నా మాటంటే మాటే! నన్నెదిరించే వారెవ్వరూ...
Publish Date:Aug 17, 2012
Advertisement
జడ్జీలు డబ్బులు తీసుకుని తీర్పులు ఇస్తున్నారంటూ న్యాయవ్యవస్థపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై అటు సుప్రీంకోర్టులోను, ఇటు హైకోర్టులోను కోర్టు ధిక్కరణ కేసులు దాఖలయ్యాయి. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ తాను కేవలం విలువలతో కూడిన న్యాయవ్యవస్థ, మీడియా గురించే మాట్లాడాననీ, అయితే` మీడియానే తన మాటలను వక్రీకరించిందని ఆరోపించారు. ఒకవేళ అదే తప్పయితే ఒక్కసారి కాదు, వెయ్యిసార్లయినా అదే వ్యాఖ్యలు చేస్తానని చెప్పడం గమనార్హం. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఆమెపై కోర్టు ధిక్కరణ చర్య తీసుకోవాలంటూ సీనియర్ న్యాయవాది బికాష్ భట్టాచార్య మౌఖికంగా చేసిన అభ్యర్ధనను కోలకతా హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయనేతలకు ముందు వ్యాఖ్యలు చేయడం ఆపైన లేదు నేను అలా అనలేదు అదంతా వక్రీకరించారు అనడం పరిపాటైపోయింది. అయితే ఇక్కడ మమతాబెనర్జీ తాను కేవలం విలువలతో కూడిన న్యాయవ్యవస్థ, మీడియా గురించే మాట్లాడాననీ, అదే తప్పయితే వెయ్యిసార్లయినా అదే వ్యాఖ్యలు చేస్తానని చెప్పడం ఫైర్బ్రాండ్ అన్న పేరును సార్ధకం చేసుకున్నా, ఎన్నో ఉన్నత పదవుల్లో కొనసాగి, నేడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఓ పార్టీకి అధినేతగా కొనసాగుతూ ఎంతో అనుభవం ఉండి, ఆచితూచి మాట్లాడుతూ, పరిపాలన చేయవలసిన ఓ నేతే అలా మాట్లాడారని చెబుతుంటే ఇక సామాన్యులకు ఆయా వ్యవస్థలపై నమ్మకం పోతుంది. అంతేకాదు భవిష్యత్లో ఆయా నేతలపై కూడా ఘాటైన వ్యాఖ్యలు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎంతగా ‘నేనంటే నేనే... నా మాటంటే మాటే..నన్నెదిరించే వారెవ్వరు...’ అంటూ ఓ సినీగీతంలా ఈ మాటలు అన్నా భవిష్యత్లో ఇటువంటి మాటలే ఆమె పాలనపై, ఆమెపై వస్తే పరిస్థితి ఏమిటన్నది ఆలోచించాల్సిన విషయం!
http://www.teluguone.com/news/content/mamata-benerjee-allegations-on-judges-20-16615.html
సామాన్యుడైనా..ప్రముఖుడైనా ఎవరికైనా అమ్మ అమ్మే. మదర్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ అమ్మకు పాదాభివందనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ
ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికలు, మరోవైపు 2012 ఉపఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయభేరి రాష్ట్రంలో చర్నోపచర్చలకు దారితీశాయి. రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. ఈ తరుణంలో ఎం.ఐ.ఎం. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెంచల్ గూడ జైలుకు వెళ్ళి
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇద్దరూ ఈ జిల్లా వారే. దీంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని వీరిద్దరూ పట్టుదలగా ఉన్నారు.
కేరళ :శబరిమల యాత్ర చివరి రోజున పొన్నాంబళంమేడు కొండల్లో అయ్యప్పస్వామి ౩ సార్లు మకర జ్యోతి రూపంలోదర్శనంతో భక్తులు పులకించిపొయారు.జ్యోతి దర్శనానికి అయ్యప్ప భక్తులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శించుకునేందుకు వీలుగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లుచేశారు.పోలీసులు,వైద్యశాఖ, ఆగ్నిమాపక విభాగం పులిమేడులో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. పంచలిమేడు,పరుంతుపరల నుంచి కూడా మకర జ్యోతిని స్పష్టంగా చూడగలిగారు.
NTR Shakti has 18 Previews – Truly a new Tollywood record – Indeed, for the first time in the history of Telugu cinema, NTR Shakti. Whether you call it a paid preview or a benefit show or NTR Shakti is coming out all guns blazing with a record of 18 previews in Mumbai, Chennai, Pune, etc





