశీయుల్లో కరోనా లక్షణాలు ఉండటంతో వారు ఇతరులకు అంటించారు.
లాక్ డౌన్ ఉన్నందున అక్కడే ఉండిపోయిన వందలాది మందిని ఖాళీ చేయాలని స్ధానిక అధికార యంత్రాంగం మధ్యలో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చింది. లాక్ డౌన్ ఉన్నందున స్వస్ధలాలకు వెళ్లేందుకు వీలుగా వీరికి పాస్ లు మంజూరు చేయాలని మర్కజ్ నిర్వాహకులు కోరడంతో అధికారులు 17 వాహనాలకు అనుమతి ఇచ్చారు. అయినా కొందరు వెళ్లలేకపోయారు. 28న అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించాగా.. వీరిలో కొందరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వీరిని క్వారంటైన్ కు పంపారు.
లాక్ డౌన్ నిబంధనలు ఉండగానే మర్కజ్ లో జనం మర్కజ్ లో ఉండటంపై ఫేస్ బుల్ లో పోస్టులు వెలిశాయి. దీంతో కేజ్రివాల్ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. అయితే లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వాధికారులతో చర్చిస్తున్నట్లు మర్కజ్ సమాధానం ఇచ్చింది. అయితే ఆ తర్వాత కేజ్రివాల్ సర్కారు చర్యలకు ఆదేశించడంతో మర్కజ్ ఇవాళ మరోసారి వివరణ ఇచ్చింది. విదేశీయులకు కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంతో పాటు వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ ప్రటకన తర్వాత వెంటనే పంపకపోవడమే కొంప ముంచినట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/markaz-nizamuddin-incident-39-96629.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.