తిరుమల లడ్డూ వివాదం.. బండి ఆందోళన!

Publish Date:Sep 20, 2024

Advertisement

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన గురి చేసిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.  శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను ఇది తీవ్రంగా కలిచి వేస్తోందన్నారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదన్నారు.  సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందన్నారు.  తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ ఆ లేఖలో చంద్రబాబును కోరారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌ కు మరో వాయుగుండం పొంచి ఉంది.   ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులకు  రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నిర్ణయించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో   ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావుపై  రెడ్ కార్నర్ నోటీసులు   జారీ చేయాలన్న హైదరాబాద్ పోలీసుల విజ్ణప్తికి సీబీఐ సానుకూలంగా స్పందించింది.
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది.
లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను ఆదేశించారు.
ముంబయి నటి కాదంబరీ జత్వానీని వేధించిన కేసులో  పోలీసులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో కీలకమైన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ను ఏపీ పోలీసులు ఈ రోజు (శుక్రవారం) డెహ్రాడూన్‌లో అరెస్టు చేశారు.
తన దగ్గర పనిచేసే డాన్సర్ మీద అత్యాచారం జరిపిన నేరం మీద పోలీసులు అరెస్టు చేసిన కొరియోగ్రాఫర్ జానీకి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది.
మాజీ మంత్రి విడదల రజనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమె తమను భయపెట్టి, బెదిరించి, కోట్లాది రూపాయపలు వసూలు చేశారంటూ పల్నాడు జిల్లా, ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈ మేరకు హోంమంత్రి అనితకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద వరలక్ష్మి అనే మహిళ పెట్టిన అత్యాచారం కేసును హైకోర్టు కొట్టేసింది.
అఫ్జల్ కు ఇటీవలె నిఖా( పెళ్లి) అయ్యింది.  చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ స్నేహితులతో అప్జల్ ప్రతీ రోజు ఇంటికి తప్ప తాగి వచ్చేవాడు. పెళ్లికూతురుకు ఇది నచ్చలేదు. వెంటనే తల్లిదండ్రులకు విషయం చేరవేసింది. కూతురు బాధను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు అదే బస్తీలో ప్రవచనాలు (తక్రీర్ ) ఇచ్చే మౌలానాను ఆశ్రయించారు.
వైసీపీ ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయాన్ని అందుకోవడాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికీ నమ్మడం లేదు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వైసీపీలోని కొందరు మినహా మెజారిటీ నేతలు వాస్తవాన్ని అంగీకరించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎవర్నీ రాజకీయంగా చెడగొట్టకపోయినప్పటికీ, చెడిపోయినవాళ్ళని మాత్రం చేరదీస్తున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం హైకోర్టుకు చేరింది. లడ్డూ ప్రసాదం విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని  కోరుతూ సీనియర్ న్యాయవాది పోన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.