సీఎస్ సోమేష్ కుమార్ కు ఉద్వాసన తప్పదా? ఎంతో నమ్మకంతో సీఎం కేసీఆర్ ఏరి కోరి తెచ్చుకున్న సోమేష్ కుమార్ ఇప్పుడు ఆయన నమ్మకాన్ని కోల్పోయారా? అంటే అధికార వర్గాల్లో ప్రచారం మేరకు ఔననే సమాధానం వస్తున్నది. ఏపీ క్యాడర్ కు చెందిన వ్యక్తే అయినప్పటికీ సోమేష్ కుమార్ క్యాట్ ఆర్డర్స్ మేరకు తెలంగాణలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన వ్యవహార శైలి సీఎంకు పెద్దగా నచ్చుతున్నట్లు కనబడదు. అంతే కాకుండా సీఎంలు, చీఫ్ జస్టిస్ ల సదస్సులో సీఎస్ సోమేష్ వ్యవహార శైలిపై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. సీఎం కేసీఆర్ ఆయనకు ఉద్వాసన పలకడమే మేలని నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాల్లో ప్రచారమౌతోంది. విధి నిర్వహణలో సీఎస్ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సీఎం స్వయంగా చెప్పన అంశాల అమలులో కూడా అలవిమాలిన జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం సీఎస్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఎంతో నమ్మకంతో డజను మంది సీనియర్లను సైతం తోసి రాజని ఏరి కోరి సోమేష్ కుమార్ ను సీఎస్ గా సీఎం కేసీఆర్ తెచ్చుకున్నారు. సీనియారిటీ లేని వ్యక్తికి సీఎస్ పదవి ఏమిటని రేవంత్ వంటి ప్రతిపక్షాల నేతలు ఎన్ని మార్లు ఆరోపణలు, విమర్శలు చేసినా సీఎం కేసీఆర్ ఖాతరు చేయలేదు. అయితే ఇప్పుడు సీఎస్ వ్యవహార శైలి పట్ల స్వయంగా సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. సీఎస్ వ్యవహారశైలి, నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వాని సమస్యలు వస్తున్నాయని కేసీఆర్ భావిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో సీజేఐ సీఎస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇక ఉద్వాసన చెప్పక తప్పదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారంటున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ స్థానంలో ప్రస్తుతం ఆర్థిక శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణారావుకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lost-confidence-in-somesh-will-co-oost-cs-somesh-39-135398.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.