ఆకాశంలో ఓ అద్భుతం

Publish Date:Jul 28, 2018

Advertisement

ఖగోళంలో కనువిందు జరిగింది .... ఆకాశంలో  అద్భుతం జరిగింది. దివిలో దివ్యం జరిగింది. సైన్స్ ఒక పక్క, సంప్రదాయం మరొక పక్క వాదులాడుకుంటుంటే ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటోంది. క్యాలండర్లు లేవు.... మూహుర్తాలూ లేవు... సీమా సమయ సందర్భాలూ నిర్ణయం కాలేదు. అయినా పంచభూతాలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటున్నాయి. ఇది సైన్స్‌కి, సంప్రదాయానికి మధ్య భువిలో జరుగుతున్న వాదోపవాదమే తప్ప, సృష్టికి మాత్రం ఓ ప్రక్రియ. శుక్రవారం రాత్రి 11.54 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సరిగ్గా ఒంటి గంటకు సంపూర్ణ సూర్య గ్రహణంగా రూపాంతరం చెందింది. ఈ గ్రహణానికి ఆధునికులు, సనాతనులు ఎవరికి వారు తమ సంకల్పం చెప్పుకుంటున్నారు. ఇవేమీ పట్టని ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటోంది. ఇప్పటి వరకు అనేక సంవత్సరాల నుంచి చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు  వస్తూనే ఉన్నాయి. మరో వైపు మానవుడు తన మేథస్సుతో ఖగోళ రహస్యాలను తెలుసుకుంటూనే ఉన్నాడు. అయినా ప్రకృతిపై విజయం మాత్రం మానవాళికి అందడం లేదు.

 

 

భారతదేశ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11.54 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి దేశంలో కోట్లాది మంది ఆకాశం వైపు చూస్తూనే ఉన్నారు. తమ కళ్ల ముందే సంపూర్ణ చంద్రుడు కొద్ది కొద్దిగా కనుమరుగు కావడమనే అద్భుతాన్ని వీక్షించారు.  తెల్లని చంద్రుడు తమ ముందే ఎర్రని చంద్రునిగా మారడాన్ని చూసి దేశ ప్రజలు అచ్చరవొందారు. ఈ అద్భుత అందాన్నిదేశ ప్రజలు తనివితీర చూస్తూ ఆనందించారు. వెలుగును పంచే సూర్యుడికి, వెన్నెలను అందించే చంద్రుడికి మధ్య అప్పుడప్పుడు భూమి ప్రవేశించడమే గ్రహణం అంటే. ఈ చంద్ర గ్రహణ సమయంలో మాత్రం మరో అద్భుతం జరిగింది, అదే అంగారక గ్రహం భూమికి సమీపంలో రావడం. భూమికి దగ్గరైన అంగారకుడు అంతరిక్షంలో చంద్రగ్రహానికి అత్యంత సమీపంగా వచ్చాడు. దీంతో అంగారక గ్రహం అరుణ వర్ణంలో కనిపించింది.సంపూర్ణ చంద్రగ్రహణంపై చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి.

 

 

శాస్త్రవేత్తలు చంద్రగ్రహణ సమయంలో ఏదైనా  తింటూ సెల్‌ఫోన్లతో చంద్రగ్రహణం సెల్ఫీ తీసుకోమంటూ ప్రచారం చేసారు. ఈ ప్రచారం వెనుక చంద్రగ్రహణం సైన్స్ మాత్రమేనని ప్రపంచానికి తెలియజేయడం వారి ఉద్దేశ్యం. మరోవైపు సనాతనులు చంద్ర గ్రహణంతో వివిధ రాశులలో ఉన్న నక్షత్రాలకు చెందిన మానవులపై పడే ప్రభావాన్ని చెబుతున్నారు. కర్కాటక రాశివారికి చిక్కులని, తుల రాశి వారికి మరొకటని ..... ఇలా అన్ని రాశుల వారికి చంద్ర గ్రహణ ఫలిత క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇంత శాస్త్ర, సాంకేతికత అభివ్రుద్ది జరగక ముందే ఎప్పుడో హేతువాది గోరాగారు ఈ గ్రహాణాలపై ప్రజలను అప్రమత్తం చేసారు.

