భాషా: సలాం వాలేకుం మౌలానా సాబ్ సాబ్ . ఢిల్లీ లో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. ఇస్లాంను నమ్మే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం బాధగా ఉంది. ముస్లిం రాజకీయనేతలే అల్లాకు ధన్యవాదాలు తెలిపిన సందర్బాలు అనేకం. ఒక హిందూ మతంలో పుట్టిన కేజ్రీవాల్ ఇస్లాంను అనుసరించి పాలన చేసినప్పటికీ మళ్లీ అధికారంలో రాలేకపోయాడు.
మౌలానా: చూడు భాషా అరవింద్ కేజ్రీవాల్ఉన్నత చదువులతో ప్రభుత్వోద్యోగంలో చేరాడు. అన్నాహజారే స్పూర్తితో అవినీతికి వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో హర్యానా రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత సక్సెస్ అయ్యాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇస్లాం అమలు విషయంలో కానీ, ముస్లింల సంక్షేమం, అభివృద్ది విషయంలో చేసింది శూన్యం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ‘మై అల్లా కో శుక్ రియా అదా కర్తా హుం ’ అనడం నేను విన్నాను. అల్లాకు కృతజ్ఞత చెప్పిన వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. లిక్కర్ స్కాం చేశాడు. ఇస్లాంలో లిక్కర్ వ్యాపారం మహాపాపం. ఇస్లాంలో మద్యపానం నిషేధం. ఖురాన్ కూడా ఇదే చెబుతుంది. త్రాగడం వల్ల మనిషి విచక్షణ కోల్పోతాడు. ఒక చుక్క మద్యం సేవించినా అపచారం. డాక్టర్ ప్రిస్కైబ్ చేసే మందులు పని చేయకపోతే వేరే మందులు ప్రిస్కైబ్ చేస్తాడు. మద్యం కూడా అంతే. వదిలేయాల్సిందే. అల్లాకు ఇష్టం లేని పని చేయకూడదు. రంజాన్ లో ఉపవాసదీక్షలు ప్రతీ ముస్లిం విధి. కానీ ఇస్లాంను అమలు చేయని వ్యక్తి ఉపవాసాలు చేసినప్పటికీ ఫలితం శూన్యం.
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలో వచ్చిన టిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో రాణించాలన్న కాంక్షతో బిఆర్ఎస్ గా రూపాంతం చెందింది. ఉద్యమనేత కెసీఆర్ కూతురు కవిత పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల అవినీతికి పాల్పడింది. ఢిల్లీలో మద్యం వ్యాపారానికి తెరలేపింది. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ తో దోస్తీ చేసింది. లిక్కర్ స్కాం చేసింది. ప్రజలు బిఆర్ఎస్ ను ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ జైలుపాలయ్యారు. అటు తెలగాణలో బిఆర్ఎస్ ను ఇటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఇంటికి పంపించారు. చూశావా భాషా అల్లా ఎందుకోసం లిక్కర్ హరామ్ అన్నాడో అర్థమైందా
బదనపల్లి శ్రీనివాసాచారి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/liquor-scam-kejriwal-bought-39-192612.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.