Publish Date:Aug 10, 2022
గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో విషయంలో వైసీపీలో తడబాటు స్పష్టంగా కనబడుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ వైసీపీ ఈ
దిక్కుమాలిన వీడియో విషయంలో మాధవ్ ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఈ విషయంలో
గోరంట్ల మాధవ్ ను వెనకేసుకు రావడానికి ఆ పార్టీ గంటకో మాట, పూటకో కారణం చూపుతున్నారు.
వీడియో బయటపడిన
రోజు గోరంట్ల మాధవ్ మీడియా ముందుకు వచ్చి సదరు వీడియో మార్ఫింగ్ అని చెబుతూ ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు
చేశానని చెప్పారు. దానినే పట్టుకుని మాధవ్ ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ పూర్తయిన తరువాత మాధవ్ తప్పు చేసినట్లు తేలితే.. అంటే ఆ వీడియోలో ఉన్నది మాధవే అని రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అంటే సజ్జల మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని కమిట్ అయ్యారు. ఆ తరువాత ఓ రెండు రోజుల పాటు వైసీపీలో ఎవరూ ఈ విషయంపై మాట్లాడేందుకు ముందుకు రాలేదు. అటు గోరంట్ల మాధవ్ కూడా నోరు మెదప లేదు.
కానీ మీడియాలో, సామాజిక మాధ్యమంలో సామాన్య జనంలో కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్ వీడియో విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ణప్తి చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత నుంచి ఈ వీడియో సెంట్రిక్ గా కుల చిచ్చు పెట్టడం నుంచి అన్ని విధాలుగా ఎంపీని కాపాడడానికే ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో గోరంట్ల మాధవ్ నుంచి ప్రతి ఒక్కరూ పొంతన లేని మాటలు మాట్లాడారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని మాధవ్ చెప్పారు. ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని చెప్పారు. ఆ మరుసటి రోజే హిందూపురంఎస్పీ ఫకీరప్ప ఎంపీ గోరంట్ల మాధవ్, హోమంత్రి చెప్పిన మాటలన్నీ శుద్ధ అబద్ధాలని తేల్చేశారు. మాధవ్ తమకు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు.
ఆయన అభిమాని ఎవరో వచ్చి ఫిర్యాదు చేశారని చెప్పారు. అలాగే ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపలేదనీ చెప్పాశారు. దీంతో ప్రజలకు అసలు ఎవరు చెబుతున్నది నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ వీడియోను ఇంకా ఫోరెన్సిక్కు పంపలేదని.. సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన వీడియోను ఫోరెన్సిక్ కు పంపలేమనీ, ఒరిజనల్ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ కు పంపగలమనీ అన్నారు. అసలా వీడియోలో ఉన్నది మాధవా కాదా అన్నది కూడా చెప్పలేమని వివరణ కూడా ఇచ్చారు. అంటే ఒరిజనల్ దొరకదు, మేం దర్యాప్తు చేసినా ఏం తేలదు..ఇక ఈ కేసు కంచికి వెళ్లినట్లే అని చెప్పకనే చెప్పేశారు.
ఇలా ఫకీరప్ప విలేకరుల సమావేశం పూర్తయ్యిందో లేదో అలా ఎంపీ మాధవ్ మీడియా ముందుకు వచ్చి... తాను నిర్దోషినని తనకు తానే ప్రకటించేసుకుని యథా ప్రకారం బూతు పురాణం విప్పేశారు. అసభ్యతకు నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిచ్చిన ఎంపీని కాపాడేందుకు జగన్ పార్టీ ఎంత చేయాలో అంత చేసింది. చివరకు ఇక ఆ విషయంలో పార్టీ పరంగా తీసుకునే చర్యలేమీ ఉండవని చేతులు దులిపేసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో సజ్జల, హోంమంత్రి మీడియా సాక్షిగా చెప్పిన అబద్ధాలు, ఎంపీని కాపాడేందుకు పడిన తాపత్రయం మాత్రం జనానికి స్పష్టంగా అర్ధమైపోయిందని విమర్శకులు అంటున్నారు. ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన వారు ఏ ఛండాలం చేసినా కాపాడేందుకు పార్టీ, ప్రభుత్వం సదా తయారుగా ఉంటాయని ఈ ఎపిసోడ్ ద్వారా తేటతెల్లమైందని విశ్లేషకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/madhav-nude-video-call-ycp-drama-to-give-him-clean-chit-without-inquiry-25-141692.html
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.