 

 

అయితే ప్రజల విశ్వాసం మాత్రం సైన్స్‌కు దీటుగా పెరుగుతూనే వచ్చింది. అటు సనాతనులు చేస్తున్న వాదనలోను బలం ఉంది. తారిఖులు, దస్తావేజులు లేకుండానే సనాతనులు తమ ధర్మాన్ని అనుసరించి గ్రహణాలపై చెబుతున్నారు. శాస్త్రవేత్తలు కూడా తమ అనుభవాలను పరిగణలోకి తీసుకుని వారి వాదాన్ని వినిపిస్తున్నారు. వీరివురి సిద్దాంతాలను పక్కన పెడితే గ్రహణం అనేది మానవ జీవితంలో ఒక అద్భుతం.....కళ్ల ముందే గ్రహాలు కనుమరుగు కావడం ఊహకందని రహస్యం. ఈ రహస్యం ఇలా ఉంటేనే అందం......ఆనందం....అద్భుతం.... ఇంతటి అద్భుత గ్రహణం సంభవించేది మళ్లీ 2123 నాటికే. అంటే దాదాపు వందేళ్ల తర్వాతే. అందుకే ఈ అద్భుతాన్ని మధ్య ఆసియా నుంచి తూర్పు ఆఫ్రికా వరకూ అన్ని దేశాల ప్రజలు కనులారా వీక్షించారు.

 

 

శుక్రవారం రాత్రంతా పలు దేశాలలోని ప్రజలు టెలీస్కోపులకు అతుక్కుపోయారు. తమకు అత్యంత సమీపంలోకి వచ్చిన అంగారక గ్రహాన్ని చూసి అశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతం కనుకే గ్రహణాలకు ఇంత ప్రాధాన్యం. భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయమంటే అరిష్టం. అందుకే తెలుగు రాష్ట్రాలలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, యాదాద్రి దేవాలయం, శ్రీశైలంలోని మల్లికార్జున గుడి, సింహాచలం అప్పన్న ఆలయం, భద్రాచలంలోని రామాలయంతో పాటు చిన్నా చితకా ఆలయాలన్నింటినీ శుక్రవారం మధ్యాహ్నం మూసి వేశారు. గ్రహణం వీడిన తర్వాత శనివారం తెల్లవారుజామున అన్ని దేవాలయాల తలుపులు తెరచి సుప్రభాత సేవలు ప్రారంభించారు. గ్రహణం పట్టడమంటే ఓ అపశకునంగానే భావించే దేశ ప్రజలు గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరు. గ్రహణం వీడిన తర్వాత మాత్రమే స్నానాదికాలు ముగించి దైవ దర్శనం తర్వాత ఎంగిలి పడతారు. దీనికి ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు.

 

 

వందల ఏళ్ల నుంచి వస్తున్న ఈ సనాతన ధర్మ ఆచారాలను ఏ సైన్స్ ఏమీ చేయలేదని మరోసారి రుజువైంది. నిజానికి ఏ ఆచారమైనా చెడు చేసేదిగా ఉంటే దాన్ని విసర్జించేందుకు మానవులు సంసిద్ధంగా ఉంటారు. గ్రహణం కారణంగా ఎలాంటి చెడు లేనప్పుడు విశ్వాసాలను ఎవరైనా ఎందుకు వదులుకుంటారు... ఎందుకు వదులుకోవాలి.. అలాగే సైన్స్‌కి ఇచ్చే ప్రాధాన్యంలోనూ దేశ ప్రజలు ఏమాత్రం తగ్గరు. దాని విలువను గుర్తెరిగి ప్రవర్తిస్తారు. అందుకే సువిశాల భారతదేశంలో అటు సనాతనం.... ఇటు శాస్త్రం వేలాది సంవత్సరాలుగా కలిసి మెలిసి ఉంటున్నాయి. వైరుధ్యాల కూడలిలో ఎవరి దారి వారిదే అయినా ఒక దానిని మరొకటి గౌరవించుకోవడంలో కూడా దేశం ప్రజలు శభాష్ అనిపించుకుంటున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.