ఎంతసేపైనా చర్చిద్దాం.. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై కేంద్రం

Publish Date:Apr 16, 2026

Advertisement

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలుకుతూ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై చారిత్రక చర్చ ప్రారంభమైంది. గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ   బిల్లుతో పాటు డిలిమిటేషన్ బిల్లుపై సుమారు   మారథాన్ చర్చ నిర్వహించాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. ఈ చర్చలో ప్రతి రాజకీయ పార్టీకి తమ వాదనను గట్టిగా వినిపించేందుకు తగిన సమయం కేటాయించనున్నట్లు చెప్పారు.  

ఒక పార్టీ త‌ర‌ఫున ఎంత మంది స‌భ్యులు మాట్లాడాల‌ని అనుకున్నా అవకాశం ఇస్తానన్న ఆయన   ఒక‌వేళ ఒక పార్టీ త‌ర‌ఫున ఒక స‌భ్యుడే ప్రసంగిస్తానంటే.. ఆ స‌భ్యుడికి  కావాల్సినంత స‌మ‌యం ఇస్తామ‌న్నారు చెప్పారు. బిల్లుల‌పై   22 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుందని చెప్పారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో  అధికార ప‌క్షం ఇలా స‌మ‌యం ఇవ్వ‌డం,  సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మూడు కీలక బిల్లులు దేశ రాజకీయ భవిష్యత్తును మార్చనున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు మరియు లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుండి 850కి పెంచేందుకు  ఈ బిల్లులను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతి రాజకీయ పక్షం తమ గళాన్ని వినిపించేందుకు వీలుగా చర్చా సమయాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించారు. కిరణ్ రిజుజు ఈ బిల్లులపై ఎంతసేపైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సభలో ప్రకటించారు. సమయా భావం సమస్య తలెత్తకుండా సమయం కేటాయించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో  సంఖ్యా బలంతో సంబంధం లేకుండా చిన్న పార్టీలకు కూడా చర్చలో ప్రసంగించేందుకు తగిన సమయం కేటాయించనున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ప్రతి పార్టీకి మూడు గంటల సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. శుక్రవారం (ఏప్రిల్ 17) సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్ ఉంటుందని పేర్కొన్న ఆయన అవసరమైతే రాత్రి పొద్దుపోయినా సభ కొనసాగిస్తానని చెప్పారు. 

కాగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల గళాన్ని గట్టిగా వినిపించేందుకు ప్రాంతీయ పార్టీలు సమాయత్తమౌతున్నాయి.   అంతకు ముందు చర్చలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  మహిళా రిజర్వేషన్ల విషయంలో రాజకీయ రంగు పులమవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లులు అత్యంత అవసరమన్నారు.  

By
en-us Political News

  
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసు కొత్త మలుపు తిరిగింది.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు అయింది
దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మూడు కీలక బిల్లులు లోక్‌సభ ముందుకు రావడంతో ఉత్కంఠ పెరిగింది.
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను వేసింది
మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుపై తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
జగన్ మనసంతా విధ్వంసం, నిలువెల్లా స్వార్థం నిండి ఉందని మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆ చోక్ పాయింట్లే ఇప్పుడు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మార్గాల్లో తలెత్తే అతిచిన్న లోపం లేదా యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసే ప్రమాదం పొంచి ఉంది.
ప్రపంచం ఎంత పెద్దదైనా, దాన్ని నిలిపివేయడానికి కొన్ని కిలోమీటర్ల సన్నని సముద్ర మార్గమే చాలనేది నేటి జియోపాలిటిక్స్ చెబుతోంది. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం కంటే ఎక్కువ భాగం సముద్ర మార్గాల ద్వారా జరుగుతోంది. అందులో కూడా అత్యంత కీలకమైన చమురు, సహజవాయువు, గోధుమలు, ఎలక్ట్రానిక్స్, కంటైనర్లు కొన్ని చోక్ పాయింట్స్ మీదే ఆధారపడి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా రిజర్వేషన్ల అమలు ఒక చారిత్రక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.