తెలుసా మీకు కోహినూర్.. మన తెలుగింటి వజ్రం!

Publish Date:Apr 6, 2025

Advertisement

కోహినూర్ వజ్రం గురించి మనం ఎక్కడో ఎప్పుడో వినే ఉంటాం. అవును చిన్నప్పడు పాఠ్య పుస్తకాల్లో ఎక్కడో చదువుకునే ఉంటాం. అయితే, ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలలో ఒకటైన కోహినూర్ వజ్రం ఇప్పడు ఎక్కడుందో, మనలో చాలా మందికి తెలియదు. ఇప్పడు ఎక్కడ వుందో అనే కాదు, అసలు ఎక్కడ పుట్టిందో, అక్కడికి ఎలా చేరిందో కూడా మనకు తెలియదు. అవును. ప్రపంచ ప్రసిద్ది చెందిన కోహినూర్ వజ్రం  పుట్టు పూర్వోత్తరాలు, కుల గోత్రాలు మనలో చాలా మందికి తెలియదు. తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే..  ఎక్కడెక్కడో తిరిగి, ఎన్నో చేతులు మారిన కోహినూర్ వజ్రం నిజానికి  మన తెలుగింటి వజ్రం. కోహినూర్ పుట్టిల్లు మన  రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ లోపుట్టిన అద్భుత వజ్రం కోహినూర్ వజ్రం. అందుకే,అందం, ఆస్తి, చదువు, అన్నీ ఉన్న వారిని, మన వాళ్ళు  కోహినూర్ వజ్రంతో పోలుస్తారు. వాడి కేంటి కోహినూర్ వజ్రం అనే నానుడి అలా పుట్టిందే.  అవును. కోహినూర్ వజ్రం, ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మన గుంటూరు జిల్లాలోని గోల్కొండ గనుల్లో పుట్టిన వజ్రం. కాకతీయ రాజుల కాలంలో గుంటూరు జిల్లా, (ప్రస్తుత పల్నాడు జిల్లా) బెల్లంకొండ మండలం కోళ్లూరు గనుల తవ్వకాలలో బయట పడిన వజ్రం కోహినూర్ వజ్రం. 186 క్యారెట్ల  అద్భుత కాంతులతో (కోహినూరు అంటే,పారశీక భాషలో కాంతి పర్వతం) చారిత్రిక వజ్రంగా చరిత్ర  పుటల్లో నిలిచి పోయింది.

 కాకతీయ రాజుల కాలంలో గోల్కొండ గనుల తవ్వకాలలో బయట పడిన 186 క్యారెట్ల కోహినూర్ వజ్రం కాకతీయ రాజుల సొంతం. కాకతీయ రాజులే కోహినూర్ అసలు యజమానులు. ఆ కాకతీయ రాజులే కోహినూర్ వజ్రాన్ని తమ కుల దైవం వరంగల్ భద్రకాళీ  అమ్మవారి, ఎడమ కంటిలో ఉంచారు. అయితే అమ్మ వారి కంటి దీవెనగా  నిలిచిన కోహినూర్ వజ్రం  ఆ తర్వాత ఎన్నో చేతులు మారింది. ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఎందరో రాజులు, చక్రవర్తుల చేతులు మారింది. 

కాకతీయ రాజుల నుంచి ఢిల్లీ సుల్తాన్.,అల్లావుద్దీన్ ఖిల్జీ, చేతుల్లోకి వెళ్ళింది. కాకతీయ సామ్రాజ్యం పై 14 వ శతాబ్దిలో ఖిల్జీ దండయాత్ర చేసి, కాకతీయ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కోహినూర్ వజ్రాన్నీ సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అలా ఒకరి చేతిలోంచి మరొకరి  చేతిలోకి, మారుతూ, చివరకు ముఘల్ చక్రవర్తి,బాబర్ చేతికి చేరింది. అయితే, 1739లో, ముఘల్ చక్రవర్తి ముహ్మద్ షా ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నపర్షియన్ రాజు  నాదిర్ షా పోతూ పోతూ కోహినూర్ వజ్రాన్ని పర్షియాకు పట్టుకు పోయాడు.

