Publish Date:Apr 23, 2024
ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే. ఇక్కడ పేర్కొన్న వర్గాలకు చెందిన వారు ఈ వారం పది రోజులపాటు రాజకీయ నాయకులకు సంబంధించిన అఫిడవిట్లను వివరాలను చూడటం మానేస్తే మంచిది. ఎందుకంటే, రాజకీయ నాయకుల నేరాల చిట్టా చూసి మనసు బాధపడుతుందని కాదు.. వాళ్ళకున్న ఆస్తులను చూసి గుండెలు అవిసిపోతాయి కాబట్టి. ముఖ్యంగా నెల జీతంతో జీవితాలను నెట్టుకొచ్చే వారి హృదయాలు ఎవరో పిడికిలితో పిండేసినట్టు తల్లడిల్లిపోతాయి కనుక.
దేశంలో చాలామంది జనం నెలకు 20 వేలు సంపాదించాలంటే అడ్డమైన గడ్డి కరవాల్సి వస్తోంది. అలాంటి రాజకీయ నాయకులకు ఈ ఆస్తులేంటండి బాబు.. గతంలో నాయకుల ఆస్తుల వివరాలు రెండు కోట్లు, మూడుకోట్లు అని చదివి అమ్మో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడో... వందల కోట్లు, వేల కోట్లు.. పేర్లెందుగానీ, ఒక మనిషికి ఐదువేల కోట్లు, ఆరువేల కోట్లు ఆస్తుంలేంటండీ బాబు! కొంతమంది నాయకులు పెద్దలు సంపాదించిన వందలు, వేల కోట్లకు తాము సంపాదించిన మరిన్ని కోట్లు కలుపుతున్నారు. కొంతమంది సొంతగానే వేలకు వేల కోట్లు సంపాదిస్తున్నారు. స్థిరాస్తుల వివరాల్లో చూపించే అంకెలు కేవలం రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రమే. రిజిస్ట్రేషన్ వాల్యూతో లెక్కేస్తేనే అంతేసి వాల్యూ వుంటున్నాయంటే, ఆయా స్థిరాస్తుల అసలు విలువ ఎంత వుంటుందో ఊహించాలంటే భయం వేస్తుంది.
ఈ వందలు, వేల కోట్ల ఆస్తుల గురించి చూసి ఇన్స్పిరేషన్ పొంది బడుగు జీవులు కూడా అన్ని కోట్లు సంపాదించే ఛాన్స్ సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఎలాగూ సాధ్యం కాదు. కాకపోతే ఆ ఆస్తులను చూసి మానసికంగా క్రుంగిపోవడం మాత్రం ఖాయం. అందరూ మనుషులమే కదా.. వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటి? మనలో వున్న లోపం ఏంటి అని బాధపడి అల్లాడిపోవడం తథ్యం. అంచేత ఆ ఆస్తుల వివరాలను చూసి మనసు పాడు చేసుకోకుండా వుంటే మంచిది కదా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/leaders-property-affidavits-25-174389.html
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?
చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (మే6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో