మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దాదా మృతి

Publish Date:Apr 3, 2026

Advertisement

మావోయిస్టు అగ్రనేత,  పొలిట్‌బ్యూరో సభ్యుడు  ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దాదా కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు.  జార్ఖండ్‌లో జైలులో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన ఆయనను రాంచీలో  రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (ఏప్రిల్ 3) మరణించారు.  మరణించారని అధికారులు తెలిపారు.  
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రశాంత్ బోస్, మావోయిస్టు ఉద్యమంలో అత్యంత ప్రభావమంతమైన నాయకులలో ఒకరు.  కేంద్ర కమిటీ,  పొలిట్‌బ్యూరోలో కీలక సభ్యుడిగా ఉండటంతో పాటు, ఆ సంస్థ యొక్క తూర్పు ప్రాంతీయ బ్యూరో కార్యదర్శిగా కూడా పనిచేశారు.ప్రశాంత్ కిషోర్ కిషన్ దాదా, మనీష్, బుద్ధ పేర్లతో కూడా గుర్తింపు పొందారు. 

2021 నవంబర్ 12న, సెరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని కంద్రా టోల్ బ్రిడ్జి సమీపంలో బోస్‌ను అతని భార్య షీలా మారండీతో పాటు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆయన తలపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.   ప్రశాంత్ బోస్  జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో పలు ఘటనలో పాల్గొన్నారు.  నాలుగు దశాబ్దాలుగా చురుకుగా ఉన్న ఆయన మావోయిస్టులకు కీలక వ్యూహకర్తగా,  సిద్ధాంతకర్తగా ఉన్నారు.  అరెస్టు అయినప్పటి నుంచి బోస్ జ్యూడీషియన్ కస్టడీలో ఉన్నారు.    

మావోయిస్టు అగ్రనేతలు అయిన నంబాల కేశవరావు, చెరుకూరి రాజ్‌కుమార్, పటేల్ సుధాకర్ రెడ్డి తదితరులతో కలిసి పని చేసిన ప్రశాంత్ బోస్ పీపుల్స్ వార్.  ఎంసిసి విలీనంలో కీలకపాత్ర పోషించారు.  విభిన్న విప్లవ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రశాంత్ బోస్ మృతి మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. నాలుగు దశాబ్దాల పాటు అండర్‌గ్రౌండ్ రాజకీయాల్లో కొనసాగిన ఆయన జీవితం ఇప్పుడు ముగిసింది.

By
en-us Political News

  
15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొడుతూ ఐర్లాండ్ సిరీస్‌లో హిస్టరీ సృష్టించనున్న వైభవ్ క్రేజ్, ఐపీఎల్ రికార్డులు మరియు మాజీ క్రికెటర్ నరసింహారావు చేసిన ఆసక్తికర వ్యాఖ్యల పూర్తి వివరాలు.
మీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ నుండి టిడిఎస్ (TDS) కట్ కాకుండా ఉండాలంటే ఫామ్ 15G, ఫామ్ 15H ఎలా సమర్పించాలో మరియు కొత్తగా రాబోతున్న ఫామ్ 121 నియమాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
తెలంగాణ టీ20 (TG20) లీగ్‌లో మెదక్ ఫాల్కన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అజేయ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. 259 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి జట్టుకు విజయాన్ని అందించిన తిలక్ వర్మ మ్యాచ్ హైలైట్స్ మరియు హెచ్‌డీ ఫోటోలు ఇక్కడ చూడండి.
అర్జెంటీనాలో లియోనెల్ మెస్సీ క్రేజ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పటగోనియాలో 26 మీటర్ల భారీ విగ్రహంతో పాటు బ్యూనస్ ఎయిర్స్‌లో 1300 మంది అభిమానుల సంతకాలతో కూడిన అద్భుతమైన మురళీ పెయింటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-5 మంగళగిరిలో ఘనంగా ప్రారంభం కానుంది. పెద్ది విజయంతో జోష్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రానుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. పూర్తి షెడ్యూల్ మరియు మ్యాచ్ వివరాలు ఇక్కడ చూడండి.
2026లో భారత ఐటీ రంగంలో భారీ పతనం నమోదైంది. TCS, ఇన్ఫోసిస్, విప్రో సహా టాప్ 10 ఐటీ స్టాక్స్ ఏకంగా 38% వరకు కుప్పకూలాయి. విదేశీ ఇన్వెస్టర్లు ₹60,000 కోట్లను వెనక్కి తీసుకోవడానికి గల కారణాలు, ఏ షేరు ఎంత శాతం నష్టపోయిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆదాయం తక్కువగా ఉన్నా ఐటీఆర్ ఫైల్ చేయాలా? విదేశీ ఆస్తులు, రూ. 50 లక్షల బ్యాంక్ డిపాజిట్లు, రూ. 1 లక్ష కరెంట్ బిల్లు వంటి 9 కీలక నిబంధనలు మరియు AY 2026 27 ఆదాయపు పన్ను మార్గదర్శకాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
మీ మొబైల్ బిల్లులను భారీగా తగ్గించుకునే సువర్ణావకాశం. 100GB నుండి 900GB వరకు భారీ డేటా, ఉచిత అంతర్జాతీయ కాల్స్ అందించే టాప్ 5 బెస్ట్ EOFY సిమ్-ఓన్లీ ప్లాన్ల వివరాలు మీకోసం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూన్ 24, 2026 నాటి టీ-బిల్ వేలం ఫలితాలను విడుదల చేసింది. 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల ట్రెజరీ బిల్లుల అలాట్‌మెంట్ స్టేటస్, లేటెస్ట్ వడ్డీ రేట్లు (Yields) మరియు ఆన్‌లైన్ చెకింగ్ ప్రాసెస్ ఇక్కడ చూడండి.
జూలై 1 నుంచి జపాన్ వీసా ఫీజులు భారీగా పెరగనున్నాయి. సింగిల్, మల్టిపుల్ ఎంట్రీ వీసా కొత్త ధరలు, VFS ఛార్జీలు మరియు భారతీయులపై పడే ప్రభావం గురించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల భారతీయ ఐటీ రంగానికి ముప్పు ఉందా? ఇన్ఫోసిస్ 45వ ఏజీఎంలో కంపెనీ ఛైర్మన్ నందన్ నీలేకని, సీఈఓ సలీల్ పరేఖ్ చేసిన సంచలన వ్యాఖ్యలు, ఉద్యోగాల భర్తీపై కీలక అప్‌డేట్స్ మీకోసం.
ఒకవేళ ఉగ్రవాదులు తిరుమలలోకి చొరబడి, కీలకమైన ప్రాంతాలను లేదా భక్తులను తమ అధీనంలోకి తీసుకుంటే వారిని ఎలా మట్టుబెట్టాలనే అంశంపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించింది ఆక్టోపస్.. అత్యాధునిక ఆయుధాలు ధరించిన 45 మందికి పైగా అక్టోపస్ కమాండోలు ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నప్రసాద భవనం, లడ్డూ పోటు వంటి రద్దీ ప్రాంతాలలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.
2026 లో ఈపీఎఫ్ఓ (EPFO) నిబంధనల ప్రకారం పెళ్లి, పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు కొనుగోలు మరియు హోమ్ లోన్ రీపేమెంట్ కోసం మీ పీఎఫ్ అకౌంట్ నుండి ఎంత అడ్వాన్స్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చో మరియు దానికి ఉండాల్సిన సర్వీస్ అర్హతల పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.