 ఆ తర్వాత అక్కడి నుంచి  కోహినూర్ వజ్రం మళ్ళీ చేతులు మారి పంజాబ్  మహా రాజు రంజిత్ సింగ్ ఖజానాకు చేరింది. అయితే, 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ ను స్వాధీనం చేసుకుంది. కోహినూర్ వజ్రాన్నీ సొంతం చేసుకుంది.  అలా సొంతం చేసుకున్న వజ్రాన్నిఈస్ట్ ఇండియా కంపెనీ  బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియాకు కానుకగా బహుకరించింది. ఇప్పడు మన కోహినూర్ వజ్రం లండన్ టవర్ వద్ద ఉన్న జ్యువెల్ హౌస్  ప్రదర్శనలో ఉంది. ప్రతి సంవత్సరం లక్షల సందర్శకులు చూసి సంతోషిస్తున్నారు. అయితే  కోహినూర్ తెలుగు వజ్రం  అనే నిజం సందర్శకులు ఎవరికీ తెలియక పోవచ్చును. 

అదలా ఉంటే  కోహినూర్ వజ్రం గురించిన ఆసక్తికర విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో ఆశ్చర్య గొలిపే విషయం కోహినూర్ వజ్రం  (పురుష ద్వేషో ఏమో) ధరించిన పురుషులను దురదృష్టం వెంటాడు తుంది..ట.అందుకే, బ్రిటిష్ రాజ కుటుంబంలోని మహిళలు మాత్రమే కోహినూర్ వజ్రం ధరించారు..ట. అలాగే, కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారూ ఉన్నారు. ఎంతైనా .. ఎక్కడ ఉన్నా మన కోహినూర్ ..కోహినూరే.. కదా ..మీరు ఎప్పుడైనా లండన్ వెళితే ఒక లుక్కేసి .. ఇది  మాదే అని ఓ సారి కాలర్ ఎగరేసి.. రండి !

By
en-us Political News

  
సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చిన్న చిన్న పొరపొచ్చారు, విభేదాలు తలెత్తడం సాధారణమే. అటువంటి చిన్న ఇబ్బందే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ నార్త్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు విష్ణు కుమార్ రాజు మధ్య తలెత్తింది.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుని ఏడుగురు భక్తులు మరణించిన ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీరు. ఎంపీగా ఉండగా ఆయన తన పనితీరు కంటే న్యూడ్ వీడియోద్వారానే ఎక్కువ మందికి తెలిశారు.
దేనికైనా రెడీ అంటూ బీరాలు.. భారత్‌లో రక్తం పారిస్తామంటూ కారు కూతలు... కన్నుకి కన్ను..పన్నుకు పన్ను అంటూ డైలాగులు.. కట్ చేస్తే ఇంత వాగాడంబరాన్ని ప్రదర్శించిన పాక్ ఆర్మీ చీఫ్ ఇప్పుడు మిస్సింగ్‌.
సింహాచలం అప్పన్నచందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుని ఏడుగురు మరణించిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి ఏడుగురు మరణించిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేళ జరిగిన అపశ్రుతి అత్యంత విషాదకరం. గోడ కూలడమే ప్రమాదానికి కారణం అయినప్పటికీ.. ఈ దుర్ఘటన అనేక ప్రశ్నలను తెరమీదకు తీసుకువస్తున్నది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 30) శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ సాగుతోంది.
ఒక సాధారణ కానిస్టేబుల్ గా జీవితం ప్రారంభించి.. ఐపీఎస్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అందరికీ సాధ్యమయ్యే విషయం అసలే కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఉదయ కృష్ణారెడ్డి.
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
భవిష్యత్ లో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. లిక్కర్ స్కాంపై తనను అడిగితే పూర్తి వివరాలు చెప్పేస్తానని ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో విజయసాయిరెడ్డిని విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
మెట్రోస్టేషన్లు, రైళ్లలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లపై మెట్రో రైళ్లలో ప్రకటనపై పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణకు హైదరాబాద్ మెట్రో రైలు తరుపున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనలు ఇప్పుడు వేయడంలేదన్న ఏజీ పేర్కొన్నారు. మెమో దాఖలు చేసినట్లు తెలిపిన ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 4న పుష్ప-2 రిలీజ్ సందర్భంగా, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ 5 నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్‌గా ఉందని తండ్రి భాస్కర్ తెలిపారు. ఈ ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్‌తో సహా థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో బన్నీనీ ఏ11 నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు.
సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా బి.ఆర్. గవాయ్ ఎన్నికయ్యారు. గవాయ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. మే 14న సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీజేఐ పదవి చేపడుతున్న రెండో దళితుడిగా జస్టిస్ గవాయ్. కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్‌ 1985లో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.