శ్రీలంకలో మలేరియా మాయం... మరి మనమో!

Publish Date:Sep 17, 2016

Advertisement

 

మన పక్కనే ఒక బిందువులా కనిపించే ఓ చిన్న దేశం శ్రీలంక. నిన్నమొన్నటి వరకూ నిరంతర అంతర్యుద్ధంతో అతలాకుతలమైపోయిన దేశం. ఇప్పుడిప్పుడే ఆక్కడ ప్రశాంతమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాంటి ఓ దేశం ఊహించని అద్భుతాన్ని సాధించింది. మలేరియా రహిత దేశంగా సగర్వంగా నిలిచింది. పెద్దన్నలాంటి మన దేశానికి కూడా ఆదర్శంగా నిలిచింది. ఆ విజయగాధ...

 

అనుకూలమైన పరిస్థితులు

శ్రీలంకలో అడవుల శాతం ఎక్కువ. నీటి లభ్యతకీ కొదవేమీ లేదు. పైగా చుట్టూ సముద్రమే! దోమలకు ఇంతకంటే స్వర్గధామం ఏముంటుంది. ఇక శ్రీలంకలో గ్రామీణ ప్రాంతాలే అధికం కాబట్టి, ఏదన్నా వ్యాధి వస్తే దానికి చికిత్స తీసుకోవాలన్న అవగాహన కూడా తక్కవే! దాంతో ఒకప్పుడు లక్షలాది మలేరియా కేసులు నమోదయ్యేవి. వేలాదిమంది జనం పిట్టల్లా రాలిపోయేవారు.

 

యుద్ధం మొదలు

శ్రీలంక ప్రభుత్వం ఆది నుంచీ కూడా మలేరియా మీద ఉక్కుపాదం మోపుతూనే ఉంది. మలేరియా పరీక్ష కోసం చేసిన రక్తపరీక్షల ఫలితాలను 24 గంటలలోనే అందించడం, డీడీటీ వంటి రసాయనాలతో దోమల వ్యాప్తిని నిరోధించడం వంటి జాగ్రత్తలను పాటించేది. ఇక 1958 నాటికి మలేరియా మీద పూర్తిస్థాయి యుద్ధాన్నే ప్రకటించింది. ఇందుకోసం కొలంబియాలో ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. మలేరియాని అదుపుచేసేందుకు ఉపయోగించే డీడీటీ ప్రమాదకరం అని తేలిపోవడంతో సరికొత్త ప్రణాళికలతో తన యుద్ధాన్ని కొనసాగించింది.

 

ఇవీ చర్యలు

- మలేరియా గురించి, దాని నివారణ చికిత్సల గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహనను కలిగించడం.

- మలేరియా బారిన పడిన రోగులకు సత్వర చికిత్స అందించడం ద్వారా, వారి నుంచి ఆ రోగకారకాలు ఇతరులకు చేరకుండా చూసుకోవడం.

- వర్షపాతం, నీటిప్రవాహం వంటి సూచనల ఆధారంగా మలేరియా ప్రబలే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అక్కడకు తగిన వైద్య సిబ్బందిని పంపించడం.

- దేశంలో నమోదవుతున్న మలేరియా కేసులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఎక్కడ ఆ వ్యాధి ప్రబలుతోందో గమనించడం. భవిష్యత్తులో ఆ ప్రాంతాల మీద మరింత దృష్టిని సారించడం.

- ఒకపక్క మలేరియాని నివారించడం కోసం తగినన్ని నిధులను కేటాయిస్తూనే, మరో పక్క ఆ వ్యాధి మీద మరింత పట్టుని సాధించేందుకు పరిశోధనలు సాగించడం.

... ఇలా రకరకాలా చర్యలతో గత మూడు సంవత్సరాలుగా దేశీయంగా ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఐక్యరాజ్యసమితి శ్రీలంకను మలేరియారహిత దేశంగా ప్రకటించింది.

 

మరి మనమో!

మన దేశంలో మలేరియా అంటే సర్వసాధారణమైన విషయం. ఏటా దాదాపు పదిలక్షలమందికి పైగా జనం ఇక్కడ మలేరియా బారిన పడుతూ ఉంటారు. ఇక ఓ వెయ్యమంది వరకూ ఈ వ్యాధితో మృత్యుఒడిని చేరుతూ ఉంటారు. శ్రీలంకంతో పోల్చుకుంటే ఇక్కడ జీవనవిధానాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాల దగ్గర నిధులకి కానీ, జనాల దగ్గర చదువుకి కానీ కొరత లేదు. కానీ లేనిదల్లా చిత్తశుద్ధి మాత్రమే! ఈ ఏడాది మన దేశం కూడా మలేరియాను 2030నాటికి సమూలంగా నాశనం చేస్తామని ప్రతిన పూనింది. అంటే మరో పదిహేను సంవత్సరాలకు కానీ మనం మలేరియా రహిత భారతదేశాన్ని చూడకపోవచ్చునన్నమాట! మన ఆరోగ్యశాఖల తీరుని గమనిస్తే అప్పటికైనా ఇది సాధ్యమేనా అన్న అనుమానమూ కలగక మానదు.

 

- నిర్జర.

By
en-us Political News

  
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి..
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.