Publish Date:Mar 27, 2024
చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎంత బుకాయించినా నిజం నోటి వెంట తన్నుకు రాక తప్పదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విషయంలోనూ అదే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ కేటీఆర్ తన నోటి వెంటే చెప్పేశారు. వెంటనే నాలుక కరుచుకుని ఏమో నాకు తెలియదు అంటూ సర్దుకున్నారు.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విస్తృత చర్చ జరుగుతోంది. సస్పెండ్ అయిన ఎస్ఐబీ డీఎఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ1గా ఉన్నారు. విచారణలో ఆయన వెల్లడించిన విషయాలను సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ అగ్రనేతల ఆదేశాలతోనే తాను పలువురు రాజకీయనాయకుల ఫోన్లు ట్యాప్ చేశానని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కేవలం రాజకీయ నాయకుల ఫోన్లే కాకుండా, సినీ హీరోయిన్లు, బడా వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనీ, దీనినో దందాగా మార్చి వేల కోట్లు దండుకున్నారనీ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇప్పటి వరకూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలెవరూ నోరెత్తలేదు. అయితే తాజాగా కేటీఆర్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ ఒప్పుకున్నారు. బుధవారం (మార్చి 27)మల్కాజ్ గిరి పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడారు.
ఔను కొన్ని ఫోన్ కాల్స్ ట్యాప్ అయి ఉంటాయి అని అంగీకరించారు. అయితే వెంటనే సర్దుకుని ఆ విషయం తనకు తెలియదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా క్రిమినల్స్ ఫోన్లు ట్యాప్ చేస్తే మాత్రం తప్పేమిటని ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్ ఈ విషయాన్ని ఏదో అంతర్జాతీయ కుంభకోణంగా చూపేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
అయినా క్రిమినల్స్ ఫోన్లు ట్యాప్ చేయడం పోలీసుల బాధ్యత కాదా అని ప్రశ్నించారు. అయితే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందనీ, దాని వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని కేటీఆర్ పరోక్షంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-admits-phone-tapping-39-172802.html
అధికారం కోసం ఈ వైసీపీ పిశాచాలు అశుద్ధ భక్షణకు కూడా రెడీ అయ్యేట్టున్నాయి. చేజారిపోబోతున్న అధికారాన్ని మళ్ళీ ఎలాగైనా దక్కించుకుని, రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులు పాతాళానికి దిగజారిపోతున్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో అశేష జనవాహిని మధ్య పెనుకొండ తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి సవితమ్మ
జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని చంపిస్తాడా? అవునని అంటున్నాడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి.
తాను, తన భార్య ఒకే గదిలో ఉండటం లేదని చెప్పారు. కండోమ్ లేకుండానే ట్రంప్ నాతో శృంగారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో నా వయసు 27 ఏళ్లు.. ట్రంప్ వయసు నా తండ్రి కంటే ఎక్కువ ఉంటుందేమో’’ అంటూ వివరంగా ఆ రోజు ఏం జరిగిందో 45 ఏళ్ల స్టార్మీ డేనియల్స్ చెప్పారు.
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం చెప్పింది. ఎన్నికలు పూర్తి కాగానే కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు అనుమతించాలంటూ జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
జగన్ సామ్రాజ్యంగా చెప్పుకునే కడప లోక్ సభ స్థానంలో ఈ సారి ఆయన పార్టీ మూడో స్థానానికే పరిమితం కానుందా? అంటే స్థానికులు ఔననే అంటున్నారు. ఈ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోటే ఇక్కడ వైసీపీ గ్రాఫ్ దిగజారడం ఆరంభమైంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రచార పర్వం ఈ శనివారం (మే 11) సాయంత్రంతో ముగియనుంది. అంటే నిండా మూడు రోజుల వ్యవధి కూడా లేదు. ఈ దశలో రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా సీని పరిశ్రమ వారు రంగంలోకి దిగి పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార రంగంలోకి దూకడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతిపై, పగబట్టినట్టుగానే పోలవరంపై కూడా పగబట్టారు. ఆ పనులను నిలిపివేయించారు. కాంట్రాక్టర్లను బెదిరించి పక్కకు తప్పించారు. రివర్స్ టెండర్లు అంటూ పెద్ద డ్రామా నడిపించి.. తమకు అత్యంత దగ్గరివారైన మేఘా కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ వ్యవహారం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు ఆదా చేశామంటూ మాయమాటలు వల్లించారు. అప్పటి నుంచి పోలవరం పనులు పూర్తిగా పడకేశాయి.
చింతమనేని విజయం ఖాయమని స్థానికులు అనుకుంటున్నారు. ఈ సారి, లండన్ బాబును లండన్ పంపించి, తనకు ప్రజలు నలభై వేల మెజార్టీ ఇస్తారని నమ్మకంతో చింతమనేని ఉన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జగన్ చెబుతున్న అబద్ధాలు విని జనం చీదరించుకుంటున్నారు. వీటికంటే ఎక్కువ ఇరిటేషన్ కలిగిస్తున్న అంశం..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారికూడా మీడియా ముందుకు రాలేదు. తెలుగు మీడియా అంటే ఆయనకు చిరాకు కాబోలు.. ఛీఛీ నేనా.. తెలుగు మీడియాతో మాట్లాడటమా అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నిత్యం కాకపోయినా తరచుగా మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరిస్తుంటారు.
కొట్టు సత్యనారాయణ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు