Publish Date:Aug 26, 2025
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ కాలేజీలో మూడు లోడ్ల మద్యం ఉందంటూ కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టకున్న ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎమ్మెల్యేగా తనకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తన హత్యకు కుట్రపన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గత 15 నెలలుగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెడుతున్న తనపై కక్షగట్టి వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
కావలి ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి తన అవినీతి, అక్రమాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని విమర్శించారు. రాజకీయాలలోకి రాకముందు నుంచే తనకు క్వారీ వ్యాపారం ఉందన్న కావ్యకృష్ణారెడ్డి. కావలి నియోజకవర్గానికి సంబంధం లేని ఉదయగిరిలొ ఉన్న క్వారీ మీద అధికారులతో దాడి చేయించారని, న్యాయస్థానం వైసీపీ హయాంలోనే తనకు క్లియరెన్స్ ఇచ్చిందనీ పేర్కొన్నారు.
ప్రజలు చిత్కరించుకుంటుంటే తట్టుకోలేని ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిలో శాంతిభద్రతల విఘాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కావలిలో రౌడీ షీటర్లు సంస్కృతిని పెంచి పోషించిందే ప్రతాప్ కుమార్ రెడ్డి అని పేర్కొన్న కావ్యకృష్ణారెడ్డి డోన్ కెమేరాలతో తన కదలికలను పసిగట్టే ప్రయత్నం చేశారన్నారు.
ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న ప్రతాప్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి కాకణి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. హత్యారాజకీయాలలో ఆరితేరిన కాకణి, ప్రతాప్ రెడ్డిలు ఇద్దరు కల్తీ మద్యం ముద్దాయిలు, దొంగలు అని విమర్శించారు. తనపై ఒక్కటంటే ఒక్క కేసు లేదనీ, అదే కాకాణిమీదైతే 14 కేసులు కాకణి, ప్రతాప్ కుమార్ రెడ్డి ఎనిమిది కేసులలో ముద్దాయిలుగా ఉన్నారని కావ్య విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/madyamload-in-kavali-former-mla-engineering-college-39-205069.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.