ఔను ఫోన్ ట్యాపింగ్ నిజమే.. అయినా నాకు తెలియదు.. కేటీఆర్

Publish Date:Mar 27, 2024

Advertisement

చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎంత బుకాయించినా నిజం నోటి వెంట తన్నుకు రాక తప్పదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విషయంలోనూ అదే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ కేటీఆర్ తన నోటి వెంటే చెప్పేశారు. వెంటనే నాలుక కరుచుకుని ఏమో నాకు తెలియదు అంటూ సర్దుకున్నారు. 

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విస్తృత చర్చ జరుగుతోంది. సస్పెండ్ అయిన ఎస్ఐబీ డీఎఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ1గా ఉన్నారు. విచారణలో ఆయన వెల్లడించిన విషయాలను సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ అగ్రనేతల ఆదేశాలతోనే తాను పలువురు రాజకీయనాయకుల ఫోన్లు ట్యాప్ చేశానని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కేవలం రాజకీయ నాయకుల ఫోన్లే కాకుండా, సినీ హీరోయిన్లు, బడా వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనీ, దీనినో దందాగా మార్చి వేల కోట్లు దండుకున్నారనీ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇప్పటి వరకూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలెవరూ నోరెత్తలేదు. అయితే తాజాగా కేటీఆర్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ ఒప్పుకున్నారు. బుధవారం (మార్చి 27)మల్కాజ్ గిరి  పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడారు.

ఔను కొన్ని ఫోన్ కాల్స్ ట్యాప్ అయి ఉంటాయి అని అంగీకరించారు. అయితే వెంటనే సర్దుకుని ఆ విషయం తనకు తెలియదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా క్రిమినల్స్ ఫోన్లు ట్యాప్ చేస్తే మాత్రం తప్పేమిటని ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్ ఈ విషయాన్ని ఏదో అంతర్జాతీయ కుంభకోణంగా చూపేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

అయినా క్రిమినల్స్ ఫోన్లు ట్యాప్ చేయడం పోలీసుల బాధ్యత కాదా అని ప్రశ్నించారు. అయితే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందనీ, దాని వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని కేటీఆర్ పరోక్షంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు చెబుతున్నారు.  

By
en-us Political News

  
కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని ఆమె తల్లి విజయమ్మ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆమె అమెరికా నుంచి ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నేను మీ విజయమ్మను. రాజశేఖరరెడ్డిని
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కీలక సూచన చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని చెప్పారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం శనివారం (మే11) సాయంత్రంతో ముగుస్తుంది. సోమవారం (మే13)న ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని నెలల కిందటి వరకూ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం వేరు. ఇప్పుడు వేరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నాలుగైదు నెలల కిందటి వరకూ రాష్ట్రంలో మరోసారి జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అన్న భావన గట్టిగానే వ్యక్తమయ్యేది. అయితే ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అయితే ఏపీలో ఎన్నికల వార్ వన్ సైడేనని సామాన్య జనం కూడా అంటున్నారు. తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వేవ్ ఉందని చెబుతున్నారు. నమ్ముతున్నారు.
కాగా, ఈ సిరీస్లో మూడో ఎపిసోడ్ శనివారం నాడు రిలీజ్ అయింది. మొదటి, రెండవ ఎపిసోడ్స్.లో మెరుపులా మెరిసిన డైమండ్ రాణి, ఈ ఎపిసోడ్‌లో పూర్తి స్థాయిలో
బూతుల ఫ్యాక్టరీ, గుట్కా బస్తా అని గిట్టనివారు పిలుచుకునే కొడాలి నానికి ఇప్పుడు కొత్త పిచ్చి పట్టింది. కొడాలి నాని నోరు తెరిస్తే గుట్కా కంపు ముందు వస్తుందో, బూతుమాట ముందు వస్తుందో నిజానికి ఆయనకి కూడా తెలియదు.
సింహం సింగిల్ గానే వస్తుంది. ఎంత మంది కలిసినా వా వెంట్రుక కూడా పీకలేరు. వైనాట్ 175, అక్క చెల్లెమ్మలు, అవ్వా తాతలకు సంకేమం సొమ్ములు క్రమం తప్పకుండా బటన్ నొక్కి పంచాను. వాళ్లంతా నాకే ఓటేస్తారు. ఇవీ జగన్ నిన్నమొన్నటి దాకా గంభీరంగా చెప్పిన మాటలు. మరి ఆ ధైర్యం, స్థైర్యం ఏమైపోయాయో.. ఇప్పుడు బేలగా, దీనంగా మాట్లాడుతున్నారు.
వల్లభనేని వంశీ.. ఇటీవలి కాలంలో ప్రజలలో బాగా నానుతున్న పేరు. అదేదో ఆయన గొప్ప పనులు చేసేశారని కానీ, సమాజ సేవలో మునిగి తేలుతున్నరాన్న ప్రశంసలతో కానీ కాదు. అడ్డగోలు రాజకీయం, తిన్న ఇంటి వాసాలనే లెక్కపెట్టే నైజంపై వెల్లువెత్తుతున్న విమర్శల కాలంగా ఇటీవలి కాలంలో ఆయన పేరు ప్రజలలో బాగా చర్చకు వచ్చింది.
అది అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ నివాసం. సమయం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు అవుతోంది. అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు రామకృష్ణ ఇంటి మీద దాడి చేశారు. వాళ్ళ చేతిలో వేటకొడవళ్ళు వున్నాయి.
ఛత్తీస్ గడ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు నేలకొరిగారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భారీగా ఆయుధాలను, విప్లవసాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
జగన్ ఎలా తయారయ్యాడంటే, తన విషయంలో ఏది జరిగినా దాని వెనుక వున్నది చంద్రబాబే. జగన్‌కి నరాల వీక్నెస్ వచ్చినా దానికి కారణం చంద్రబాబే. ఎంచక్కా బాబాయ్‌ని పైకి పంపేసి, ఆ నేరాన్ని చంద్రబాబు నెత్తిన వేశాడు.
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సరళి ఎలా ఉండబోతోందో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు తేల్చి చెప్పేసింది. ఏపీలో ప్రభుత్వోద్యోగులు, టీచర్లు మున్నెన్నడూ ఎరుగని విధంగా ఓ విధమైన కసితో పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్న తీరు ప్రభుత్వంపై వారి వ్యతిరేకత, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది.
ఎన్నికల పండగ వచ్చింది.. హైదరాబాద్ ఖాళీ అవుతుంది..! ఎప్పుడూ పండగల సమయంలో ఖాళీ అయ్యే హైదరాబాద్ ఈసారి ఎన్నికల నేప‌థ్యంలో ఖాళీ అవుతోంది. డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ బస్సు టికెట్ల ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండగలకు పెంచే దానికంటే అధికంగానే ఉన్నాయి టికెట్ ధరలు. ఒక్కో టికెట్ రెండు వేల రూపాయ‌ల నుంచి మూడు వేల రూపాయ‌ల ధ‌ర వ‌సూలు చేస్తున్నారు.
ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ వాస్తవ్యులు  భారీ ఎత్తున సొంత రాష్ట్రం ఏపీకి తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని స్వగ్రామాలకు, సొంత పట్టణాలకు తరలివస్తున్న వారితో హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సులు క్రిక్కిరిసి ఉంటున్నాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.