తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తనపై ఏక కాలంలో విమర్శల దాడి చేయడాన్ని రేవంత్ తిప్పికొట్టిన తీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డినిక డిఫెన్స్ లో పడేసింది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామాకు ఆయన ఒక్కో సారి ఒక్కో కారణం చెప్పినా చివరకు తేల్చిందేమిటంటే మొదటి నుంచీ కాంగ్రెస్ లో ఉన్న తమను కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వక్తికి పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టడమేమిటి? ఆ వ్యక్తి ఆదేశాల మేరకు మేం పని చేయడమిటన్న దుగ్ధే కారణమని. అదే రాజగోపాలరెడ్డి పార్టీ మారడానికి కారణమని రాజగోపాలరెడ్డి తేల్చేశారు.
తన తమ్ముడు పార్టీ మారడంతో తనకు సంబంధం లేదని ఒక వైపు చెబుతూనే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు కారణం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలాగే వెంకటరెడ్డి కూడా రేవంత్ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం. రేవంత్ వైఖరి, వ్యవహార శైలి వల్లే తాను పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పుకోవడానికి అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే రాజగోపాలరెడ్డిపై రేవంత్ విమర్శలను తనకు ఆపాదించుకుని వెంటకరెడ్డి తన విమర్శలకు పదును పెట్టారని చెబుతున్నారు. మరో వైపు వెంకటరెడ్డి తమతో టచ్ లో ఉన్నట్లు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ప్రకటించినా దానిని ఖండించకుడా వెంకటరెడ్డి రేవంత్ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం, వరద నష్టం పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ఇవన్నీ వెంకటరెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునే దిశగా అడుగుతు వేస్తున్నారనడానికి సంకేతాలేనని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి స్పందన వ్యూహాత్మకంగా ఉందని చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తాను ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదనీ, తన విమర్శల దాడి అంతా పార్టీ మారిన కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డిపైనేనని రేవంత్ రెడ్డి విస్పష్టంగా చెప్పారు. పైగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వేరు.. వెంకటరెడ్డి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుడని చెప్పన రేవంత్ రెడ్డి రాజగోపాల రెడ్డిని మాత్రం కాంగ్రెస్ ద్రోహి అని పునరుద్ఘాటించడం ద్వారా వెంకటరెడ్డికి చెక్ పెట్టారు.రేవంత్ వివరణతో ఇక వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిపై విమర్శల దాడి చేసినా అవి బూమరాంగ్ అయ్యే పరిస్ధితి కల్పించారు. రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి.. తాను పార్టీకి దూరం కావడానికి ఆయనేనని చూపాలన్న వెంకటరెడ్డికి ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే కాంగ్రెస్ లో క్షేత్ర స్థాయిలో పార్టీ సీనియర్ల తీరు పట్ల ఒకింత అసంతృప్తి ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తరువాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోందనీ, తెరాసకు దీటుగా కాంగ్రెస్ నిలబడుతోందని క్షేత్ర స్థాయిలో బలపడిందని శ్రేణులు నమ్ముతున్నారు.
ఈ పరిస్థితుల్లో రేవంత్ విస్పష్ట వివరణ తరువాత కూడా కోమటి రెడ్డి తన విమర్శల దాడి కొనసాగిస్తే కార్యకర్తల దృష్టిలో పలుచన అయ్యే పరిస్థితి ఉంది. మొత్తం మీద కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి పార్టీని వీడినా అందుకు కారణం రేవంత్ అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ ఆయన అలా చెప్పినా ఎవరూ నమ్మే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/komiti-reddy-in-defence-with-revanth-strategy-39-141342.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.