పార్లమెంట్ లో హాస్యోక్తులు!

Publish Date:Apr 6, 2025

Advertisement

పార్లమెంట్ సమావేశాలంటే, ఏముంది? మూడు వాయిదాలు, ఆరు వాకౌట్లు. కాదంటే, గౌరవ సభ్యుల అరుపులు, కేకలు.. నిరసనలు, నినాదాలు, ఇంతే కదా అని ఎవరైనా అనుకుంటే  అనుకోవచ్చును. తప్పు  కాదని చెప్ప లేము. 
అవును మరి   సీయింగ్ ఈజ్ బిలీవింగ్  అని కదా అంటారు. సో.. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా అందరం చూస్తున్నది అదే అయినప్పుడు.. కళ్ళ ముందు కనిపిస్తున్న చిత్ర విచిత్ర, విన్యాస వికారాలను, కాదని అనడం కుదరదు. అందుకే, పార్లమెంట్ ను ఫిష్ మార్కెట్ అన్నా.. గౌరవ సభ్యుల ప్రవర్తనను సంఘ వ్యతిరేక శక్తులతో పోల్చినా.. సభ లోపల కన్ను గీటడం, కౌగిలింతలు, ముద్దులు మురిపాలు ప్రదర్శించడం వంటి చర్యలను పిల్ల చేష్టలుగా కొట్టి వేసినా  తప్పు పట్టలేని పరిస్థితి పార్లమెంట్  ప్రతిష్ట దిగజారిందనే ఆవేదన  ప్రజల్లోనే కాదు పార్లమెంట్ సభ్యుల్లో కూడా  వ్యక్తమవుతోంది.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి పెద్దలు, పలు సందర్భాలలో పార్లమెంట్  పనితీరు పట్ల ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. నిజానికి  గత కొంత కాలంగా, పార్లమెంట్  పని తీరు   నానాటికి తీసికట్టు నాగం బొట్లు  అన్నట్లు దిగాజరుతోందనే విషయంలో రెండో అభిప్రాయం లేదు. అయితే, శుక్రవారం ( ఏప్రిల్ 4)తో ముగిసిన, పార్లమెంట్ బడ్జెట్  సమావేశాలు, ప్రారంభంలో ఎలా సాగినా, చివరి వారంలో  వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల్లో జరిగిన చర్చ  సందర్భంగా కొంత భిన్నమైన, సంతోషకరమై వాతావరణం సభలో కన్పించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్త మవుతోంది. అవును  మన కళ్ళను మనం, మన చెవులను మనం నమ్మలేనట్లుగా ఉభయ సభల్లో చాలా లోతైన చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ తర్వాత ఉభయసభలు బిల్లును ఆమోదించాయి. 

నిజమే  చర్చ సందర్భంగా  అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు షరా మాములుగానే ఉన్నాయి. అయినా ఈ సారి సభ  సమ్ థింగ్ స్పెషల్ ’ అన్న  ఫీలింగ్ అయితే మిగిలింది. అలాగే  పార్లమెంట్ ఉభయ సభల్లో ఇటీవల కాలంలో ఎప్పడూ లేని విధంగా,  డేట్  మారే వరకూ, మారిన తర్వాత కూడా బిజినెస్  కొనసాగింది. వక్ఫ్‌ బిల్లుపై లోక్‌సభలో 14 గంటలపాటు చర్చ జరగ్గా. రాజ్యసభలో 17గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. రాజ్యసభ చరిత్రలోనే ఇదో అరుదైన విషయమని ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. రాజ్యసభలో చర్చ ప్రారంభమైన మరుసటి రోజు ఉదయం 4.02 గంటల వరకు కొనసాగింది. అయితే ఇలాంటి పరిస్థితి, ఇంతటి సుదీర్ఘ చర్చ జరిగిన సందర్భాలు లేవా అంటే, ఉన్నాయి. 

చరిత్రలోకి వెళితే, 1981లో రాజ్యసభలో ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ బిల్లుపైనా ఉదయం 4.43 గంటల వరకు చర్చ కొనసాగినట్లు నివేదికలు చెబుతున్నాయి. లోక్‌సభలో  స్టేట్‌ ఆఫ్‌ అవర్‌ డెమోక్రసీ పై గతంలో 20.08 గంటల పాటు సాగిన చర్చే ఇప్పటివరకు సుదీర్ఘమైనది .ఆ తర్వాత 1993లో రైల్వే బడ్జెట్‌పై 18.35గంటల చర్చ జరిగింది. 1998లో రైల్వే బడ్జెట్‌పైనా 18.04 గంటలు, మైనార్టీల భద్రతకు సంబంధించి బిల్లుపై 17.25గంటలు, 1981లో ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ బిల్లుపై రాజ్యసభలో 16.58 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. 

ఇదంతా, ఒకెత్తు అయితే, చాలా  రోజుల తర్వాత సభలో సరస సంభాషణలు, నవ్వులు కూడా వినిపించాయి. అది కూడా  ఎప్పుడూ సీరియస్ గా ఉండే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సమాజ వాదీ పార్టీ ( ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్  కు సరదాగా అంటించిన చురక సభలో నవ్వులు పూయించింది. అఖిలేష్ యాదవ్ తన ప్రసనంలో భాగంగా    ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకునే, బీజేపీకి, పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవడం చేత కావడం లేదని  ఒక వ్యంగ బాణం వేశారు. అందుకు సమాధానంగా అమిత్ షా,  ఇతర పార్టీలలో అధ్యక్షుని ఎన్నిక అంటే, నలుగురైదుగురు కుటుంబ సభ్యులు కూర్చుని తమలో ఒకరిని అధ్యక్షుడు అనుకుంటే సరి పోతుంది. కానీ, బీజేపీ అధ్యక్షుని ఎన్నికలో 12 కోట్ల మంది సభ్యులకు భాగస్వామ్యం ఉంటుంది, సో, సహజంగా అధ్యక్షుని ఎన్నిక కొంత ఆలస్యం అవుతుందని, నవ్వుతూ  సమాధానం ఇచ్చారు.అంతటితో ఆగకుండా, అఖిలేష్ యాదవ్ ను ఉద్దేశించి,మరో 25 సంవత్సరాలు, మీ పార్టీకి మీరే అధ్యక్షులుగా ఉంటారు  అంటూ నవ్వేశారు. అమిత్ షా నవ్వుతో, అఖిలేష్ యాదవ్  సహా  సభ్యులు నవ్వులు కలిపారు. అలాగే  మంత్రి రామదాస్ అతవాలే  రాజ్యసభలో  కాంగ్రెస్ పార్టీ పై చురకలువేస్తూ చేసిన ప్రసంగం కూడా సభలో నిండుగా నవ్వుల పూయించింది. ఖర్గే సహా కాంగ్రెస్ అభ్యులను కూడా నవ్వించారు. ఇప్పడు ఈ రీల్స్  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికి, ఒకప్పడు పార్లమెంట్ లో హస్యోక్తులకు కొదవ ఉండేది కాదు. ఇప్పడు ఎప్పుడో ఇలా.. జన్మానికో శివరాత్రి..

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.