మంగళగిరి వైసీపీ ఖాళీ?.. అదే దారిలో గాజువాక?

Publish Date:Dec 11, 2023

Advertisement

వైసీపీ నుంచి వలసలు గట్టు తెగిన వరద గోదారిలా సాగుతున్నాయి. ఇంత కాలం అసమ్మతిని, అసంతృప్తిని పంటిబిగువున దాచుకుని పిల్లిమెడలో గంట కట్టేదెవరన్నట్లుగా ఉన్న వైసీపీ నేతలకు ఆ గంట కాస్తా కట్టేసి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దారి చూపారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ, శాసన సభ్యత్వానికీ కూడా రాజీనామా చేసేశారు.

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ ఫార్మాట్ లో అందించారు. అయితే జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల రాజీనామా వేనుక విపక్ష తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాన్న కుట్ర ఉందన్న అభిప్రాయం కూడా రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నది. ఆళ్ల దారిలో మరి కొందరు కూడా నడుస్తారనీ, వారి వారి నియోజకవర్గాలలో బీసీలను నిలబెడతామన్న ప్రచారం ద్వారా వైసీపీ తెలుగుదేశం బీసీ బేస్ ను బద్దలు కొట్టాలన్న కుట్రలో భాగమే ఆళ్ల రాజీనామా అన్న ప్రచారం ఒక పక్క జరుగుతోంది.

అది పక్కన పెడితే ఆళ్ల రాజీనామాతో మంగళగిరిలో వైసీపీ ఖాళీ అయిపోతుందా అన్న రీతిలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇలా ఆళ్ల రాజీనామా చేయగానే అలా నియోజకవర్గ పరిధిలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు రాజీనామాల బాట పట్టారు. ఇప్పటి వరకూ   వైసీపీ పార్టీ పదవులకు తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షుడు,  జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, తాడేపల్లి పట్టణ జేసీఎస్ కన్వీనర్ ఈదులముడి డేవిడ్ రాజ్, జిల్లా  సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి,  మంగళగిరి రూరల్ మండలం   కన్వీనర్ అన్నపురెడ్డి బ్రహ్మర్గన రెడ్డి తమ తమ పదవులకు రాజీనామాలు చేసేశారు. అయితే ఇది ఇక్కడితో ఆగేలా లేదని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా గంజి చిరంజీవి నియామకం ఖరారైన నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారని అంటున్నారు.

అసలు గంజి చిరంజీవి  వైసీపీలో చేరిన నాటి నుంచే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి మంగళగిరిలో ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఇక అనివార్యంగా ఆయన పార్టీకి రాజీనామా చేశారని అంటున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయం సాధించిన తరువాత జగన్ కేబినెట్ లో స్థానం దక్కుతుందని అంతా భావించారు. అప్పుడే కాదు, ఆ తరువాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలోనూ ఆళ్లకు జగన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఒకింత అసంతృప్తికి లోనైనా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలలో తనకు టికెట్ దక్కే అవకాశం లేదని తేలడంతో పార్టీ నుంచి వైదొలిగారు. అయితే వైసీపీలో ఈ రాజీనామాల పర్వం ఒక్క  మంగళగిరి నియోజకవర్గంతో ఆగదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే గాజువాక నియోజకవర్గం నుంచి కూడా రాజీనామాల పర్వం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే తిప్పన కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డిలాగే జయంట్ కిల్లర్. గత ఎన్నికలలో ఆయన గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విజయం సాధించారు. జయంట్ కిల్లర్ గా తనకు జగన్ కేబినెట్ లో స్థానం కల్పిస్తారని ఆశించారు. అయితే జగన్ అసలు తిప్పన పేరునే పరిశీలించలేదు. ఇక పోతే ఏడు పదులు పైబడిన వయస్సున్న తిప్పన వచ్చే ఎన్నికలలో తనకు బదులుగా తన కుమారుడు తిప్పన దేవన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఇంతలో ఏమైందో కానీ ఎమ్మెల్యే కుమారుడు దేవన్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసేశారు. మొత్తంగా ఇంత కాలం వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్నఅసంతృప్తి ఇప్పుడు నిప్పుల గుండంగా బయటపడుతోందని, ఈ రాజీనామాల పర్వం రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు విస్తరించే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.