తెలుసా మీకు కోహినూర్.. మన తెలుగింటి వజ్రం!

Publish Date:Apr 6, 2025

Advertisement

కోహినూర్ వజ్రం గురించి మనం ఎక్కడో ఎప్పుడో వినే ఉంటాం. అవును చిన్నప్పడు పాఠ్య పుస్తకాల్లో ఎక్కడో చదువుకునే ఉంటాం. అయితే, ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలలో ఒకటైన కోహినూర్ వజ్రం ఇప్పడు ఎక్కడుందో, మనలో చాలా మందికి తెలియదు. ఇప్పడు ఎక్కడ వుందో అనే కాదు, అసలు ఎక్కడ పుట్టిందో, అక్కడికి ఎలా చేరిందో కూడా మనకు తెలియదు. అవును. ప్రపంచ ప్రసిద్ది చెందిన కోహినూర్ వజ్రం  పుట్టు పూర్వోత్తరాలు, కుల గోత్రాలు మనలో చాలా మందికి తెలియదు. తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే..  ఎక్కడెక్కడో తిరిగి, ఎన్నో చేతులు మారిన కోహినూర్ వజ్రం నిజానికి  మన తెలుగింటి వజ్రం. కోహినూర్ పుట్టిల్లు మన  రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ లోపుట్టిన అద్భుత వజ్రం కోహినూర్ వజ్రం. అందుకే,అందం, ఆస్తి, చదువు, అన్నీ ఉన్న వారిని, మన వాళ్ళు  కోహినూర్ వజ్రంతో పోలుస్తారు. వాడి కేంటి కోహినూర్ వజ్రం అనే నానుడి అలా పుట్టిందే.  అవును. కోహినూర్ వజ్రం, ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మన గుంటూరు జిల్లాలోని గోల్కొండ గనుల్లో పుట్టిన వజ్రం. కాకతీయ రాజుల కాలంలో గుంటూరు జిల్లా, (ప్రస్తుత పల్నాడు జిల్లా) బెల్లంకొండ మండలం కోళ్లూరు గనుల తవ్వకాలలో బయట పడిన వజ్రం కోహినూర్ వజ్రం. 186 క్యారెట్ల  అద్భుత కాంతులతో (కోహినూరు అంటే,పారశీక భాషలో కాంతి పర్వతం) చారిత్రిక వజ్రంగా చరిత్ర  పుటల్లో నిలిచి పోయింది.

 కాకతీయ రాజుల కాలంలో గోల్కొండ గనుల తవ్వకాలలో బయట పడిన 186 క్యారెట్ల కోహినూర్ వజ్రం కాకతీయ రాజుల సొంతం. కాకతీయ రాజులే కోహినూర్ అసలు యజమానులు. ఆ కాకతీయ రాజులే కోహినూర్ వజ్రాన్ని తమ కుల దైవం వరంగల్ భద్రకాళీ  అమ్మవారి, ఎడమ కంటిలో ఉంచారు. అయితే అమ్మ వారి కంటి దీవెనగా  నిలిచిన కోహినూర్ వజ్రం  ఆ తర్వాత ఎన్నో చేతులు మారింది. ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఎందరో రాజులు, చక్రవర్తుల చేతులు మారింది. 

కాకతీయ రాజుల నుంచి ఢిల్లీ సుల్తాన్.,అల్లావుద్దీన్ ఖిల్జీ, చేతుల్లోకి వెళ్ళింది. కాకతీయ సామ్రాజ్యం పై 14 వ శతాబ్దిలో ఖిల్జీ దండయాత్ర చేసి, కాకతీయ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కోహినూర్ వజ్రాన్నీ సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అలా ఒకరి చేతిలోంచి మరొకరి  చేతిలోకి, మారుతూ, చివరకు ముఘల్ చక్రవర్తి,బాబర్ చేతికి చేరింది. అయితే, 1739లో, ముఘల్ చక్రవర్తి ముహ్మద్ షా ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నపర్షియన్ రాజు  నాదిర్ షా పోతూ పోతూ కోహినూర్ వజ్రాన్ని పర్షియాకు పట్టుకు పోయాడు.

 ఆ తర్వాత అక్కడి నుంచి  కోహినూర్ వజ్రం మళ్ళీ చేతులు మారి పంజాబ్  మహా రాజు రంజిత్ సింగ్ ఖజానాకు చేరింది. అయితే, 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ ను స్వాధీనం చేసుకుంది. కోహినూర్ వజ్రాన్నీ సొంతం చేసుకుంది.  అలా సొంతం చేసుకున్న వజ్రాన్నిఈస్ట్ ఇండియా కంపెనీ  బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియాకు కానుకగా బహుకరించింది. ఇప్పడు మన కోహినూర్ వజ్రం లండన్ టవర్ వద్ద ఉన్న జ్యువెల్ హౌస్  ప్రదర్శనలో ఉంది. ప్రతి సంవత్సరం లక్షల సందర్శకులు చూసి సంతోషిస్తున్నారు. అయితే  కోహినూర్ తెలుగు వజ్రం  అనే నిజం సందర్శకులు ఎవరికీ తెలియక పోవచ్చును. 

