Publish Date:Oct 15, 2018
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలంగాణ జేఏసీకి ఆయనే నేతృత్వం వహించారు. అంతేకాదు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వంలో కోదండరాంకు మంచి హోదా లభిస్తుందని అంతా భావించారు. అయితే అంచనాలు తారుమారయ్యాయి. 2014 ఎన్నికల తరువాత పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్, కోదండరాంల మధ్య దూరం పెరిగింది. చివరకు కోదండరాం టీజేఎస్ పేరుతో కొత్త రాజకీయపార్టీకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు టీజేఎస్ ముందున్న ప్రధాన లక్ష్యం టీఆర్ఎస్ ను ఓడించడం. ఇప్పటికే కేసీఆర్ ఎన్నికలకు ఏడెనిమిది నెలలు ముందుగానే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. త్వరలో ముందస్తు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, సిపిఐలతో కూడిన మహాకూటమితో టీజేఎస్ చేతులు కలిపింది.
ప్రస్తుతం మహాకూటమిలో సీట్ల కేటాయింపు గురించి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో మహాకూటమి కోర్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో కోదండరాం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. కోదండరాంకు రాష్ట్ర వ్యాప్త ఆదరణ ఉంది.. కాబట్టి ఆయన్ను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలో దించి ఒకే నియోజకవర్గానికి పరిమితం చేస్తే కూటమికి నష్టం కలిగే అవకాశముందని ఈ భేటీలో నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పోటీకి దూరంగా ఉంచి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనతో ప్రచారం చేయించాలని వారు భావిస్తున్నారట. పోటీకి దూరంగా ఉన్నంత మాత్రాన కోదండరాం రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎన్నికల్లో కూటమి విజయం సాధించాక ఆయనకు డిప్యూటీ సీఎం లేదా ఆ హోదాతో సమానమైన పదవి ఇవ్వాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు టీజేఎస్ అభ్యర్థులను కూడా హస్తం గుర్తుపైనే పోటీ చేయించాలని కోర్ కమిటీ భావిస్తోందని సమాచారం. కొత్త గుర్తుతో జనం అయోమయానికి గురికాకుండా ఉండేందుకు ఈ వ్యూహం దోహదపడుతుందన్నది కోర్ కమిటీ నేతల అభిప్రాయం. తాను పోటీ చేయకుండా కేవలం ప్రచారానికే పరిమితం అవ్వడం.. అలాగే తమ పార్టీ అభ్యర్థులను హస్తం గుర్తుపై పోటీ చేయించడం.. వీటిపై కోదండరాం ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodandaram-not-to-contest-39-83899.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.