ఏపీలో ల్యాండ్ మైన్‌లా పేలిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్!

Publish Date:May 8, 2024

Advertisement

ఏపీ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  ప్రచారాస్త్రంగా మారింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మంగా అమలు చేస్తున్నారు. ఇటీవల ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్టర్ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వివాదం అలుముకుంది. దేశంలో తొలిసారి అమలవుతున్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతోంది.  ఈ చట్టం భూకబ్జాదారులకు వరంగా మారుతుందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఇప్పటికే చేసిన సర్వేలో తమ భూమి పరిణామం తగ్గిపోయిందని గగ్గోలు పెడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఇవన్నీ కలిసి వైసీపీ సర్కార్ కు ఘోర ప‌రాభ‌వం త‌ప్పేట‌ట్లు లేదు. భూములు జోలికి వచ్చిన ఏ ప్రభుత్వానికైనా ప్ర‌జ‌లు బుద్ధి చెబుతారు. తెలంగాణాలో అదే జ‌రిగింది. కేసీఆర్ ఓడిపోవ‌డానికి  ధరణి కూడా ఒక కార‌ణం.  ఈ చట్టం వల్ల కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. గ్రామాల్లోనూ లెక్కకు మించి  సమస్యలు వచ్చాయి. రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగిన రైతులు పడిన బాధలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేశారు.  ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణాలో ధ‌ర‌ణి లాగే, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..  ఏపీ పాలిటిక్స్‌లో ల్యాండ్ మైన్‌లా పేలింది. ప్రభుత్వం భూములు గుంజుకునేందుకే ఈ చట్టాన్ని తెచ్చిందని విపక్షాలు. లేదు మీ భూముల పరిరక్షణకే ఈ చట్టమని అధికార పక్షం ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఈ చట్టంలోని లొసుగులపై విస్తృత చర్చ జరుగుతోంది. ఒక్కో అంశం.. ఎంత ప్రమాదకమైనదో లాయర్ల విశ్లేషణలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ భయం ఏర్పడుతోంది. ఇది వైసీపీకి పెను సవాల్ గా మారింది.  

సంక్షేమ పథకాలను అమలు పర్చినా, కేసీఆర్ ఇటీవ‌ల‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ పదేళ్ల నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలు, గతంలో తెలంగాణ ప్రజలు ఏ ప్రభుత్వం నుంచి అందుకోలేదు. ఒకటా.. రెండా.. చివరకు దళితబంధు కింద పది లక్ష రూపాయలను కూడా ఇస్తూ ఆ ఓటు బ్యాంకును సొంతం చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక రైతు భరోసా కింద నిధులు ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాలున్నా అందచేశారు.  అయినా ఓడిపోయారు.  ఓడిపోవ‌డానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి ధరణి పోర్టల్ అని చెప్ప‌వ‌చ్చు. ధరణి పోర్టల్ తెచ్చి భూములను గుంజుకోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమేనని కాంగ్రెస్ చేసిన ప్రచారానికి ప్రజలు పడిపోయారు. కేసీఆర్ ఓటమికి ధరణి పోర్టల్ ప్ర‌ధాన కారణమని చెప్పుకోవ‌చ్చు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ తెలుగుదేశం పార్టీ రైతులను ఆకట్టుకునేందుకు అలాంటి అంశాన్నే భుజానకెత్తుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది.   ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని వైసీపీ చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

పట్టాదారు పాస్ పుస్తకాలపై... ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్ ఫొటోను ముద్రించడాన్ని కూడా టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ప్రభుత్వాలు శాశ్వతమని, ముఖ్యమంత్రులు కారని, అలాంటిది పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను ఎలా ముద్రిస్తారంటూ టీడీపీ నేతలు పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే పల్లవి అందుకున్నారు. దీంతో వైసీపీకి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.  బడా పారిశ్రామికవేత్తలకు భూ సేకరణలో వివాదాలు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయవాదులు చెబుతున్నారు. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
ఎన్నో అంచనాలతో విడుదలైన వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిర్మాత, దర్శకుడు, హీరో అయిన జగన్ ఈ సినిమాని హింసాత్మకంగా, దారుణంగా రూపొందించడంతో ఆంధ్రా ప్రజలు రిజెక్ట్ చేశారు. ఫస్ట్ రిలీజ్‌లోనే ఈ సినిమాని జనం భరించలేకపోయారు.. ఇక సెకండ్ రిలీజ్ కూడానా?!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆయన అజర్ బైజాన్ వెళ్తూ వుండగా వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిందని తెలుస్తోంది.
భూటాన్ రాజధాని ధింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిష్ట్ టూర్ ఆపరేటర్స్ కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించినట్టు ఏబీటీవో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌలేష్ కుమార్ తెలిపారు.
గ‌తం కంటే ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఐప్యాక్ బృందంతో స‌మావేశ‌మైన స‌మ‌యంలో ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ ముఖ్య నేత‌లు సైతం 150 నుంచి 160 స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు.
రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-17
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు.
న్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది.
పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.