Publish Date:Apr 17, 2020
అది కె సి ఆర్ ఫ్యామిలీ మెంబర్ల సరదా కాబట్టి, సోషల్ మీడియా అంతా ఒకటే హల్ చల్ అవుతోంది. లాక్ డౌన్ దెబ్బకి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన జుట్టుకు రిలీఫ్ ఇద్దామంటే, అదేనండీ 'కేశ సంస్కారం' చేద్దామనుకుంటే, ఒక్క సెలూన్ తెరిచి లేదాయె.. ఇంకేమి చేయాలో తెలియని ఒక పెద్ద మనిషిని ట్విట్టర్ వేదికగా కె టీ ఆర్ కు తన కేశ వేదన ను విన్నవించుకోవడం, తదనంతర నెట్టింటి సంభాషణలు మీరే చదవండి.
దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ పొడిగించడంతో బ్యూటీపార్లర్లు, సెలూన్లు కూడా మూతపడటంతో కటింగ్, షేవింగ్ చేసుకోవడం కూడా పెద్ద ఇబ్బందిగా మారింది. లాక్డౌన్ ఎత్తేసే వరకు ఇంకా ఎన్నిరోజులు పడుతుందో..హెయిర్ కటింగ్ చేసుకోకుండా ఇంకా ఎన్నిరోజులు ఉండాలనే దానిపై ఆందోళన చెందుతున్నారు. బార్బర్ షాపులు, సెలూన్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో శరత్ చంద్ర అనే వ్యక్తి ఏప్రిల్ 20 తర్వాత సెలూన్లు ఓపెన్ చేసే అవకాశం ఉందా అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. లేకపోతే..తన భార్య హెయిర్ కట్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని తెలిపాడు. అదే జరిగితే, లాక్డౌన్ తర్వాత కూడా తాను ఇంటికి పరిమితం కావాల్సి వస్తుందని సరదాగా వ్యాఖ్యానించాడు. దీనిపై కేటీఆర్ కూడా తమాషాగా బదులిచ్చారు.
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే తనకు హెయిర్ కట్ చేయడానికి తన భార్య అనుష్క శర్మకు అవకాశం ఇచ్చాడని గుర్తు చేశారు. నువ్వెందుకు ఆ అవకాశం ఇవ్వకూడదూ? అని కేటీఆర్ బదులిస్తూ..నవ్వుతున్న ఎమోజీని జత చేశారు. కేటీఆర్ ట్వీట్కు మాజీ ఎంపీ కవిత కూడా స్పందిస్తూ.. ‘అన్నయ్యా.. బాబీకి కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా ?! అని అడిగారు. ప్రస్తుతం ఈ సంభాషణపై నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు చేస్తుండటంతో ట్విటర్లో వైరల్గా మారింది. అదండీ సంగతి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-and-kavita-funny-conversation-25-97832.html
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.