కడపలో తెలుగుదేశం మహానాడు.. అసలీ ఆలోచన ఎవరిదో తెలుసా?

Publish Date:May 27, 2025

Advertisement

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా ఆ పార్టీ పెద్ద పండుగ మహానాడును కడపలో నిర్వహిస్తున్నారు. మంగళవారం (మే 27)న ప్రారంభమైన మహానాడు గురువారం (మే 28) వరకూ సాగుతుంది. కడప అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. దశాబ్దాలుగా కడప వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా నిలుస్తోంది. పార్టీలూ, హవాలతో సంబంధం లేకుండా కడప వైఎస్ కు అండగా నిలుస్తూ వస్తున్నది. వైఎస్ మరణానంతరం కడప జగన్ కు కంచుకోటగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, విభజిత రాష్ట్రంలో కూడా గత ఏడాది జరిగిన ఎన్నికల వరకూ కడపలో వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం. అయితే ఆ అధిపత్యానికి 2024 ఎన్నికలలో గండి పడింది. కడపలోని పది నియోజకవర్గాలకు గాను ఏడింటిలో తెలుగుదేశం కూటమి విజయఢంకా మోగించింది. వైసీపీ కేవలం మూడంటే మూడు స్థానాలకు పడిపోయింది.

అయితే ఇంత కంటే ముందే కడపలో జగన్ కోటకు బీటలు వారడం మొదలైంది. అందకు బీజం లోకేష్ పాదయాత్రతో పడిందని చెప్పవచ్చు. నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో భాగంగా  రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఆ సందర్భంగానే జగన్ కడపకోటను బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారు. 2024 ఎన్నికలలో నభూతో అన్న స్థాయిలో విజయాన్ని అందుకున్న తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టంది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ కడపలో తెలుగుదేశం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేశారు. వేస్తున్నారు. అందులో భాగంగానే రాయలసీమ ప్రాంతంలో ఇంధన, ఆటోమొబైల్ ప్రాజెక్టుల స్థాపన కేసం విశేష కృషి చేసి సాధించారు. వీటికి అదనంగా సాగునీటి ప్రాజెక్టులూ చేపట్టారు. దీంతో సీమ జీవన ముఖ చిత్రం మొత్తం మారిపోయే పరిస్థితికి వచ్చింది. జరుగుతున్న అభివృద్ధి, పెరుగుతున్న ఉపాధి అవకాశాల కారణంగా జనం తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పార్టీ మెగా ఈవెంట్ గా చెప్పబడే మహానాడును కడపలో నిర్వహించాలని నారా లోకేష్ ప్రతిపాదించారు. నారా లోకేష్ ప్రతిపాదనకు పార్టీ అధినేత చంద్రబాబు సహా మొత్తం క్యాడర్, లీడర్ ఆమోదముద్ర వేసింది. మహానాడు నిర్వహణతో కడప జిల్లాలో తెలుగుదేశం పట్టు పెంచుకుని బలోపేతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని లోకేష్ గట్టిగా వాదించారు. కడపలో మహానాడు నిర్వహణ విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు కడపలో మహానాడు నిర్వహణతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందన్న విశ్వాసం పార్టీ వర్గాల్లో మెండుగా ఉంది. లోకేష్ ముందు చూపునూ, వైసీపీ కంచుకోటనే ఢీ కొని బీటలు వారేలా చేయడంలో ఆయన చూపిన ధైర్యం ఇప్పుడు కార్యకర్తల మన్ననలు అందుకుంటోంది. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.