Publish Date:Jul 13, 2025
గణేశ్ సినిమాలో.. ఫేమస్ డైలాగ్. నేను బతకాలి తమ్మీ అంటూ ఆయన చెప్పిన డైలాగులకు అప్పట్లో యమ క్రేజుండేది. ఆపై గాయంలో ఆయన ఖండిస్తున్న అనే డైలాగ్ కూడా చాలా చాలా ఫేమస్ అయ్యింది. ఇక ఆమె సినిమాలో కోట నట విశ్వరూపం మామూలుది కాదు.ఇలా చెప్పుకుంటూ పోతే సీరియస్ కామెడీ తేడా లేకుండా ఆయా పాత్రలను అవలీలలగా పోషించిన కొందరంటే కొందరు నటులలో కోట నటనకు పెట్టిన కోటే.. నిజంగా. సాధారణంగా సినిమా రూట్ మ్యాప్ ఎలా ఉండేదంటే.. ఏదైనా ఎల్ఐసీ, జర్నలిజం, టీచింగ్, బ్యాంకు వంటి రంగాల్లో జాబ్ చేస్తూ.. ఆపై నాటకాలు ఆడుతూ.. అటు నుంచి సినిమాల్లో అవకాశాలు అంది పుచ్చుకుంటూ ఫైనల్ గా ఇక్కడ సెటిలవడం.
ఈ విషయంలో ఇప్పటికీ చాలా మంది కప్పదాట్లు దాటుతూ ఉంటారు. వారికంటూ అంత తేలిగ్గా ఫీల్డ్ లో బిజీ కావడం సాధ్యమయ్యే పని కాదు. కానీ కోట అలాక్కాదు. బ్యాంకు జాబు అదీ ఇదీ మొత్తం కట్టకట్టి.. అటక మీద పడేసి.. ఎంచక్కా సినిమా ఫీల్డ్ లో సెటిలై పోయారాయన.ఒక సమయంలో ఆయన బాబూ మోహన్ తో చేసిన మామగారు తరహా కామెడీకి అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. ఆ తర్వాత ఆయన సీరియస్ యాక్టింగ్ స్కిల్స్ కి సౌత్ లో చాలా సినిమాల్లో యాక్టింగ్ ఛాన్సులు వచ్చాయి.
ప్రకాష్ రాజ్ లా ఆయన జాతీయ ఉత్తమ నటుడు సాధించలేక పోయాడు కనీ.. ఇంచు మించు అలాంటి వర్సటైల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న నటుడు కోటా శ్రీనివాసరావు.ఎక్కడో బ్యాంకుల్లో ఉద్యోగం చేసుకుంటూ నాటకాలాడి.. ఆ నాటకాల ప్రస్తానం కొద్దీ సినిమాల్లోకి అడుగు పెట్టి.. అంచెలంచెలుగా నటుడిగా ఎన్నో ఎత్తులకు ఎదిగి ఒక సమయంలో.. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచి.. రాజకీయంగానూ తన ప్రస్తానం కొనసాగించి.. చివరికిదిగో ఇలా తన జీవితానికే టాటా చెప్పి వెళ్లిపోయారు కోట.
ఆయన తన నట జీవితంలో అన్ని కోరికలూ తీర్చుకుని వెళ్లారు. కానీ.. తన కొడుకు అర్ధాంతర మరణంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ఇటు తనతో పాటు ఎన్నో చిత్రాల్లో కలసి నటించిన బాబూ మోహన్ కి, తనకి ఇద్దరీ ఒకటే తరహా పుత్ర శోకం కలడం అత్యంత విషాద కరం.ఏది ఏమైనా కోట మృతి టాలీవుడ్ కి తీరని లోటు. కారణమేంటంటే.. ఆయనలాంటి పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించడానికి ఆయనే మరోమారు నటకోటావతారం ఎత్తాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kota-srinivasa-rao-39-201910.html
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
Publish Date:Jul 31, 2026
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక