Publish Date:Apr 20, 2024
అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం.. అధికారం ఉంటేనే నిలిచే బంధం అని వగచడమే మిటిలింది ఆయనకు. పార్టీ ఓటమి తరువాత కేటీఆర్ నోటి దురుసు పెరిగింది. గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పైనే కాదు.. ఓటమి తరువాత పార్టీ వదిలి వెడుతున్న వారిపై కూడా ఆయన ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ద్రోహులంటూ నిందిస్తున్నారు. అయితే తాటాకు చప్పుళ్ల లాంటి ఆయన దూషణలకు, బెదరింపులకు ఎవరూ వెరిచి వెనకడుగు వేయడం లేదు. వలసల దారి వలసలుగానే ఉంది.
ఒక్క కేటీఆర్ మాటలు మాత్రం రీసౌండ్ లా ఆయనకే అందరి కంటే గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో అధికారంలో ఉండగా పార్టీ అధినేత, తన తండ్రి అయిన కేసీఆర్ రాజకీయ వ్యూహమే ఇప్పుడు రివర్స్ లో పార్టీని ఖాళీ చేస్తున్నట్లు కేటీఆర్ కు అవగతం అవుతోందా అంటే నెటిజనులు జోకులు పేలుస్తున్నారు. సరే పార్టీ నేతలు, సిట్టింగులు మారుతున్నారు సరే.. స్వయానా బంధువులు కూడా బంధుత్వానికీ బే, పార్టీకీ బేబ్బే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ కారు దిగిపోవడాన్ని ఆయన ఎలా జీర్ణించుకుంటారో పాపం అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
తాజాగా కేటీఆర్ కు స్వయానా బావమరిది అయిన ఎడ్ల రాహుల్ రావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తన భార్య సోదరుడు, పైగా బావ అధికారంలో ఉండగా ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న రాహుల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఏ విధంగా చూసినా కేటీఆర్ కు చెప్పుకోలేని పరాభవంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పైగా రాహుల్ రెడ్డికి కాంగ్రెస్ గూటికి చేర్చింది.. అసెంబ్లీ ఎన్నికల ముందు కేటీఆర్ తో విభేదించి కారు దిగి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మైనంపల్లి హనుమంతరావు కావడం కేటీఆర్ కు మరింత ఇబ్బంది కలిగించే అంశంగా చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కారు దిగి వెళ్లి పోతున్న నేతలను నిలువరించడంలో ఘోరంగా విఫలమై.. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి పార్టీ వదిలి వెడుతున్న వారిపై దూషణలకు దిగుతూ, ద్రోహులూ అవకాశ వాదులూ అంటూ నిందిస్తున్న కేటీఆర్ ఇప్పుడు తన బావమరిదే బీఆర్ఎస్ కు జెల్ల కొట్టి కాంగ్రెస్ పంచన చేరడం ఎలా చూసినా తట్టుకోలేని అవమానంగానే పరిశీలకులు చెబుతున్నారు. పార్టీ మారకుండా సొంత బావమరిదిని నిలువరించలేని కేటీఆర్.. పార్టీని ఏం కాపాడుతారంటూ కేటీఆర్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా కేటీఆర్ వైఫల్యాలపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-wife-brother-joins-congress-39-174183.html
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి.
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.
ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి
రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి హేమాహేమీలు తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్లో వున్న రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజకీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.