Publish Date:Oct 21, 2024
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మామూలోడు కాదు. ఆయన రాజకీయ నాయకుడే .. వ్యాపారవేత్త, ప్రముఖ విద్యాసంస్థల అధినేత కూడా. ఆయన ఏం మాట్లాడినా? ఏం చేసినా సంంచలనమే అవుతుంది. పూలమ్మినా, కట్టెలమ్మినా, పాలమ్మినా అంటూ ఆయన మాస్ డైలాగులతో చాలా చాలా పాపులర్ అయ్యారు. రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నా ఆయన డైలాగుల్లో పంచ్ మాత్రం అలాగే ఉంటుంది. ఆ కారణంగానే ఆయన పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పరిస్థితి.
గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మల్లారెడ్డి సభలు, సమావేశాలు, ప్రసంగాలకు మంచి స్పందన లభించింది. ‘ఔను.. పూలమ్మినా.. పాలమ్మినా’ అంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన ఒక్క ప్రసంగం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అటువంటి మల్లారెడ్డి తాజాగా మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఆయన డ్యాన్స్ సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం ఈ నెల 27 న జరగనున్న విషయం తెలిసిందే. దీనికి ముందు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య సంగీత్ ఫంక్షన్ నిర్వహించారు. ఆ ఈవెంట్ వేదికగానే మల్లారెడ్డి తన మాస్ స్టెప్పులతో చెలరేగిపోయారు. ఏడు పదుల వయస్సులోకూడా ఆయన కుర్రాళ్లతో సమానంగా మాస్ స్టెప్పులు వేసి అలరించారు. గతంలో పలు ఈవెంట్లలో మల్లారెడ్డి చేసిన డ్యాన్సులు ఒకెత్తు, ఈ సారి డ్యాన్సు స్టెప్పులు మరో ఎత్తు అన్నట్లుగా ఆయన డ్యాన్స్ ఉంది. సంగీత్ లో మాస్ స్టెప్పులు వేయడం కోసం మల్లారెడ్డి కొరియోగ్రాఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి మనవరాలి పెళ్లి సంగీత్ లో మల్లారెడ్డి స్టెప్పులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది సిటీగా మారిపోయాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mallareddy-mass-dance-39-187151.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!