Publish Date:Apr 12, 2026
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహానికి కారణమైంది. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కేంద్రం నిర్ణయం వేయి ఏనుగుల బలాన్నిచ్చింది. ఇక అమరావతి అభివృద్ధి వాయువేగంతో సాగుతుందన్న నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చింది. అయితే కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
గతంలో ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పేవారు. ఇప్పుడు ఆ కీలక భూమిక లోకేష్ పోషిస్తున్నారన్నది రాజకీయవర్గాలలో టాక్. అమరావతికి సంబంధించిన కీలక అనుమతులు సాధించడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారనీ, ఢిల్లీ వేదికగా ఎన్డీయే కూటమిలోని కీలక నేతలను, ఎంపీలను సమన్వయం చేస్తూ అమరావతి ఆవశ్యకతను వివరించడంలో లోకేష్ సక్సెస్ అయ్యారనీ అంటున్నారు. పార్లమెంటు సమావేశాల సమయంలోనూ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిణామాలను గమనిస్తూ అమరావతికి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించేలా చేశారనని చెబుతున్నారు.
అమరావతికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన అనంతరం, లోకేష్ మరోసారి ఢిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పర్యటన లోకేష్ రాజకీయ పరిణతికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి సారిస్తుండగా, జాతీయ స్థాయిలో పార్టీ గళాన్ని వినిపించడం, రాష్ట్రప్రయోజనాల సాధనకు కృషి చేయడం వంటి బాధ్యతను లోకేష్ భుజాన వేసుకున్నారని అంటున్నారు.
రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణతో పాటు, కేంద్రం నుంచి రావాల్సిన సహాయ సహకారాల విషయంలోనూ లోకేష్ వరుసగా జాతీయ నాయకులను కలుస్తున్నారు. తండ్రి నారా చంద్రబాబు రాజకీయ వారసత్వాని అందిపుచ్చుకుంటూనే.. అదే సమయంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధిస్తున్నారని చెబుతున్నారు. లోకేష్ చొరవతో అమరావతికి మార్గం సుగమం కావడమే కాకుండా, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఎన్డీయే వర్గాలే అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/legal-status-for-amaravati-39-217214.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది