మాధవీలతకు బీజేపీ నేతల మద్దతు కరవు

Publish Date:Mar 29, 2024

Advertisement

హైదరాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవీలతకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తూ, ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో బీజీపీ హై కమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. 1984 నుంచి ఇప్పటి వరకూ హైదరాబద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సలావుద్దీన్ ఒవైసీ, ఆయన తరువాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ గెలుస్తూ వస్తున్నారు. ఆ నియోజకవర్గంలో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే ఫలితం మాత్రం కనిపించడం లేదు. అయితే ఈ సారి హైదరాబాద్ లో బీజేపీ పాగా వేసేందుకు ఒకింత సానుకూల వాతావరణం ఉందన్న అంచనాలు ఏర్పడ్డాయి.

గత పదేళ్లుగా బీఆర్ఎస్ తో అంటకాగిన ఎంఐఎం పట్ల నియోజకవర్గ ప్రజలలో ఒకింత అసంతృప్తి ఉందని బీజేపీ భావిస్తోంది. దీంతో  ఈ సారి ఎలాగైనా హైదరాబాద్ లోక్ సభ స్థానంలో విజయం సాధించాలన్న పట్టుదలతో  బీజేపీ అడుగులు వేస్తున్నది. అయితే హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికలో మాత్రం బీజేపీ హై కమాండ్ తప్పుటడుగు వేసిందని పార్టీ రాష్ట్ర నాయకులు అంటున్నారు. స్థానిక నేతలెవరినీ సంప్రదించకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సిఫారసు మేరకు మాధవీలతకు పార్టీ టికెట్ కేటాయించడంతో పోటీ జరగకుండానే పార్టీ పరాజయం ఖరారైపోయిందన్న అభిప్రాయం బీజేపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతున్నది. 

పార్టీ అభ్యర్థిగా మాధవీలత ప్రచార కార్యక్రమాలలో బీజేపీ రాష్ట్ర నాయకులెవరూ కనిపించడం లేదు. ఆమె కొద్ది మంది తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో ప్రచారం నిర్వహించుకుంటున్నారు.  అసలు మాధవీలత అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ ప్రకటించిన వెంటనే పార్టీ నాయకుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యింది. బీజేపీ ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. పార్టీకి హైదరాబాద్ లో పోటీ చేయడానికి మగాళ్లే దొరకలేదా అని ఘాటు విమర్శలు సైతం చేశారు. వాస్తవానికి హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాజాసింగ్ టికెట్ ఆశించారు. అయితే ఎవరినీ సంప్రదించకుండా బీజేపీ హైకమాండ్ ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటి వరకూ మాధవీలత తరఫున ప్రచారంలో పాల్గొనలేదు.

అలాగే హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచీ గుర్తింపు ఉన్న నాయకులెవరూ మాధవీలతకు మద్దతు పలికిన దాఖలాలు లేవు. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా బీజేపీ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ మాధవీలత కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం (మార్చి 29) సాయంత్రం జరగాల్సిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలెవరూ హాజరయ్యే అవకాశాలు లేవని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. మాధవీలత అభ్యర్థిత్వం విషయంలో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుల అసంతృప్తి అధిష్ఠానం బుజ్జగింపులతో తగ్గిపోయే పరిస్థితులు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. కనీసం పార్టీ సభ్యురాలు కూడా కాని మాధవీలతకు పార్టీ టికెట్ ఇచ్చి మరీ పార్టీ కండువా కప్పడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఎంఐఎంకు బీజేపీ ఏ మేరకు పోటీ ఇవ్వగలుగుతుందన్నది అనుమానమేనని అంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణలో అధికారం కోల్పోయిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోని తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ గత కొన్ని రోజులుగా జనంలోకి వచ్చి ఆడుతున్న డ్రామాలు చూస్తూ జనం ఫ్రీ
ఎప్పుడైనా ఎన్నికల వేళకి అధికార పార్టీలో ఒక స్పష్టత ఉంటుంది. అధికారంలో ఉన్న కాలంలో చేసిన అభివృద్ధీ, ప్రజలకు అందించిన సంక్షేమం వివరించి ఓట్లు అడగడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే వాస్తవంగా అధికారంలో ఉన్న కాలంలో అభివృద్ధి సంక్షేమాలపై ప్రభుత్వం ప్రజలమెప్పు పొందిందా లేదా అన్నది ఓటర్లు తమ ఓటు ద్వారా తీర్పు ఇస్తారు. అది వేరే సంగతి.
నిజానిజాల సంగతి పక్కన పెడితే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచారాలు కోటలు దాటేస్తాయి. పార్టీలు, నేతలు చెప్పేది ఏది నిజం, ఏది అబద్ధం అన్నది వేరే విషయం. ఎవరి మాటలను జనం విశ్వసిస్తున్నారు. ఎవరి మాటలను నమ్మడం లేదు అన్నది జనం ఓటుతో చెప్పే వరకూ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఎవరికీ తెలియదు.
వైసీపీకి ఇప్పుడు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో అన్నీ కలిసివచ్చి అందలం దక్కింది. ఈ సారి అన్నీ ఎదురుతిరిగి అధికారం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా పార్టీ అధినేత, సీఎం జగన్ రంగంలోకి దిగి బస్సు యాత్ర చేపట్టినా జనంలో స్పందన కనిపించలేదు. చివరాఖరికి సొంత గడ్డ కడపలో కూడా జగన్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది. ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు.
కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు.
వల్లభనేని వంశీ నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.
డోన్ నియోజకవర్గం వైైసీసీ అభ్యర్థి మంత్రి  బుగ్గన నామినేషన్ పెండింగ్లో పడింది.   మంత్రి బుగ్గన రాజేంద్రనాథ నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో ఉంచారు.
ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.
హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ భార్య వసుంధర నామినేషన్! అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.