నవాబ్ పటౌడీ షర్మిలా టాగోర్ ల ప్రేమ నుంచి నిన్నటి వరకూ చాలామంది క్రీడాకారులు ప్రేమ పెళ్లిళ్లూ జిందాబాద్ అంటు న్నారు.అనేక టోర్నీల్లో సిక్స్ కొట్టిన ప్లేయర్ స్టాండ్స్లో ఉన్న ప్రేయసికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో. మనకు తెలిసి భారత్ స్టార్ట్స్లో ఇలాంటి సీన్ కింగ్ కోహ్లీయే చేశాడు. సినీ నటి అనుష్క ప్రేమలో తలమునకలయ్యాడు. ఇద్దరూ ఒక్కట య్యారు. ఇపు డు సరికొత్త జంట తెరమీద కనపడుతోంది. అదే హాంకాంగ్ ఆల్రౌందర్ కించిత్ షా లవ్ ఎఫైర్. అతగాడు మంచి ప్లేయర్గా భారత్ ప్లేయర్లనూ ఆకట్టుకున్నాడు. ఇతను భవిష్యత్తులో మరింత మంచి ప్లేయర్గా నిలుస్తాడని అందరి మన్న నలు అందుకున్నాడు. ఇపుడు అతనిలో ప్రేమికుడినీ బయటపెట్టాడు. అదే పవర్ ఆఫ్ లవ్. అతను తన లవర్ దగ్గరికి వెళ్లి రింగ్ తొడిగేవరకూ ఈ కుర్రాడిలో ఈ కోణం ఉందా అని ఎవరూ ఊహించలేదు. కానీ ఇదో మంచి ముచ్చటా అందరూ చెప్పు కుంటున్నారు. ఆనందిస్తున్నారు.
ఆసియా కప్లో భాగంగా బుధవారం హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించి సూప ర్-4 లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో హాంకాంగ్ ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకుంది. ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్లో హాంకాంగ్ పోరాట పటిమ అందరినీ ఆకట్టుకుంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత, హాంకాంగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ కించిత్ షా స్టాండ్స్లోకి వెళ్లి తన గాళ్ఫ్రెండ్కు ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కించిత్ షా పేరు ఇప్పుడు మార్మోగుతోంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేరుగా స్టాండ్స్లో వెళ్లిన కించిత్ అక్కడ నిలబడి ఉన్న తన గాళ్ ఫ్రెండ్ భుజం తట్టాడు. ఆపై మోకాళ్లపై కూర్చుని బాక్స్లోంచి ఉంగరం తీసి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అసలు సిసలు ప్రియుడిలా అడిగాడు.
అంతే, ఈ లవ్ ప్రపోజల్ నుంచి తేరుకునేందుకు ఆమెకు చాలా సమయమే పట్టింది. క్షణకాలంపాటు తనను తాను నమ్మలేక పోయింది. కాసేపటి తర్వాత తేరుకుని ‘యస్’ అంటూ తన అంగీకారం తెలిపింది. ఆ మాట వినగానే పైకి లేచి ఆనందంతో తన చేతిలోని ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ తర్వాత ఇద్దరూ కౌగిలించుకుని ఆనంద డోలికల్లో తేలియాడిపోయారు. ఇదంతా చూస్తున్న స్టేడియంలోని అభిమానులు తమ సెల్ఫోన్లను క్లిక్మనించారు. కరతాళ ధ్వనులతో వారిని అభినం దించారు. ఇందు కు సంబంధించిన వీడియోను ఆసియా కప్ను నిర్వహిస్తున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ వారికి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ను హోరెత్తిస్తున్నారు. ఈ ఒక్క వీడియోతో కించిత్ షా ఓవర్ నైట్ స్టార్గా అయ్యాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/love-proposal-in-cricket-stadium-39-143076.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.