రెడ్‌బుక్‌ చాప్టర్3లో ముగ్గురి పేర్లు.. కొడాలి నాని, వల్లభనేని వంశి.. మూడో వ్యక్తి ఎవరు?

Publish Date:Nov 2, 2024

Advertisement

రెడ్‌బుక్‌.. ఈ పేరు వింటేనే. మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది.  మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి జిల్లా స్థాయి వైసీపీ నేతల వరకు అందరిలోనూ ఎప్పుడు ఎవరు జైలు కెళ్లాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. వైసీపీ ఐదేళ్ల హయాంలో నిబంధనలు తుంగలో తొక్కి కొందరు అధికారులు, వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు పలువురిని జైళ్లకు పంపించి చిత్రహింసలకు గురిచేశారు. కొందరు వైసీపీ నేతలు ఏకంగా తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైనా దాడులు చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలో తెలుగుదేశం శ్రేణులపై కక్షపూరితంగా వ్యవహరించిన వైసీపీ నేతలు, వారికి అనుకూలంగా వ్యవహరించిన అధికారుల పేర్లను ప్రతిపక్షంలోఉన్న సమయంలో నారా లోకేశ్ ‘రెడ్‌బుక్‌’లో నమోదు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారిని వదిలిపెట్టేది లేదని, ఒక్కొక్కరిని చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే, అప్పట్లో వైసీపీ నేతలు రెడ్‌బుక్‌పై వెటకారంగా మాట్లాడారు. కానీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్‌బుక్‌ పేరు వింటేనే వైసీపీ భయంతో వణికి పోతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే లోకేశ్ రెడ్‌బుక్‌ ఓపెన్ చేశారు. రెడ్‌బుక్‌లో నమోదు చేసుకున్న పేర్ల ప్రకారం ఒక్కొక్కరికి చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల వ్యవధిలోనే రెడ్‌బుక్‌ ప్రభావం కనిపించడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఢిల్లీకివెళ్లి ఆందోళనకు దిగారు. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ స్వయంగా జగన్ గగ్గోలు పెట్టాడు.  అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ ‘రెడ్‌బుక్‌’ అంటుంటే నవ్వుకున్న జగన్.. అధికారం కోల్పోయిన తరువాత రెడ్‌బుక్‌ అంటేనే వణికిపోతున్న పరిస్థితి. అప్పట్లో తెలుగుదేశం శ్రేణులను టార్గెట్ చేసి వేధించిన వారిలో చాలా మందిపై ఇప్పటికే రెడ్‌బుక్‌ ఛాప్టర్1, ఛాప్టర్2 ఓపెన్ చేసి చట్టపరంగా కేసులు నమోదు చేశారు. ఛాప్టర్1లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించి టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు నమోదుచేసి జైళ్లకు పంపించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులపై విచారణలు జరుగుతుండగా.. కొందరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. మరి కొందరిని సస్పెండ్ చేశారు. రెడ్‌బుక్‌ ఛాప్టర్2లో తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు మొదలు పెట్టారు. అదే విధంగా అధికార మదంతో చంద్రబాబు, పవన్, లోకేశ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు జైలు కెళ్లగా.. మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు లోకేశ్   తాజాగా‘రెడ్‌బుక్‌’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రెడ్‌బుక్‌లో చాప్టర్ 3 ఓపెన్ అవుతుందని పేర్కొన్నారు. దీంతో ఛాప్టర్3లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే విషయంపై వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

మంత్రి నారా లోకేశ్ వారం రోజులు అమెరికాలో పర్యటించారు. ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పలు కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు.    రెండు రోజుల కిందట అమెరికాలోని అట్లాస్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నారా లోకేశ్ మాట్లాడుతూ రెడ్‌బుక్‌ గురించి ప్రస్తావించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తన యువగళం పాదయాత్రలో తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఎవరినీ వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఇందుకోసం త్వరలో రెడ్‌బుక్‌ ఛాప్టర్3 ఓపెన్ చేస్తామని ప్రకటించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని అన్నారు. అయితే, రెడ్‌బుక్‌ ఛాప్టర్3 ఓపెన్ కావాలంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్ట పడాలని లోకేశ్ సూచించారు. దీంతో ఛాప్టర్3లో వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లు ఉండబోతున్నాయని లోకేశ్ చెప్పకనే చెప్పారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలు నందమూరి, చంద్రబాబు కుటుంబాలపై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణిని అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వంశీపై తెలుగుదేశం శ్రేణులే కాదు,   ప్రజలు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరోవైపు గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్దం కేసులో వంశీపై కేసు నమోదైంది. త్వరలో వంశీపై అంతకన్నా తీవ్రమైన కేసులు నమోదు కాబోతున్నాయని, జైలుకు వెళ్లడం ఖాయమని లోకేష్ చెప్పకనే చెప్పారంటూ ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. 

