Publish Date:Jul 26, 2025
ఏ కులమూ నీదంటే గోకులమూ మాదందీ.. అన్న పాట ఒకటుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ విషయంలో కిషన్ రెడ్డి వేసిన ప్రశ్న సరిగ్గా అలాగే కనిపిస్తోంది. కుల గణన విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల మంటలు రగులుతున్నాయ్. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ప్రెజంటేషన్లో.. ప్రధాని మోడీని కన్వర్టెడ్ బీసీగా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం స్థాయిలోని వ్యక్తి మిడి మిడి జ్ఞానంతో అవాకులు చెవాకులు పేలుతున్నారని తీవ్రంగా మండి పడ్డారు కిషన్ రెడ్డి. అంతెందుకు మీ అధినేత రాహుల్ గాంధీ కులమేదో చెప్పాలని నిలదీశారు.
నిజానికి రాహుల్ గాంధీకి మతమే సరిగా ఉండదు. కులం ఎక్కడి నుంచి వస్తుందన్న కామెంట్ వినిపిస్తోంది. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ సెమీ హిందూ అయినా.. ఆయన వివాహమాడిన సోనియా గాంధీ ఇటలీకి చెందిన ఫక్తు క్రిష్టియన్. అందుకే ఆమె తన కుమార్తెను రాబర్ట్ వాద్రా అనే క్రిష్టియన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా డీప్ గా వెళ్తే.. రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్ అనే పార్శీని పెళ్లాడినట్టు చెబుతారు. కొందరైతే.. నెహ్రూలు కాశ్మీరీ పండిట్లు కారని.. వారు కూడా ముస్లిములేనని అంటారు.
ప్రస్తుతం కశ్మీర్ సీఎంగా ఉన్న ఒమర్ అబ్ధుల్లా హిందూ అనీ.. ఆ మాటకొస్తే ఎంఐఎం అధినేతలైన ఓవైసీలు కూడా తొలుత రాజస్థాన్ కి చెందిన హిందువులేనని అంటారు. ఇదిలా ఉంటే.. బీసీలు బీసీలని అంతగా గొంతెచించుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. దమ్ముంటే రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించి.. బీసీ అయిన పొన్నం ప్రభాకర్ ని గానీ ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ ని గానీ ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు.
దీంతో కాంగ్రెస్ అనవసరంగా ఈ గొడవలో చిక్కినట్టయ్యింది. మోడీ ఒక వేళ కన్వర్టెడ్ బీసీ అయినా అది జరిగింది కూడా కాంగ్రెస్ హయాంలోనే... అంటారు కిషన్ రెడ్డి. 1994లో గుజరాత్ లో కాంగ్రెస్ అధి కారంలో ఉన్నపుడు.. మండల్ కమిషన్ నివేదికల ప్రకారం.. మోడీ కులాన్ని బీసీల్లో చేర్చారనీ.. ఆ టైం లో మోడీ కనీసం ఎమ్మెల్యే కూడా కారని అంటారు కిషన్. ఆ తర్వాత కూడా చాలా కులాలను ఎస్సీ ఎస్టీల్లో చేర్చారనీ మరి వారిని కూడా కన్వర్టెడ్ ఎస్సీ ఎస్టీలని అంటారా? అని కూడా ప్రశ్నించారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల జరగాలని బీజేపీ కూడా కోరుకుంటోందని.. అయితే అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజరుద్దీన్, షబ్బీర్ అలీ వంటి వారికి కూడా బీసీ రిజర్వేషన్లు కాకుండా అచ్చమైన బీసీ కులాలకు మాత్రమే ఆ ఫలాలు దక్కాలన్నది తమ అభిమతంగా చెప్పారు కిషన్ రెడ్డి. మరి చూడాలి ఈ బీసీల చిచ్చు ఏ కార్చిచ్చుగా మారుతుందో?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kishan-reddy-question-rahul-caste-39-202769.html
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
Publish Date:Dec 31, 2025
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.