Publish Date:Aug 22, 2022
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంటే.. ఆయన పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ లాంటి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి విజయం అత్యంత అవసరం. ఇక్కడ విజయం సాధిస్తేనే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలన్న కాంగ్రెస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. పైగా సిట్టింగ్ సీటు. ఈ నేపథ్యంలో పార్టీలో అందరూ సమష్టిగా పని చేసి పార్టీకి విజయాన్ని చేకూర్చాల్సివన పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేనెవరి మాటా విన అంటూ భీష్మించుకు కూర్చున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న తమను కాదని.. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాను కాంగ్రెస్ ను వీడేదే లే అంటున్న కోమటిరెడ్డి.. రేవంత్ లో సఖ్యతగా పని చేయడానికి మాత్రం ససేమిరా అంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడనని ఇప్పటికే ప్రకటించిన వెంకటరెడ్డి.. ఆ మాటకు కట్టుబడే ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికపై కీలక భేటీకి డుమ్మా కొట్టార. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో హస్తినలో మునుగోడుపై కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లిన వెంకటరెడ్డి ఈ భేటీకి రేవంత్ కూడా వస్తున్నారంటూ భేటీలో పాల్గొనకుండానే వెనుదిరిగి వచ్చేశారు. అక్కడితో ఆగకుండా రేవంత్ మాణిక్కం ఠాగూర్ లపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఒక వైపు ప్రియాంక అధ్యక్షతన మునుగోడు ఉప ఎన్నికపై కీలక సమావేశానికి కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూరు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.
ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. తన సోదరుడి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక సందడి ఆరంభమైన తరువాత వెంకటరెడ్డి ఇంత వరకూ మునుగోడు వైపు వెళ్లలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీకి రాసిన లేఖలో రేవంత్ తో వేదిక పంచుకోలేననీ, మునుగోడులో ప్రచారానికి వెళ్లబోనని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న మాణిక్కం ఠాకూర్ వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆయనను తెలంగాణ నుంచి పంపించేయాలనీ కమల్ నాథ్ వంటి వారు ఆ స్థానంలో ఉంటే రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటుందని అన్నారు. ఇక రేవంత్ వల్ల పార్టీ భ్రష్టుపడుతోందని ఆరోపించారు. తమ కుటుంబంపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అందుకే ఆయనతో కలిసి పని చేయలేననీ స్పష్టం చేశారు. అయితే వెంకటరెడ్డి ఆరోపణలు, విమర్శలను కాంగ్రెస్ లైట్ గా తీసుకుంటోంది. వెంకటరెడ్డిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని పార్టీ హైకమాండ్ ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ కు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/komatireddy-venkatareddy-absent-for-meeting-on-munugodu-39-142462.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.