నవాబ్ పటౌడీ షర్మిలా టాగోర్ ల ప్రేమ నుంచి నిన్నటి వరకూ చాలామంది క్రీడాకారులు ప్రేమ పెళ్లిళ్లూ జిందాబాద్ అంటు న్నారు.అనేక టోర్నీల్లో సిక్స్ కొట్టిన ప్లేయర్ స్టాండ్స్లో ఉన్న ప్రేయసికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో. మనకు తెలిసి భారత్ స్టార్ట్స్లో ఇలాంటి సీన్ కింగ్ కోహ్లీయే చేశాడు. సినీ నటి అనుష్క ప్రేమలో తలమునకలయ్యాడు. ఇద్దరూ ఒక్కట య్యారు. ఇపు డు సరికొత్త జంట తెరమీద కనపడుతోంది. అదే హాంకాంగ్ ఆల్రౌందర్ కించిత్ షా లవ్ ఎఫైర్. అతగాడు మంచి ప్లేయర్గా భారత్ ప్లేయర్లనూ ఆకట్టుకున్నాడు. ఇతను భవిష్యత్తులో మరింత మంచి ప్లేయర్గా నిలుస్తాడని అందరి మన్న నలు అందుకున్నాడు. ఇపుడు అతనిలో ప్రేమికుడినీ బయటపెట్టాడు. అదే పవర్ ఆఫ్ లవ్. అతను తన లవర్ దగ్గరికి వెళ్లి రింగ్ తొడిగేవరకూ ఈ కుర్రాడిలో ఈ కోణం ఉందా అని ఎవరూ ఊహించలేదు. కానీ ఇదో మంచి ముచ్చటా అందరూ చెప్పు కుంటున్నారు. ఆనందిస్తున్నారు.
ఆసియా కప్లో భాగంగా బుధవారం హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించి సూప ర్-4 లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో హాంకాంగ్ ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకుంది. ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్లో హాంకాంగ్ పోరాట పటిమ అందరినీ ఆకట్టుకుంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత, హాంకాంగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ కించిత్ షా స్టాండ్స్లోకి వెళ్లి తన గాళ్ఫ్రెండ్కు ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కించిత్ షా పేరు ఇప్పుడు మార్మోగుతోంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేరుగా స్టాండ్స్లో వెళ్లిన కించిత్ అక్కడ నిలబడి ఉన్న తన గాళ్ ఫ్రెండ్ భుజం తట్టాడు. ఆపై మోకాళ్లపై కూర్చుని బాక్స్లోంచి ఉంగరం తీసి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అసలు సిసలు ప్రియుడిలా అడిగాడు.
అంతే, ఈ లవ్ ప్రపోజల్ నుంచి తేరుకునేందుకు ఆమెకు చాలా సమయమే పట్టింది. క్షణకాలంపాటు తనను తాను నమ్మలేక పోయింది. కాసేపటి తర్వాత తేరుకుని ‘యస్’ అంటూ తన అంగీకారం తెలిపింది. ఆ మాట వినగానే పైకి లేచి ఆనందంతో తన చేతిలోని ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ తర్వాత ఇద్దరూ కౌగిలించుకుని ఆనంద డోలికల్లో తేలియాడిపోయారు. ఇదంతా చూస్తున్న స్టేడియంలోని అభిమానులు తమ సెల్ఫోన్లను క్లిక్మనించారు. కరతాళ ధ్వనులతో వారిని అభినం దించారు. ఇందు కు సంబంధించిన వీడియోను ఆసియా కప్ను నిర్వహిస్తున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ వారికి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ను హోరెత్తిస్తున్నారు. ఈ ఒక్క వీడియోతో కించిత్ షా ఓవర్ నైట్ స్టార్గా అయ్యాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/love-proposal-in-cricket-stadium-39-143076.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.