ఆంధ్రప్రదేశ్ లో ప్రచార పర్వం ఈ శనివారం (మే 11) సాయంత్రంతో ముగియనుంది. అంటే నిండా మూడు రోజుల వ్యవధి కూడా లేదు. ఈ దశలో రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా సీని పరిశ్రమ వారు రంగంలోకి దిగి పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార రంగంలోకి దూకడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా విశేష ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న నటుల ప్రచారం వైసీపీ శ్రేణులను గుబెలెత్తిస్తోంది.
మరీ ముఖ్యంగా ఆ కార్యక్రమానికి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరించడంతో వారి ప్రచారం వైసీపీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ నటుల గురించి రోజా చేసిన వ్యాఖ్యలకు క్రిర్రాక్ జబర్దస్త్ రిటార్డ్ ఇచ్చి ఆమె పరువును నిలువునా తీసేశారు. ఇంతకీ రోజా ఏమన్నారంటే.. జబర్దస్త్ నటులు చాలా చాలా చిన్న కళాకారులు అంటూ చులకనగా మాట్లాడడమే కాకుండా వాళ్లు కేవలం నాలుగు డబ్బుల కోసం మాత్రమే వారు పనన్ తరఫున ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. అదీ కాక, ఇప్పుడిప్పుడే సినిమాలలో వేషాలు వేస్తున్న వారు పవన్ కోసం ప్రచారం చేయకుంటే ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయం కూడా వారి ప్రచారానికి కారణమని రోజా అన్నారు.
అయితే రోజా వ్యాఖ్యలను తప్పుపట్టిన కిర్రాక్ ఆర్పీ ఆమెకు దిమ్మదిరిగే రిటార్డ్ ఇచ్చాడు. రోజా ఏమన్నా గోప్ప స్టారా అంటూ.. జబర్దస్త్ కమేడియన్లతో పోలిస్తే ఆమె ప్రతిభ చాలా స్వల్పమని తీసి పారేశాడు. ఆమెకు ఏమైనా ఆస్కార్ అవార్డులు వచ్చాయా? జాతీయ పరుస్కారాలు ఏమైనా తీసుకున్నారా? అని ప్రశ్నించారు. గెటప్ శ్రీను, హైపర్, సుడిగాలి సుధీర్ వంటి వంటి వారి టాలెంట్ తో పోలిస్తే ఆమె నటనా సామర్ధ్యం ఏపాటిదని ఎద్దేవా చేశాడు. అంతే కాకుండా రాష్ట్రంలో ఓడిపోయే మొదటి సీటు రోజాదే అంటూ జోస్యం చెప్పాడు. ఆమెకు డిపాజిట్ దక్కితే గొప్పే అన్నాడు.
మొత్తం మీద రోజా పిఠాపురంలో జనసేనానికి మద్దతుగా ప్రచారం చేసుకుంటూ తమ దోవన తాము వెడుతున్న జబర్దస్త్ కమేడియన్లను తక్కువ చేసి మాట్లాడి కెలుక్కున్నట్లైంది. కిర్రాక్ ఆర్పీ రిటార్డ్ తో ఆమెకు సౌండ్ లేకుండా పోయింది. ఇంత కాలం తన పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించిన ఆర్పీలాంటి వారు ఒక్కసారిగా రివర్స్ అవ్వడంతో కంగుతిన్నారు. ఆర్పీ రిటార్డ్ రోజా పరువును రాష్ట్ర వ్యాప్తంగా తీసేసినట్లైందని పరిశీలకులు సైతం అంటున్నారు. తన సొంత నియోజకవర్గం నగరిలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న రోజా అక్కడి ప్రచారాన్ని సజావుగా సాగించుకుని వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేసుకోకుండా జబర్దస్త్ కమేడియన్లను రెచ్చగొట్టి మరీ తిట్టించు కున్నట్లైం దంటు న్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kirrak-rp-jabardast-retard-to-roja-25-175472.html
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు కాంగ్రెస్ పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్
నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.
నారా చంద్రబాబునాయుడు ప్రజలకు కష్టాలలోనూ, సంక్షోభంలోనూ గుర్తుకు వచ్చే నేత. కష్టాల నుంచీ, సంక్షోభం నుంచీ తన దార్శనికతతో రాష్ట్రాన్ని గట్టెక్కించగల నాయకుడిగా ఏపీ ప్రజలు నమ్మే నేత చంద్రబాబునాయుడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా విశ్వసనీయతను చూరగొన్న చంద్రబాబు.. ఇప్పటి వరకూ అధికారంలో కన్నా విపక్ష నేతగానే ఎక్కువ కాలం ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికే పట్టం కట్టారని ‘తెలుగువన్’ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? గెలిచే అభ్యర్థులు ఎవరు..? ఓటమి చవిచూసే వారు ఎవరు? అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి.. అధికార పార్టీ వైసీపీ నుంచి ఓడిపోనున్న ప్రముఖులు ఎవరు? అనే ఉత్కంఠ ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరిలో నెలకొంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. మరోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా..? చంద్రబాబు సీఎం సీటును అదిరోహించబోతున్నారా? ఓటర్లు ఎవరికి మద్దతు ఇచ్చారు..? అనే విషయాలపై ఏపీ ప్రజల్లోనేకాదు, దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.