రెడ్‌బుక్‌ ఛాప్టర్3లో కొడాలి నాని పేరుకూడా ఉంటుందని లోకేశ్ హింట్ ఇచ్చేశారు. వైసీపీ హయాంలో కొడాలి నాని ఇష్టానుసారంగా రెచ్చిపోయిన విషయం తెలిసిందే. నందమూరి, నారా కుటుంబాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. చంద్రబాబును ఏకవచనంతో అసభ్య పదజాలంతో దూషించాడు. పవన్ కల్యాణ్, లోకేష్ పైనా అనేక సార్లు నోరుపారేసుకున్నాడు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండాలి నాని, వల్లభనేని వంశీలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛాప్టర్ -3లో నాని, వల్లభనేని వంశీపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు లోకేశ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

వీరిద్దరితో పాటు మరో వైసీపీ ముఖ్యనేత పేరుకూడా రెడ్‌బుక్‌ ఛాప్టర్3లో ఉందని ప్రచారం జరుగుతుంది. అతను జగన్ మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరి వ్యక్తి అని, అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా.. త్వరలో మరో కేసు నమోదు కాబోతుందని, ఆ కేసులో సదరు వ్యక్తి జైలు కెళ్లడం ఖాయమని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రెడ్ బుక్ ఛాప్టర్ -3 అనగానే వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందట. మొత్తానికి రెడ్ బుక్ అంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఎగతాళిగా మాట్లాడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు అదే రెడ్ బుక్ పేరు వింటే వణికిపోతున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా లోకేశ్ రెడ్ బుక్ పేరు ప్రస్తావించడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

By
en-us Political News

  
కామారెడ్డిలో  జిల్లాలో  ఎస్ఐ సాయికుమార్ , కానిస్టేబుల్ శృతి  , కంప్యూటర్ ఆపరేటర్  నిఖిల్  సదాశివనగర్ చెరువులో  దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఎస్ ఐ, కానిస్టేబుల్ మధ్య అక్రమ సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి
ఎఫ్ డిసి చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బెనిఫిట్స్ షో రద్దు చేస్తున్నట్టు, టికెట్ల పెంపు నేనున్నంతవరకు ఉండవని   ప్రకటించడంతో చిత్రపరిశ్రమ ఒక్క సారిగా ఉలిక్కిపడింది
జర్నలిస్టుపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించడంతో నటుడు మోహన్ బాబు అజ్ణాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం లేదని పోలీసులు సైతం చెబుతున్నారు.
అల్లు అర్జున్ అరెస్టు తదననంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వానికీ, సినీ పరిశ్రమకు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎఫ్ డీసీ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో కొందరు సినీ ప్రముఖులు గురువారం ( డిసెంబర్ 26) ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ కానున్నారు.
భారత తపాలా శాఖ బుక్ పోస్టు సర్వీసులను రద్దు చేసింది. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుక్ పోస్టు సర్వీసులను తపాలా శాఖ రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (డిసెంబర్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఎంబీసీ వరకూ సాగింది.
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పరిస్థితి చూస్తే ఎవరికీ అయ్యో పాపం అని కూడా అనాలని అనిపించదు. ఎందుకంటే గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి జైలుకు వెళ్లారు. జగన్ క్విడ్ ప్రొకో కేసులలో విచారణను ఎదుర్కొన్నారు. ఆ అరెస్టులు, విచారణల ఒత్తిడి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై చాలా కాలం వీల్ చైర్ కే పరిమితమయ్యారు.
అల్లు అర్జున్ తన సినీమాలు వరుస విజయాలు అందుకుంటుండటంతో ఆయన యాటిట్యూడ్ మారిందన్న విమర్శలు గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం మాత్రం పెను వివాదానికి దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల పవిత్రత పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. జగన్ హయాంలో రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడులు, జరిగిన అపచారాల సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కలియుగ వైకుఠం అనే తరుమలలోనే పవిత్రతకు భంగం వాటిల్లే సంఘటనలు చోటు చేసుకున్నాయి.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మౌనం ప్రస్తుతం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ, అధికారం కోల్పోయిన తరువాత ఆయన జనసేన గూటికి చేరేంత వరకూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఆయన మాట్లాడితే ఒక సంచలనం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి.
తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు నోటీసులు జారీ కానున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే ఐఏఎస్ అధికారి దాన కిశోర్ ను విచారించారు.
దేశ రాజధాని నగరం హస్తినను పొగమంచు కమ్మేసింది. చలి తీవ్రతతో మొత్తం ఉత్తర భారతం గజగజలాడుతున్నది. హస్తినలో అయితే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. బుధవారం ఉదయం రాజధాని నగరంలో 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే బుధవారం (డిసెంబర్ 25) నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.