Publish Date:May 12, 2023
కర్నాటక ఎన్నికలలో కింగ్ మేకర్ గా కచ్చితంగా ఉంటామనీ, కాలం కలసి వస్తే.. ముఖ్యమంత్రి పదవి కూడా దక్కేస్తుందనీ ఎన్నో ఆశలుపెట్టుకున్న జేడీఎస్.. తీరా ఎన్నికలు పూర్తయిన తరువాత తమకు అంత సీన్ లేదని అంగీకరించేసింది. అయితే ప్రజా తీర్పు మేరకే తమకు ఆ సీన్ లేకుండా పోయిందని మాత్రం అనడం లేదు.
అవసరమైనంతగా సొమ్ములు ఖర్చు చేయలేకపోవడం వల్లే.. ఈ పరిస్థితి ఎదురైందని చెబుతోంది. అంతే కాదు.. తాము అనుకున్నంతగా పోటీ యివ్వ లేకపోవడానికి నమ్ముకున్న ఒక మిత్రుడు హ్యాండ్ యివ్వడమే కారణమని చెబుతోంది. కచ్చితంగా యివే మాటలు కాకపోయినా.. జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కర్నాటక ఎన్నికల పోలింగ్ పూర్తయిన తరువాత మీడియా సమావేశంలో చెప్పిన మాటలకు యిదే అర్ధం. ఆయన సహకరించలేదంటూ పేరెత్తకుండా చేస్తున్న విమర్శలన్నీ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనేనని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. కర్నాటక ఎన్నికలు ముగిశాయి. శనివారం ( మే 13) ఫలితాలు వెలువడుతాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ లు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎడ్జ్ కాంగ్రెస్ కు ఉందని చెబుతున్నాయి. జేడీఎస్ కీలక రోల్ ప్లే చేసే అవకాశం ఉందన్నది ఎగ్జిట్స్ పోల్స్ చెబుతున్న మాట. అయినా జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా కీ రోల్ ప్లే చేయడానికి అవసరమైన స్థానాలలో తాము విజయం సాధిస్తామన్ననమ్మకాన్ని వ్యక్తం చేయడం లేదు. ఎంత శ్రమపడినా ఆర్థిక ప్రతిబంధకం వల్ల మహా గెలుస్తే ఓ పాతిక స్థానాలలో గెలిచినా అదేమీ తాము కీ రోల్ ప్లే చేయడానికి సరిపోవన్నది ఆయన మాటల సారాంశం. కాగా కుమారస్వామి ఆర్థిక వనరుల లేమి కారణంగానే తాము ఎన్నికలలో అనుకున్నంతగా పోటీ యివ్వలేకపోయామనడంపై కన్నడ రాజకీయ వర్గాలతో పాటు తెలంగాణ రాజకీయ వర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కుమారస్వామి అసంతృప్తి అంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు అండగా నిలవలేదనేనని అంటున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం గురించి చెప్పిన క్షణం నుంచీ కుమారస్వామి ఆయన వెంటే ఉన్నారు. నడిచారు. కన్నడ ఎన్నికలలో బీఆర్ఎస్ తో పొత్తు గురించి కూడా తొలుత ఆయనే మాట్లాడారు. పొత్తులో భాగంగా లోక్ సభ స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తామనీ, అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ తమకు అన్ని విధాలుగా సహకరించాలన్న ప్రతిపాదనలు కూడా చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు బీఆర్ఎస్ ఆర్థికంగా అండదండగా ఉంటుందన్న ప్రచారం అప్పట్లో కర్నాటక , తెలంగాణ రాష్ట్రాలలో విస్తృతంగా జరిగింది.
కర్ణాటక ఎన్నికల్లో కలిసి పని చేద్దామని ఆర్థిక సాయం చేస్తామని కేసీఆర్ చెప్పారని కూడా అప్పట్లో చెప్పుకున్నారు. ఆ కారణంగానే కుమారస్వామి కేసీఆర్ కాకితో కబురెట్టినా హైదరాబాద్ వచ్చి వాలిపోయేవారని గుర్తు చేస్తున్నారు. కానీ తీరా సమయం వచ్చినప్పుడు కేసీఆర్ ముఖం చాటేశారన్నది కుమారస్వామి భావనగా ఆయన మాటలను బట్టి అవగతమౌతోంది. కారణం ఏమిటన్నది పక్కన పెడితే.. కర్ణాటక ఎన్నికల వైపు కేసీఆర్ కనీసం దృష్టి కూడా పెట్టలేదు. జేడీఎస్ కు ఎటువంటి ఆర్థిక సాహం చేయలేదు. ఆ కారణంగానే కుమారస్వామి కర్నాటక ఎన్నికలు ముగిసిన తరువాత బహిరంగంగానే కేసీఆర్ పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kumaraswamy-angry-on-kcr-39-155171.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.