Publish Date:Aug 12, 2025
ఒకప్పటి కోమటిరెడ్డికి ఇప్పటి కోమటిరెడ్డికి చాలానే తేడా ఉన్నట్టుంది చూస్తుంటే. ఆయనకు ఇచ్చిన శాఖల్లో సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఉంది. ఒక పక్క అక్కడ సినీ కార్మిక లోకం వర్సెస్ నిర్మాతలుగా బీభత్సమైన యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు సంధించు కుంటున్నారు. మూడేళ్లయ్యింది మాకు జీతం పెంచి అని కార్మికులు అంటుంటే, మీకసలు టాలెంటే లేదు. మేం ఐటీ ఎంప్లాయిస్ కన్నా ఎక్కువ వేతనాలిస్తున్నాం అని నిర్మాతలంటున్నారు. తొలి నుంచి సినీ పరిశ్రమ అవినీతి అడ్డా, అక్రమాల పుట్ట అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి చెందని నిర్మాత విశ్వ ప్రసాద్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు .
ఒక వేళ కోమటిరెడ్డి ఏదైనా సమస్య తీస్కుని పోరాడాల్సి ఉంటే.. సినీ పరిశ్రమకు చెందిన అంశం ఏదైనా తీస్కుని దాన్ని సాల్వ్ చేయాలిగానీ.. ఎస్ఎల్ బీసీ కూలడానికి క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపణలేంటో అర్ధం కావడం లేదంటారు కొందరు. ఒక వేళ కేసీఆర్ అండ్ కో కోరుకున్నారన్నదే ఆ ఆరోపణల అయితే అందులో హేతువు కనిపించదు. ఎందుకంటే కేసీఆర్ అండ్ కో కూలాలని కోరుకోవడం అంటూ జరిగితే ఎస్ ఎల్ బీసీ కాదు.. ఏకంగా రేవంత్ సర్కారే ప్రభుత్వమే కూలాలని కోరుకుంటారు కానీ ఎక్కడో ఉన్న ఎస్ఎల్బీసీ కూలితే వారికేమి వస్తుంది? అర్ధం కావడం లేదని అంటారు కొందరు.
మొన్న కూడా ఇలాగే రేవంతే సీఎంగా పదికాలాల పాటు ఉండాలని గణపతి పూజ చేయించానంటారు కోమటిరెడ్డి. కంటి ముందున్న పని పక్కన పెట్టి.. ఈ పూజల పిచ్చేందని పరిశీలకులు సైతం బుర్రలు గొక్కుంటున్నారు. ఒక పక్క తమ్ముడు చూస్తే మంత్రి పదవి కావాలంటూ మారాం చేస్తున్న చిన్న పిల్లాడిలా కనిపిస్తుంటే. మరో పక్క అన్న చూస్తే ప్రతిదానికీ పూజలకు లింకుబెట్టి మాట్లాడ్డం కనిపిస్తోంది.. ఏంటిదంతా? ఎందుకిలా జరుగుతోంది. ఉన్న సమస్యను పక్కన బెట్టి ఈ టాపిక్ డైవర్షనేంటన్న వాదన వినిపిస్తోంది. ఆ ఎస్ఎల్బీసీకి చెందిన ఇరిగేషన్ శాఖ కూడా ఆయనది కాదు. ప్రస్తుతం తన శాఖకు సంబంధించిన శాఖ సినిమాటోగ్రఫి. సినీ పరిశ్రమలో ఇంత లొల్లి జరుగుతుంటే అది పట్టకుండా కోమటిరెడ్డి ధోరణి ఇలా ఉందేమిటన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/komatireddy-venkatareddy-occultism-alligations-trolled-by-netizens-39-204046.html
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.