Publish Date:Nov 15, 2024
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి జత్వానీ కేసులో అరెస్టైన కుక్కల విద్యాసగర్ బెయిలు పిటిషన్ పై విజయవాడ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి తీర్పును శనివారం (నవంబర్ 16)కు రిజర్వ్ చేశారు. కాగా కుక్కల విద్యాసాగర్ కు బోయిల్ ఇవ్వొద్దంటూ నటి జత్వానీ తరఫు న్యాయవాది శ్రీనివాసరావు వాదించారు.
కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగరరావు బెయిలు పిటిషన్ పై విజయవాడ కోర్టులో గురువారం (నవంబర్ 14)న వాదనలు పూర్తయ్యాయి. తనను తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారంటూ నటి కాదంబరి జెత్వాని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన డెహ్రాడూన్ లో ఉండగా పట్టుకుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనను రిమాండ్ కు తరలించింది.
తనను తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారని కొద్ది రోజుల క్రితం కాదంబరి జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కుక్కల విద్యాసాగర్ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే విద్యాసాగర్కు బెయిల్ మంజూరు చేస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని నటి జత్వాని తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసులో నిందితుడికి అప్పట్లో ఐపీఎస్ అధికారులు సహకరించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తప్పుడు పత్రాలు సృష్టించి జత్వానీని అక్రమంగా ముంబై నుంచి తీసుకువచ్చి 42 రోజుల పాటు జైలులో ఉంచారని పేర్కొన్నారు. ఇప్పుడు విద్యాసాగర్ కు బెయిలు మంజూరు చేస్తే వాస్తవాలు బయటకు రాకుండా సాక్షులను ప్రభావితం చేస్తారని జత్వాని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా కుక్కల విద్యాసాగర్ పరారయ్యే అవకాశం కూడా ఉందన్నారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి తీర్పును శనివారం (నవంబర్ 16)కు రిజర్వ్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kukkala-vidyasagar-bail-petition-judgement-reserve-39-188389.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.