లిక్కర్ లింక్స్ ఇది అంతం కాదు .. ఆరంభమే

Publish Date:Aug 28, 2022

Advertisement

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ, కల్వకుట్ల కవిత, ఈ కుంభకోణంలో తన పాత్ర ఏమాత్రం లేదని మరో మారు స్పష్టం చేశారు. కేంద్రం పై యుద్ధం ప్రకటించిన, ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్’గా, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తనపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని, అయినా భయపడేది లేదని చెప్పు కొచ్చారు. ఒక న్యూస్ చానల్‌ బిగ్ డిబేట్‌ కార్యక్రమంలో ఆమె లిక్కర్ కుంభకోణంతో పాటుగా రాష్ట్ర, జాతీయ  రాజకీయాలకు సంబంధించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి, న్యాయ పోరాటం చేయడం మినహా మరో మార్గం లేదని చెప్పారు.అదే సమయంలో ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పు కొచ్చారు. నిజానికి, ఇప్పుడున్న పరిస్థితిలో  కవిత అయినా ఇంకొకరు అయినా చేయగలిగింది ఏమీలేదు. ఎందుకంటే, ప్రాధమిక ఆధారాలను బట్టి చూస్తే, అందులో కవిత పాత్ర ఏమిటనేది పక్కన పెడితే, కుంభకోణం జరిగిందినే విషయంలో అనుమానాలు క్రమక్రమంగా తొలిగి పోతున్నాయి. ఇతర విషయాలు ఎలా ఉన్నా, సీబీఐ విచారణ మొదలు కాగానే, ఢిల్లీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలకు మూలాదారంగా ఉన్న, కొత్త లిక్కర్ పాలసీని తీసి పక్కన పెట్టేసింది. మళ్ళీ పాతపాలసీనే అమలు చేయాలని నిర్ణయించింది. నిర్ణయించడమే కాదు, ఆఘమేఘాల మీద, కొత్త సీసాను పాత సారాయితో నింపేసింది.

దీంతో, ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ‘దాల్ మే కుచ్’ కాలా హై’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా, కేజ్రీవాల్  చర్చను పక్కదారి పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్నికూల్చేందుకు కుట్రలు చేస్తోందని కొత్త చర్చను తెరమీదకు తెచ్చారు  
సరే,ఆ విషయం ఎలా ఉన్నా, సుమారు గంటకు పైగా సాగిన ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి బిగ్ డిబేట్  ఇంటర్వ్యూలో,కవిత హావభావాలు, చేసిన వ్యాఖ్యలు, వ్యక్తపరిచిన మర్మగర్భ అభిప్రాయాలను గమనిస్తే  జరగరానిది ఏదో జరుగుతుందనే ఆందోళన ఆమెలో చాలా స్పష్టంగా కనిపించిందని, విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, కార్యక్రమం ప్రారంభంలోనే, ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, ‘టెన్షన్’ ఫీల్ అవుతున్నారా? అంటూనే చర్చ ప్రారంభించారు. ఆమె అలాంటిదేమీ లేదని, చెప్పుకున్నా ఇంటర్వ్యూ పొడుగునా ఆమె మాటలో, హవా భావాల్లో చివరకు, ఆమె నవ్వులోనూ భయంతో కూడిన టెన్షన్’ కనిపించిందనే అంటున్నారు.

అంతే కాకుండా ముందున్న ఉపద్రవాన్ని ఫేస్ చేసేందుకు కూడా ఆమె మానసికంగా సిద్దమయినట్లుందని, ఆమె సన్నిహితులే చెవులు కోరుకుంటున్నారు.  
రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రంపై యుద్ధం కొనసాగిస్తారని చెప్పిన కవిత, కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసేఆర్’ కు భయపడుతోందని అందుకే తనను టార్గెట్ చేసిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ని చూసి భయపడుతున్న ప్రధాని మోడీ ప్రభుత్వం ఆయన్ని ఏమి చేయలేక తనకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంబంధం ఉందనే ఆరోపణలతో భయపెట్టాలని చూస్తోందన్నారు. ఈడీ, బోడీకి భయపడను అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని బీజేపీ ఆయనపై రివేంజ్ తీర్చుకుంటోందన్నారు. బీజేపీ బ్యాక్ డోర్ పాలిటక్స్ చేస్తోందని ఆరోపించారు. యుద్ధంలో రాజును ఓడించాలంటే తొలుత చుట్టూ ఉన్న వారిని కొడతారని తెలంగాణ విషయంలో బీజేపీ ప్రస్తుతం అదే చేస్తోందన్నారు.

అలాగే, ఇది అంతం  కాదు ఆరంభం మాత్రమే అన్నారు. ముందు ముందు కేంద్ర ప్రభుత్వం ఇంకా అనేక దాడులకు పాల్పడే అవకాశం లేక పోలేదని, ముందుగానే ఒక హింట్ కూడా ఇచ్చారు. బీజేపీ తమకు వ్యతిరేకంగా వాయిస్ వినిపించే పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం పరిపాటిగా చేసుకుందన్నారు.  ప్రధాని మోడీ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎవర్ని వదిలిపెట్టడం లేదన్నారామె. కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా, కన్యాకుమారిలో స్టాలిన్ కుటుంబంపైనా కేసులు పెట్టారని గుర్తుచేశారు. మహారాష్ట్రలో శివసేన , ఎన్సీపీ ఎంపీలపై కేసులు పెట్టి జైల్లో ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీలో ఉందన్న కవిత ఇలాంటి సమయంలో అందరూ ప్రశ్నించకపోతే ప్రమాదం ఊహించని విధంగా ఉంటుందన్నారు.

ఇదంతా ఒకెత్తు అయితే, ఈ మొత్తం వ్యవహారంలో పరోక్షంగానే  అయినా,  చాలా కాలంగా ‘విశ్వసనీయ’ వర్గాల ద్వారా వినవస్తున్న కేసీఆర్ కుటుంబ కలహాల ప్రస్తావన కూడా వచ్చింది. నిజానికి, కవిత చుట్టూ ఇంత దుమారం చెలరేగుతున్నా, ముఖ్యమంత్రి, తండ్రి కేసీఆర్’, మంత్రి, అన్న రామన్న (కేటీఆర్) ఆమెపై వచ్చిన ఆరోపణలను ఖండించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అయితే, ఇందుకు సంబంధించి కవిత కొంత స్మార్ట్’గా సామ్,సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి, వారు స్పందించవలసిన అవసరం లేదని, అందుకే వారుస్పందించలేదని అన్నారు. అయితే, పార్టీ నేతలంతా ఈవిషయంలో తనకు అండగా ఉన్నారన్న కవిత అవసరమైనప్పుడు కేసీఆర్, కేటీఆర్ బహిరంగంగా స్పందిస్తారని చెప్పారు.అయితే ఆ ఇద్దరి మౌనం వెనక ఇంకేదో వ్యూహం ఉందని అంటున్నారు. తొందరపడి స్పందిస్తే చిక్కుల్లో పడతామనే భయం కూడా ఉండి ఉండవచ్చని అంటున్నారు. అయితే కవిత అన్నట్లుగా ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అయితే, ముందుముందు బుల్లి తెరపై చూడాల్సింది చాలానే ఉందని అనుకోవచ్చును.

By
en-us Political News

  
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.