Publish Date:May 30, 2023
మహానాడు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఉక్రోషంతోనో, మరో కారణంతోనో వైసీపీ నేతలు తమ నోటికి పని చెప్పారు. విపక్షంపై మరీ ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబుపై నోటికి పని చెప్పాలంటే.. కొడాలి నాని అందరి కంటే ముందుంటారు. ఇప్పుడు కూడా ఎప్పటిలాగే మినీ మేనిఫెస్టోపై దుమ్మెత్తి పోయడంలో కూడా నాని ముందంజలో ఉన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై ఆయన తన మాటల దాడి ఉధృతి పెంచారు. ఈ క్రమంలో నాని, కాపు సామాజిక వర్గం పై చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసే కొడాలి నాని మహానాడులో ఆయన ప్రకటించిన మినీ మేనిఫెస్టోను విమర్శించే క్రమంలో తన బూతుల పంచాంగం విప్పారు. ఆ క్రమంలో ఆయన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి..ఇప్పుడు జయంతి ఉత్సవాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అదే ఊపులో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారంటూ.. కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి పరుష పదజాలం వాడారు. ఇక ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గాని.. ఇప్పుడు కాపు వర్గం కొడాలి నానిపై ఫైర్ అవుతోంది. కొడాలి నాని కాపు వర్గానికి క్షమాపణ చెప్పాలని, ఆయనను వైసీపీ నుంచి బహిష్కరించాలని కాపులు డిమాండ్ చేస్తున్నారు.
కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించిన కొడాలి నానిని వైసీపీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన డిమాండ్ చేసింది. కొడాలి నాని గుడి వాడలో గెలిచిందే కాపు ఓట్లతోనేనని, రాబోయే ఎన్నికల్లో గుడివాడలో ఓడించి కాపుల ఐక్యతను చాటుతామని జనసేన నేత లంకిశెట్టి బాలాజీ అన్నారు.
గుడివాడలో కాపు సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో కాపు ఓట్లు ఉన్నాయి. ఇంత కాలం గుడివాడలో కాపు సామాజిక వర్గం కొడాలి నానికి మద్దతు ఇస్తూ వచ్చింది. అయితే తన నోటి దురుసుతనంతో ఇప్పుడాయన వారిని దూరం చేసుకున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. నాని కాపులకు బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న స్థాయిలో కాపు సామాజిక వర్గం నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.
నోటికి గట్టిగా పని చెప్పడం.. మోటుగా.. కరుకుగా సమాధానం చెప్పడం.. అలవోకగా అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం.. వైకాపా నేతలకు సర్వసాధారణం. అలా బూతు మాటలను ప్రయోగిస్తేనే.... పార్టీలో గుర్తింపు లభిస్తుందన్న నమ్మకం వారిది. అయితే ఈ సారి మాత్రం నాని తన నోటీ దురుసుతనం వల్ల ఇబ్బందుల్లో పడ్డారనే చెప్పాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodali-nani-in-trouble-39-156062.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.