అదలా ఉంటే  కోహినూర్ వజ్రం గురించిన ఆసక్తికర విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో ఆశ్చర్య గొలిపే విషయం కోహినూర్ వజ్రం  (పురుష ద్వేషో ఏమో) ధరించిన పురుషులను దురదృష్టం వెంటాడు తుంది..ట.అందుకే, బ్రిటిష్ రాజ కుటుంబంలోని మహిళలు మాత్రమే కోహినూర్ వజ్రం ధరించారు..ట. అలాగే, కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారూ ఉన్నారు. ఎంతైనా .. ఎక్కడ ఉన్నా మన కోహినూర్ ..కోహినూరే.. కదా ..మీరు ఎప్పుడైనా లండన్ వెళితే ఒక లుక్కేసి .. ఇది  మాదే అని ఓ సారి కాలర్ ఎగరేసి.. రండి !

By
en-us Political News

  
కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నమని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కాకపోతే ఎప్పటిలోగా కులగణన చేపడతారో చెప్పాలని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కులగణన విషయంలో తెలంగాణ మోడల్ స్టేట్ గా మారిందని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో పోతిరెడ్డిపాలెం వద్ద ఘోర  కారు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్‌లోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  మరో నలుగురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా నారాయణ మెడికల్‌ కాలేజ్‌ స్టూడెం‍ట్స్‌గా తెలుస్తోంది. పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం ఘటనలో మృతులు మెడిసిన్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న నరేష్, అభిషేక్,  జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా పోలీసులు ప్రకటించారు. గాయపడిన నవనీత్‌ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన ఈ కమిషన్‌ను నియమించింది. ఇందులో సభ్యులుగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు ఉంటారని పేర్కొంది. అలాగే, ఈ కమిషన్‌కు సివిల్‌ కోర్టు అధికారాలు కల్పిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో అధినేత కేసీఆర్‌కు సభ మొత్తంలో తన పేరు ఎత్తడానికి కూడా ధైర్యం రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం శ్రీమహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నరు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతు 16నెలలుగా కేసీఆర్ ఇంట్లో కూర్చుని జీతం తీసుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ ఇంట్లో నుండి కాలు కదపకుండా అన్ని వసతులు అనుభవిస్తున్నారా అని ప్రశ్నించారు. మీరెవరు? స‌భ‌కు రాకుండా మమ్మ‌ల్ని ప్ర‌శ్నించే నైతిక హ‌క్కు మీకు ఉందా అని నిల‌దీశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌ను మొద‌టి 10 సంవ‌త్స‌రాలు కోతుల గుంపుకు అప్ప‌జెప్పిన‌ట్టు అయింద‌ని మండిప‌డ్డారు.
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశ జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ సహ పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాస రాజును ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. టీటీడీ జాయింట్ ఈవోగా ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత రిటైర్డ్ అయ్యారు. ఈవోగా పనిచేయాలని భావించినా అవకాశం రాలేదు.
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల  నిర్వహించనుండటంపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో తన మేనకోడలికి చెందిన ఓ వాణిజ్య సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ విషయంపై మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ద్వారా పవిత్రమైన స్త్రీ జాతిని అవమానిస్తున్నారని నారాయణ ఆరోపించారు.
సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న అపశ్రుతిలో ఏడుగురు భక్తులు మరణించిన ఘటనపై మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అధికారులపై ఫైర్ అయ్యారు.
పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాని కదిల్చి వేసింది. కుల, మత, ప్రాంత, రాజకీయ విభేదాలకు అతీతంగా ప్రజలందరూ ఉగ్రదాడిని ఖండిస్తున్నారు. పాకిస్థాన్ దుశ్చర్యను ప్రపంచ దేశాలు సైతం ఖండిస్తున్నాయి. మన దేశానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. దేశంలోనూ ఎక్కడిక్కడ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా స్వచ్చందంగా ప్రజలు ర్యాలీలు నిర్విహిస్తున్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో 98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్‌ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఎన్నికల తర్వాత విశాఖలో ఇద్దరు నాయకులు వైసీపీకి గట్టి దెబ్బ కొట్టారు... ఎన్నికల్లో ఓటమి చెందిన వెంటనే క్షణం ఆలోచించకుండా పార్టీ పదవులకు రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చారు మాజీమంత్రి అవంతి శ్రీనివాస్. వైసిపి నుంచి కార్పొరేటర్ గా గెలిచిన కీలకమైన సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసr కోలుకోలేని దెబ్బ కొట్టారు ఆయన కుమార్తె లక్ష్మీ ప్రియాంక.
కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత సలహా బోర్డును ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు ఛైర్మన్‌గా మాజీ రా అండ్ రా చీఫ్ అలోక్ జోషిని ఛైర్మన్‌గా నియమించారు. జాతీయ భద్రతా విషయాల్లో అనుభవం ఉన్న అలోక్ జోషి నాయకత్వంలో ఈ బోర్డు దేశ భద్రతా వ్యూహాలను మరింత బలోపేతం చేయనుంది. ఈ బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు, వీరంతా తమ రంగాల్లో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.